నిలకడగా ఆడుతున్న భారత్
బోర్డర్-గావస్కర్ టెస్ట్ చాంపియన్షిప్లో భాగంగా ఆసీస్, భారత్ మధ్య ఆడిలైడ్లో జరుగుతన్న డేఅండ్నైట్ టెస్ట్ మ్యాచ్లో పరుగులు తీసేందుకు భారత బ్యాటర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆసీస్ పేసర్లు తమ
అడిలైడ్: బోర్డర్-గావస్కర్ టెస్ట్ చాంపియన్షిప్లో భాగంగా ఆసీస్, భారత్ మధ్య అడిలైడ్లో జరుగుతున్న డేఅండ్నైట్ టెస్ట్ మ్యాచ్లో పరుగుల కోసం భారత్ బ్యాట్స్మన్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆసీస్ పేసర్లు తమ పదునైన బంతులతో చెలరేగుతున్నారు. డిన్నర్ బ్రేక్ సమయానికి భారత్ 25 ఓవర్లలో 41/2 స్కోరు వద్ద ఉంది. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ, పుజారా ఉన్నారు. మ్యాచ్ తొలి ఓవర్ రెండో బంతికే ఆసీస్ పేసర్ స్టార్క్.. ఓపెనర్ పృథ్వీషా(0)ను క్లీన్బౌల్డ్ చేశాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన మయాంక్(17), పుజారా(17 నాటౌట్)తో కలిసి నెమ్మదిగా ఇన్నింగ్స్ను గాడిలో పెట్టేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే ఇన్నింగ్స్ 18వ ఓవర్లో కమ్మిన్స్ వేసిన గుడ్లెంగ్త్ బంతికి మయాంక్ ఔట్ అయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ(5*)కూడా నెమ్మదిగా ఇన్నింగ్స్ను ఆరంభించాడు. పుజారా చాలా ఓపిగ్గా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఆసీస్ పేసర్లు ముఖ్యంగా స్టార్క్, కమ్మిన్స్, హాజెల్వుడ్ గులాబి బంతి సీమ్ను ఉపయోగించుకుని నిప్పులు చెరుగుతున్నారు. ప్రస్తుతం డిన్నర్ తర్వాత క్రీజులోకి వచ్చిన భారత బ్యాట్స్మన్ ఆసీస్ బౌలర్లను ఎలా ఎదుర్కుంటారో చూడాలి మరి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.