Olympics Winning Moments: వీడియోలు చూడండి!
ఈ విశ్వక్రీడల్లో భారత అథ్లెట్లు మొత్తంగా ఏడు పతకాలు సాధించి సత్తా చాటారు. ఆ గెలుపు క్షణాల్ని నెమరవేసుకుందామా!
టోక్యో 2020 ఒలింపిక్స్ సంబరాలు ఘనంగా ముగిశాయి. అథ్లెటిక్స్లో భారత్ వందేళ్లుగా వేచి చూసిన ‘స్వర్ణ’ సంబరం ఈ దఫా మన సొంతమైంది. ఈ విశ్వక్రీడల్లో భారత అథ్లెట్లు మొత్తంగా ఏడు పతకాలు సాధించారు. మరి ఈ క్రీడోత్సవంలో మన అథ్లెట్ల గెలుపు క్షణాల్ని ఓసారి నెమరవేసుకుందామా!
🥈 మీరాబాయి చాను (రజతం) 🥈
ఒలింపిక్స్ ఆరంభమైన రెండో రోజే భారత్కు పతకాన్ని అందించింది మీరాబాయి చాను. వెయిట్ లిఫ్టింగ్లో కరణం మల్లీశ్వరి తర్వాత ఆ ఘనత సాధించింది చానునే. దాదాపు 21 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ వెయిట్ లిఫ్టింగ్లో ఈ మణిపుర్ మణిపూస అద్భుతాన్ని ఆవిష్కరించింది. మహిళల 49 కిలోల విభాగంలో రజతం గెలిచి.. భారత కీర్తి పతాకను శిఖరాగ్రాలకు చేర్చింది. పోటీలో భాగంగా స్నాచ్లో 87 కిలోలు, క్లీన్ అండ్ జర్క్లో 115 కిలోలు.. మొత్తంగా 202 కిలోలు ఎత్తింది.
🥉 పీవీ సింధు (కాంస్యం) 🥉
ఒలింపిక్స్లో మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ విభాగంలో తెలుగు తేజం పీవీ సింధు కాంస్య పతకం సాధించి కొత్త రికార్డు నెలకొల్పింది. కాంస్య కోసం జరిగిన పోటీలో చైనా క్రీడాకారిణి హి బింగ్జియావోతో పోటీ పడింది మన సింధు. అయితే, మ్యాచ్ ప్రారంభం నుంచి పూర్తి ఆధిపత్యం చలాయించిన సింధు.. వరుస గేమ్స్లో 21-13, 21-15 తేడాతో అద్భుత విజయం సాధించింది. దీంతో టోక్యో ఒలింపిక్స్లో వరుసగా రెండు సార్లు పతకాలు సాధించిన క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. అయితే, 2016 రియో ఒలింపిక్స్లో రజతం సాధించిన సింధు.. తాజా ఒలింపిక్స్లో కాంస్యంతో సరిపెట్టుకుంది.
🥉 లవ్లీనా బొర్గొహెయిన్ (కాంస్యం) 🥉
ఒలింపిక్స్ బాక్సింగ్లో.. లవ్లీనా బొర్గొహెయిన్ చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్లో పతకం సాధించిన భారత మూడో బాక్సర్గా అవతరించింది. ‘మాగ్నిఫిసెంట్ మేరీ’ తర్వాత పతకం ముద్దాడిన రెండో మహిళగా ఘనకీర్తిని అందుకుంది. టోక్యో క్రీడల్లో ఆమెకు దక్కింది కాంస్యమే అయినా అది స్వర్ణంతో సమానమే! ఎందుకంటే భారత బాక్సింగ్కు 9 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్లో ఆమె తొలి పతకం అందించింది. ఒలింపిక్స్లో పాల్గొన్న తొలిసారే పతకం గెలవడం విశేషం.
🥉 హాకీ- పురుషుల జట్టు (కాంస్యం) 🥉
41 సంవత్సరాల తర్వాత భారత హాకీ జట్టు.. తిరిగి ఒలింపిక్స్లో పతకం సాధించడం గర్వించదగ్గ విషయం. అద్భుతమై ఆటతీరుతో సెమీస్కు దూసుకెళ్లిన భారత్.. ఆ మ్యాచ్లో బెల్జియం చేతిలో ఓటమిపాలైంది. దీంతో మూడోస్థానం కోసం జర్మనీతో బరిలోకి దిగిన భారత్.. ఆ జట్టును 5-4 గోల్స్తో ఓడించి కాంస్య పతకం కైవసం చేసుకుంది.
🥈 రవి కుమార్ దహియా (రజతం) 🥈
టోక్యో ఒలింపిక్స్లో రవి కుమార్ దహియా అద్భుత పోరాటంతో రెజ్లింగ్ 57 కిలోల ఫ్రీస్టయిల్ విభాగంలో రజతంతో మెరిశాడు. రెండు సార్లు ప్రపంచ విజేత అయిన రష్యాకు చెందిన యుగేవ్ జావుర్ చేతిలో పోరాడి ఓడినా దేశానికి పతకం తీసుకొచ్చాడు. ఇక 2012 తర్వాత పురుషుల రెజ్లింగ్ విభాగంలో భారత్కు పతకం రావడం ఇదే తొలిసారి. 2008 బీజింగ్ ఒలింపిక్స్లో కాంస్యం సాధించిన సుశీల్కుమార్ తర్వాత 2012లో రజత పతకం గెలిచాడు.
