ఒలింపిక్స్లో మరో 4 క్రీడలకు అవకాశం!
ఈసారి టోక్యో ఒలింపిక్స్లో 4 క్రీడలకు అదనంగా చోటు దక్కింది. అవి కరాటే, స్కేట్ బోర్డింగ్, సర్ఫింగ్, క్లైంబింగ్
ఇంటర్నెట్ డెస్క్: ఈసారి టోక్యో ఒలింపిక్స్లో నాలుగు క్రీడలకు అదనంగా చోటు దక్కింది. అవి కరాటే, స్కేట్ బోర్డింగ్, సర్ఫింగ్, క్లైంబింగ్.
కరాటే: ఆగస్టు 5-7 మధ్యన పోటీలు ఉంటాయి. జపాన్ కరాటేకు చాలా ప్రసిద్ధి. 20 వ శతాబ్దం ప్రారంభంలో జపాన్ అంతటా కరాటే వేగంగా వ్యాపించింది. ప్రస్తుతం ప్రపంచమంతా కరాటేకు ఆదరణ లభిస్తోంది. దీన్ని 1970 నుంచి ఒలింపిక్స్లో చేర్చాలనే డిమాండ్ ఉంది. కానీ ఎట్టకేలకు జపాన్లో జరుగుతుండటం వల్లనేమో ఈ క్రీడ ఈసారి ఒలింపిక్స్లో భాగమైంది. స్త్రీపురుషులకు నాలుగు ప్రత్యేక ఈవెంట్స్ ఉంటాయి. 3 విభిన్న వెయిట్ కేటగరీల్లో పోటీలు ఉంటాయి
స్కేట్ బోర్డింగ్: జులై 25న పురుషుల విభాగంలో పోటీ ప్రారంభమవుతుంది. ఎత్తుకు ఎగిరే ట్రిక్స్, స్టంట్స్ ఉంటాయి. 12 ఏళ్ల నుంచి 47 ఏళ్ల వరకు ఇందులో పాల్గొంటారు. అమెరికా నుంచి నైజా హుస్టన్(పురుషుల) పాల్గొంటారు. బ్రిటన్ నుంచి మహిళల విభాగంలో 13 ఏళ్ల స్కై బ్రౌన్ బరిలో ఉంటారు. ఇది స్ట్రీట్, పార్క్ స్కేటింగ్స్ ఉంటాయి. స్టెయిర్స్, రెయిలింగ్స్, బెంచీలు తదితర వస్తువులను ఉపయోగించుకుంటూ స్కేటర్లు పలు విన్యాసాలు చేస్తారు.
సర్ఫింగ్: అలలతో సయ్యాటలాడే ఈ మూడు రోజుల పోటీలను వాతావరణ అనుకూలతను బట్టి ఎనిమిది రోజుల్లోపు నిర్వహిస్తారు. ఆదివారం ప్రారంభమవుతుంది. టోక్యోకు 60 మైళ్ల దూరంలో గల సముద్రతీరంలోని పట్టణంలో దీన్ని నిర్వహిస్తారు. ఇంటర్నేషనల్ సర్ఫింగ్ అసోసియేషన్ 1995 నుంచి ఒలింపిక్ కమిటీని అడుగుతుండటంతో ఎట్టకేలకు ఈసారి చోటు దక్కింది.
క్లైంబింగ్: ఆగస్టు 3 - 6 మధ్యన ఈ పోటీలు ఉంటాయి. ఇటీవలి సంవత్సరాల్లో దీనికి బాగా ఆదరణ పెరగడంతో ఒలింపిక్స్లో చోటు సంపాయించుకుంది. 95 డిగ్రీల కోణంలో నిలబడిన15 మీటర్ల గోడను ఎక్కాల్సి ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
భళా పంత్!.. అదరగొడుతున్న దిల్లీ కెప్టెన్
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..