IND vs SA : మూడో టెస్టూ హుష్...సఫారీలదే సిరీస్
సఫారీల గడ్డపై టెస్టు సిరీస్ సాధించి చరిత్ర సృష్టించాలనుకున్న భారత జట్టుకి మరోసారి నిరాశే ఎదురైంది. సిరీస్ సాధించాలంటే తప్పక గెలవాల్సిన మూడో టెస్టులో టీమ్ఇండియా ఘోర పరాజయం...
ఇంటర్నెట్ డెస్క్ : దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్ సాధించి చరిత్ర సృష్టించాలనుకున్న భారత జట్టుకి మరోసారి నిరాశే ఎదురైంది. సిరీస్ సాధించి చిరకాల విజయం అందుకోవాలంటే తప్పక గెలవాల్సిన మూడో టెస్టులో టీమ్ఇండియా ఘోర పరాజయం పాలైంది. ఆతిథ్య సఫారీ జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి 2-1 తేడాతో సిరీస్ను సొంతం చేసుకుంది. దక్షిణాఫ్రికా విజయంలో కీగన్ పీటర్సన్, కెప్టెన్ డీన్ ఎల్గర్, లుంగి ఎంగిడి, కగిసో రబాడ కీలకంగా వ్యవహరించారు.
ఓవర్నైట్ స్కోరు 101/2తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన దక్షిణాఫ్రికా ఎలాంటి తడబాటు లేకుండా లక్ష్యాన్ని ఛేదించింది. మరో వికెట్ మాత్రమే నష్టపోయి కావాల్సిన పరుగులను సునాయాసంగా (212) రాబట్టింది. కీగన్ పీటర్సన్ (82: 113 బంతుల్లో 10×4) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. డీన్ ఎల్గర్ (30) పరుగులు చేసి ఔటయ్యాడు. వాండర్ డస్సెన్ (41*), తెంబా బవుమా (32*) మిగతా పని పూర్తి చేశారు. ఏ దశలోనూ భారత్ జట్టు వైపు గెలుపు త్రాసు తూగలేదు. భారత బౌలర్లలో బుమ్రా, మహమ్మద్ షమి, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ పడగొట్టారు.
తొలి ఇన్నింగ్స్లో లభించిన 13 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమ్ఇండియా 198 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ (100: 139 బంతుల్లో 6×4, 4×6) శతకంతో రాణించినా.. మిగతా బ్యాటర్ల నుంచి సహకారం అందలేదు. కెప్టెన్ విరాట్ కోహ్లీ (29) ఫర్వాలేదనిపించినా.. కేఎల్ రాహుల్ (10), మయాంక్ అగర్వాల్ (7), ఛెతేశ్వర్ పుజారా (9), అజింక్య రహానె (1) విఫలమయ్యారు. దీంతో రెండో ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా ముందు 212 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
అంతకు ముందు తొలి ఇన్నింగ్స్లో భారత్ 223 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. కెప్టెన్ విరాట్ కోహ్లీ (79: 201 బంతుల్లో 12×4, 1×6), ఛెతేశ్వర్ పుజారా (43: 77 బంతుల్లో 7×4) మినహా మిగతా బ్యాటలెవరూ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కగిసో రబాడ నాలుగు, మార్కో జాన్సన్ మూడు, లుంగి ఎంగిడి, కేశవ్ మహరాజ్, అలివీర్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన దక్షిణాఫ్రికాను భారత బౌలర్లు 210 పరుగులకే ఆలౌట్ చేశారు. బుమ్రా ఐదు వికెట్ల ప్రదర్శన చేయగా.. ఉమేశ్ యాదవ్, మహమ్మద్ షమి తలో రెండు, శార్దూల్ ఠాకూర్ ఒక వికెట్ తీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ పసికందు చనిపోయింది
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!