Ganguly: లార్డ్స్లో చొక్కా విప్పి 19 ఏళ్లు!
అంతర్జాతీయ క్రికెట్లో అద్భుతాలెన్నో జరిగాయి. ఎన్నో మ్యాచులు చరిత్రలో నిలిచిపోయాయి. భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన నాట్వెస్ట్ సిరీసు ఫైనల్ కూడా అలాంటిదే. ట్రెస్కోథిక్, నాసర్ హుస్సేన్ సెంచరీ చేయడం...
నాట్వెస్ట్ ఫైనల్లో యువీ, కైఫ్ మెరుపులు గుర్తున్నాయా?
ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ క్రికెట్లో అద్భుతాలెన్నో జరిగాయి. ఎన్నో మ్యాచులు చరిత్రలో నిలిచిపోయాయి. భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన నాట్వెస్ట్ సిరీసు ఫైనల్ కూడా అలాంటిదే. ట్రెస్కోథిక్, నాసర్ హుస్సేన్ సెంచరీ చేయడం.. టీమ్ఇండియా 146కే 5 వికెట్లు కోల్పోవడం.. యువీ, కైఫ్ భాగస్వామ్యం నెలకొల్పడం.. లార్డ్స్ బాల్కనీలో గంగూలీ చొక్కా విప్పడం.. ఇవన్నీ జరిగి నేటికి 19 ఏళ్లు. ఐనా అభిమానుల మనసుల్లో ఇవన్నీ ఇంకా తాజాగానే ఉన్నాయి.
ఇద్దరి శతకాలు
లార్డ్స్ వేదికగా జరిగిన ఈ పోరులో మొదట ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ నిక్ నైట్ (14) త్వరగానే ఔటయ్యాడు. కానీ వన్డౌన్లో వచ్చిన నాసర్ హుస్సేన్ (115; 128 బంతుల్లో 10×4), మరో ఓపెనర్ మార్కస్ ట్రెస్కోథిక్ (109; 100 బంతుల్లో 7×4, 2×6) శతకాల మోత మోగించారు. వారికి తోడుగా ఆండ్రూ ఫ్లింటాఫ్ సైతం (40; 32 బంతుల్లో) దూకుడుగా ఆడటంతో ఆంగ్లేయులు 5 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేశారు.
యువీ, కైఫ్ జోరు..
ఛేదనకు దిగిన భారత్కు వీరేంద్ర సెహ్వాగ్ (45; 49 బంతుల్లో 7×4), సౌరవ్ గంగూలీ (60; 43 బంతుల్లో 10×4, 1×6) మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. అయితే వీరిద్దరూ ఎనిమిది పరుగుల వ్యవధిలో పెవిలియన్ చేరారు. మిడిలార్డర్లో దినేశ్ మోంగియా (9), సచిన్ (14), ద్రవిడ్ (5) విఫలమవ్వడంతో 146/5తో కష్టాల్లో పడింది. ఆ సమయంలో కుర్రాళ్లైన యువరాజ్ సింగ్ (69; 63 బంతుల్లో 9×4, 2×6), మహ్మద్ కైఫ్ (87*; 75 బంతుల్లో 6×4, 2×6) అద్భుతం చేశారు. జట్టు స్కోరు 267 వద్ద యువీ ఔటయ్యాడు. మరో 8 ఓవర్లే ఉండటంతో ఉత్కంఠ చెలరేగింది.
ఆఖర్లో ఉత్కంఠ..
ఇదే సమయంలో ఆండ్రూ ఫ్లింటాఫ్ భారత క్రికెటర్లను కవ్వించాడు. అయితే హర్భజన్ 13 బంతుల్లో 15 పరుగులతో ఆకట్టుకున్నాడు. కుంబ్లే ఔటైనా కైఫ్ నిలిచాడు. ఆఖరి ఓవర్లో ఫ్లింటాఫ్ వేసిన తొలి రెండు బంతులకు పరుగులు రాలేదు. ఆ తర్వాత బంతిని జహీర్ ఆన్సైడ్ నెట్టి సింగిల్కు ప్రయత్నించాడు. డైరెక్ట్గా వేసిన బంతి పక్కకు వెళ్లిపోవడంతో రెండో పరుగూ వచ్చింది. టీమ్ఇండియా మరో 3 బంతులు మిగిలుండగానే 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వెంటనే లార్డ్స్ బాల్కనీలో ఉన్న గంగూలీ తన చొక్కా విప్పి గిరగిరా ఊపుతూ సందడి చేశాడు. ఆ తర్వాత సంబరాలు మిన్నంటాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.