PV Sindhu: టోక్యో ఒలింపిక్స్లో కాంస్యం సాధించిన సింధుకు అభినందనల వెల్లువ
టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన పీవీ సింధు పట్ల ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, తెలంగాణ సీఎం కేసీఆర్, చంద్రబాబుతో సహా మరికొందరు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు....
ఇంటర్నెట్డెస్క్: టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన పీవీ సింధుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్, తెదేపా అధినేత చంద్రబాబు, క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్, ప్రముఖ సినీనటులు చిరంజీవి, మహేశ్ బాబుతో సహా మరికొందరు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. కీలకమైన పోరులో సింధు అద్భుత ప్రదర్శన చేసిందని కొనియాడారు. వరుసగా రెండు ఒలింపిక్స్ల్లోనూ పతకం సాధించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు సింధు రికార్డు విజయం పట్ల ఆమె తండ్రి రమణ మీడియాతో ముచ్చటించారు. తన కూతుర్ని ప్రోత్సహించి ఇంతటి ఘన విజయాన్ని సాధించేందుకు దోహదపడిన భారత ప్రభుత్వం, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, మీడియాకు రమణ కృతజ్ఞతలు తెలిపారు.
‘‘సెమీ ఫైనల్లో ఓటమి తర్వాత సింధుపై మరింత ఒత్తిడి పెరిగింది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ నా కూతురు ఒత్తిడిని తట్టుకొని దేశానికి పతకం సాధించింది. వరుసగా రెండో ఒలింపిక్స్లో పతకం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా నిలిచిన నా కుమార్తె పట్ల గర్వంగా ఉంది. ఇప్పుడెంతో సంతోషంగా ఉంది’’ రమణ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
జగన్ ఎదుటే జనసేనానికి జేజేలు.. విద్యార్థుల నినాదాలతో అవాక్కయిన సీఎం
-
‘ఉండి’ అభ్యర్థిగా 22న నామినేషన్: రఘురామ
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!