Tokyo Olympics: నాగల్, మనికా ముందంజ.. సాయి ప్రణీత్ నిరాశ
వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను సాధించిన రజత పతకంతో టోక్యో ఒలింపిక్స్లో బోణీ కొట్టిన భారత్కు మిగతా క్రీడా విభాగాల్లో మిశ్రమ ఫలితాలు లభిస్తున్నాయి. టెన్నిస్, టేబుల్ టెన్నిస్లో దేశీయ
టోక్యో: వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను సాధించిన రజత పతకంతో టోక్యో ఒలింపిక్స్లో బోణీ కొట్టిన భారత్కు మిగతా క్రీడా విభాగాల్లో మిశ్రమ ఫలితాలు లభిస్తున్నాయి. టెన్నిస్, టేబుల్ టెన్నిస్లో దేశీయ ఆటగాళ్లు సుమిత్ నాగల్, మనికా బాత్రా తొలి రౌండ్ నెగ్గగా.. ఆర్చరీ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత పోరు ముగిసింది.
వరల్డ్ నం. 3 జోడీకి చిరాగ్- సాత్విక్ షాక్
బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ గ్రూప్ మ్యాచ్లో భారత్ శుభారంభం చేసింది. ప్రపంచ నంబరు 3 జోడీపై చిరాగ్ శెట్టి - సాత్విక్ ద్వయం విజయం సాధించింది. చైనీస్ తైపీ ఆటగాళ్లు యాంగ్ లీ - చిన్ లిన్ వాంగ్ జోడీపై 21-16, 16-21, 27-24తో గెలుపొందింది.
అయితే బ్యాడ్మింటన్ గ్రూప్ మ్యాచ్లో భారత షట్లర్ సాయి ప్రణీత్ మాత్రం నిరాశపర్చాడు. ఇజ్రాయెల్ ఆటగాడు జిల్బర్మన్ మిషా చేతిలో 17-21, 15-21 తేడాతో ఓటమిపాలయ్యాడు.
పురుషుల టెన్నిస్లో నాగల్ చారిత్రక విజయం
టెన్నిస్లో భారత ఆటగాడు సుమిత్ నాగల్ సత్తా చాటాడు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ఉజ్బెకిస్థాన్ క్రీడాకారుడు డెన్నిస్ ఇస్తోమిన్పై 6-4, 6-7, 6-4 తేడాతో నాగల్ గెలుపొందాడు. ఒలింపిక్ క్రీడల్లో పురుషుల సింగిల్స్లో విజయం సాధించిన భారత మూడో ఆటగాడు ఇతడే కావడం విశేషం. అంతకుముందు 1988 సియోల్ గేమ్స్లో జీషన్ అలీ, 1996 అట్లాంటా ఒలింపిక్స్లో లియాండర్ పేస్ సింగిల్స్ విభాగంలో విజయం సాధించారు. ఆ ఏడాది పేస్ కాంస్య పతకం కూడా సాధించాడు. 25ఏళ్ల తర్వాత నాగల్ మళ్లీ తొలి రౌండ్లో విజయం సాధించి ఒలింపిక్ పతకంపై ఆశలు రేపుతున్నాడు.
ఇక టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో భారత్ విజయం సాధించింది. గ్రేట్ బ్రిటన్ క్రీడాకారిణి టిన్ టిన్ హోపై 4-0తో మనికా బాత్రా గెలుపొందింది. అయితే అంతకుముందు టేబుల్ టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్స్లో శరత్ కమల్ - మనికా బాత్రా ద్వయం ఓటమిపాలైంది.
దీపిక, ప్రవీణ్ జోడీ.. ప్చ్
ఆర్చరీ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత్ పోరు ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో దక్షిణ కొరియా చేతిలో దీపిక కుమారి, ప్రవీణ్ జాదవ్ జోడీ 2-6 తేడాతో ఓటమిపాలైంది. ఇక 10 మీటర్ల పురుషుల ఎయిర్ పిస్టల్ విభాగం ఫైనల్లో కూడా భారత్కు ఓటమి తప్పలేదు.
ఈ విభాగంలో అర్హత పోటీల్లో సత్తా చాటిన యువ షూటర్ సౌరభ్ చౌదరి.. రెండో ఎలిమినేషన్లో ఏడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. దీంతో పోటీ నుంచి నిష్క్రమించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్