Tokyo Paralympics: షూటింగ్లో నిరాశ.. బ్యాడ్మింటన్లో విజయాలు.. అరుణకు గాయాలు
పారాలింపిక్స్లో భారత జైత్రయాత్రకు స్వల్ప విరామం ఏర్పడింది! వరుసగా రెండో రోజు టీమ్ఇండియాకు పతకాలేమీ లభించలేదు. షూటింగ్లో రాహుల్, ఆకాశ్ విఫలమయ్యారు...
టోక్యో: పారాలింపిక్స్లో భారత జైత్రయాత్రకు స్వల్ప విరామం ఏర్పడింది! వరుసగా రెండో రోజు టీమ్ఇండియాకు పతకాలేమీ లభించలేదు. షూటింగ్లో రాహుల్, ఆకాశ్ విఫలమయ్యారు. బ్యాడ్మింటన్ గ్రూప్ దశ మ్యాచుల్లో ఈ రోజంతా విజయాలే లభించాయి. తైక్వాండో క్రీడాకారిణి అరుణకు గాయాలవ్వడంతో రెపిచేజ్ క్వార్టర్స్ నుంచి తప్పుకొంది.
షూటింగ్లో 5
భారత షూటర్ రాహుల్ జఖార్ పీ3 మిక్స్డ్ 25 మీటర్ల పిస్టల్ ఎస్హెచ్1 ఈవెంట్లో విఫలమయ్యాడు. ఫైనల్లో 35 ఏళ్ల రాహుల్ ఐదో స్థానానికి పరిమితం అయ్యాడు. ఏడో సిరీసు ముగియగానే నిష్క్రమించాడు. ర్యాపిడ్ దశలో 292, ప్రిసెషన్లో 284 మొత్తం 576 స్కోరు సాధించాడు. అంతర్జాతీయ వేదికల్లో అతడికిదే అత్యుత్తమ స్కోరు కావడం గమనార్హం. మరో భారతీయుడు ఆకాశ్ అర్హత పోటీల్లో 20వ స్థానంలో నిలిచి ఫైనల్కు అర్హత పొందలేదు. అతడు ప్రిసెషన్లో 278, ర్యాపిడ్లో 273 మొత్తం 551 స్కోరు సాధించాడు.
బ్యాడ్మింటన్లో అదుర్స్
బ్యాడ్మింటన్లో భారత్కు మంచి ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్లో సుహాస్ యతిరాజ్, తరుణ్ ధిల్లాన్, కృష్ణ నాగర్ తొలి రౌండ్లో విజయాలు అందుకున్నారు. జర్మనీ ఆటగాడు జాన్ నిక్లాస్ పాట్పై సుహాస్ 21-9, 21-3 తేడాతో 19 నిమిషాల్లో ఘన విజయం సాధించాడు. థాయ్లాండ్ షట్లర్ సిరిపాంగ్ టీమరోమ్పై తరుణ్ 21-7, 21-13 తేడాతో గెలిచాడు. రెండో సీడ్గా బరిలోకి దిగిన కృష్ణ 22-20, 21-10 తేడాతో మలేసియాకు చెందిన టారెసోహ్ డిడిన్ను ఓడించాడు. మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో పలక్ కోహ్లీ విజయం అందుకొంది. టర్కీ అమ్మాయి జెహ్రా బగ్లర్ను 21-12, 21-18 తేడాతో ఓడించింది.
అరుణకు గాయాలు
తైక్వాండోలో భారత్కు ఎదురుదెబ్బ తగిలింది. అథ్లెట్ అరుణ తీవ్రంగా గాయపడటంతో రెపిచేజ్ క్వార్టర్స్ నుంచి తప్పుకొంది. కే44-49 కిలోల విభాగంలో క్వార్టర్స్లో ఆమె పెరూ అమ్మాయి ఎస్పినోజాతో తలపడింది. ప్రత్యర్థి ఆధిపత్యం చలాయించడంతో 21-84 తేడాతో ఓడిపోయింది. వరుసగా మూడు రౌండ్లలో 26-2, 30-10, 28-9 తేడాతో వెనకబడింది. ఆమె కుడి పాదం, ఎడమచేతి ఎముకల్లో స్వల్ప చీలికలు వచ్చినట్టు తెలిసింది.
సెమీస్కు ప్రాచీ
మహిళల సింగిల్స్ 200 మీటర్ల కెనోయ్ స్ప్రింట్లో భారత అమ్మాయి ప్రాచీ యాదవ్ సెమీస్కు చేరుకుంది. వీఎల్ హీట్ 1ను ఆమె ఒక నిమిషం 11.098 సెకన్లలో పూర్తి చేసింది. స్ప్రింట్లో అగ్రస్థానంలో నిలిచిన బ్రిటన్ అమ్మాయి ఎమ్మా విగ్స్ (58.084 సెకన్లు)తో పోలిస్తే కేవలం 13.014 సెకన్లే వెనకబడింది. శుక్రవారం ఆమె సెమీస్లో అదృష్టం పరీక్షించుకోనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో