Rohit - Rahul Opening: రోహిత్-రాహుల్ల బ్యాటింగ్ మర్చిపోలేనిది: సెహ్వాగ్
ఇటీవల ఇంగ్లాండ్తో జరిగిన టెస్టు సిరీస్లో టీమ్ఇండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ అద్భుతంగా ఆడారని, వారి బ్యాటింగ్ మర్చిపోలేనిదని మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కొనియాడాడు...
ఇంటర్నెట్డెస్క్: ఇటీవల ఇంగ్లాండ్తో జరిగిన టెస్టు సిరీస్లో టీమ్ఇండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ అద్భుతంగా ఆడారని, వారి బ్యాటింగ్ మర్చిపోలేనిదని మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కొనియాడాడు. తాజాగా ఓ క్రీడా ఛానెల్తో మాట్లాడిన డాషింగ్ బ్యాట్స్మన్ వీరిద్దరి బ్యాటింగ్పైనా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. రోహిత్, రాహుల్ రాణించపోతే ఆయా టెస్టుల్లో టీమ్ఇండియా త్వరగా ఔటయ్యేదని పేర్కొన్నాడు.
‘ఈ సిరీస్లో రోహిత్, రాహుల్ చేసిన ఓపెనింగ్ భాగస్వామ్యం మర్చిపోలేనిది. వాళ్లిద్దరూ సరైన భాగస్వామ్యాలు నెలకొల్పకపోతే తరచూ విఫలమౌతున్న మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ త్వరగా క్రీజులోకి వచ్చేవారు. దాంతో టీమ్ఇండియా మరింత ముందుగానే ఆలౌటయ్యేది. వారిద్దరూ 30-40 ఓవర్లు బ్యాటింగ్ చేసి జట్టును మెరుగైనస్థితిలో నిలిపేవారు. కొన్ని సందర్భాల్లో వాళ్లు ఔటయ్యాక జట్టు తక్కువ స్కోర్లకే పరిమితమయ్యేది’ అని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. కాగా, ఈ సిరీస్లో ఓపెనర్లిద్దరూ రెండు అర్ధశతక భాగస్వామ్యాలు నెలకొల్పడమే కాకుండా ఒక శతక భాగస్వామ్యం సైతం నిర్మించారు. మరోవైపు లార్డ్స్లో రాహుల్ (129) సెంచరీ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించగా ఓవల్లో రోహిత్ (127) రెండో ఇన్నింగ్స్లో శతకం బాది టీమ్ఇండియా విజయానికి బాటలు వేశాడు. ఈ నేపథ్యంలోనే భారత్ ఈ రెండు మ్యాచ్ల్లో విజయం సాధించి 2-1తేడాతో ఆధిక్యంలో నిలిచింది. అయితే, కరోనా కేసుల కారణంగా ఐదో టెస్టు రద్దు కావడంతో సిరీస్ ఫలితంపై ఎలాంటి స్పష్టత రాలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.