🥉 బజరంగ్ పునియా (కాంస్యం) 🥉
భారత రెజ్లర్ బజరంగ్ పునియా.. పురుషుల 65 కిలోల కుస్తీపోటీల్లో కాంస్య పతకం సాధించాడు. వీరోచిత పోరాటంతో సెమీ ఫైనల్ వరకు దూసుకెళ్లిన బజరంగ్.. ఆ మ్యాచ్లో అజర్బైజాన్కు చెందిన అలియెవ్ హజీతో తలపడి ఓడిపోయాడు. అనంతరం జరిగిన ‘కాంస్య’ పోరులో కజక్స్థాన్కు చెందిన దౌలత్ నియజ్బెకోవ్ను 8-0తో చిత్తు చేశాడు.
🥇 నీరజ్ చోప్రా (స్వర్ణం) 🥇
ఒలింపిక్స్ ముగిసే ముందు రోజు భారత జావెలిన్ త్రో ఆటగాడు నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. అథ్లెటిక్స్లో శతాబ్దం తర్వాత తొలి పతకం అందించాడు. జావెలిన్ త్రోలో స్వర్ణ పతకం ముద్దాడాడు. స్వతంత్ర భారత దేశంలో.. వ్యక్తిగత క్రీడల్లో అభినవ్ బింద్రా తర్వాత పసిడి పతకం అందుకున్న వీరుడిగా నిలిచాడు. పోటీలో మొదటి అవకాశంలో జావెలిన్ను నీరజ్ 87.03 మీటర్లు విసిరాడు. రెండోసారి 87.58మీటర్లు, మూడోసారి 76.79మీటర్లు విసిరాడు. ఆ తర్వాత రెండు అవకాశాలు ఫౌల్స్ అయినా.. అత్యుత్తమ ప్రదర్శన (87.58)తో అగ్రస్థానంలో నిలిచి పసిడి పతకం అందుకున్నాడు.
వీళ్లంతా పతకాల సాధించి.. రికార్డులు నెలకొల్పితే.. మరికొన్ని విభాగాల్లో భారత అథ్లెట్లు చరిత్ర సృష్టించారు. వాటన్నింటిని మరో కథనంలో మీ ముందుంచుతాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఇంకెవరూ మీ భార్యే..’: కోహ్లీ ఆన్సర్కు షాకైన దినేశ్ కార్తిక్
Kohli-DK: బెంగళూరు ఆటగాడు డీకే అడిగిన ప్రశ్నలకు.. కోహ్లీ ఇచ్చిన సమాధానం నెట్టింట వైరల్ అవుతోంది. దినేశ్ కార్తిక్ సతీమణి దీపిక ప్రస్తావన తేవడంతో అతడు ఆశ్చర్యపోయాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
డేవిడ్, పొలార్డ్కు భారీ జరిమానా.. ‘డీఆర్ఎస్ సిగ్నల్’ వివాదమేనా కారణం?
ముంబయి ఆటగాడు, కోచ్పై ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ కొరడా ఝళిపించింది. వారు చేసిన చర్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర నిర్ణయం తీసుకుంది. -
Ravindra Jadeja: గాల్లోకి ఎగిరి.. ఒంటిచేత్తో జడేజా క్యాచ్!
లఖ్నవూతో శుక్రవారం జరిగిన మ్యాచ్లో చెన్నై ఆటగాడు రవీంద్ర జడేజా.. గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో క్యాచ్ ఒడిసిపట్టాడు.
-
దిల్లీ కోటలో తొలి మ్యాచ్.. హైదరాబాద్ దూకుడు కొనసాగేనా?
అభిమానుల ఊహకు అందనిరీతిలో.. సంచలన ఆటతో ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ జట్టు అదరగొట్టేస్తోంది. ఇవాళ మరో మ్యాచ్లో తలపడేందుకు సిద్ధమవుతోంది. -
ధోనీ ఆటే స్ఫూర్తి.. లేటుగా బ్యాటింగ్కు రావడానికి కారణముంది: ఫ్లెమింగ్
ప్రస్తుత సీజన్లో దూకుడుగా ఆడుతున్న క్రికెటర్లలో ధోనీ ముందువరుసలో ఉంటాడు. ఆడేది పది బంతుల్లోపే అయినా ప్రత్యర్థి బౌలర్లకు వణుకు పుట్టిస్తున్నాడు. -
ఆ ముగ్గురిని చూస్తే ముచ్చటేసింది.. రోహిత్ ఈజ్ బ్యాక్: హర్భజన్
పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ముంబయి జట్టుకు కాసేపు యాక్టివ్ కెప్టెన్గా రోహిత్ శర్మ వ్యవహరించాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
చెరో రూ. 12 లక్షలు కట్టండి.. కెప్టెన్లకు జరిమానా
లఖ్నవూ కెప్టెన్ కేఎల్ రాహుల్, చెన్నై సారథి రుతురాజ్ గైక్వాడ్కు ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ జరిమానా విధించింది. -
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
సొంత మైదానంలో లఖ్నవూ విజయం సాధించింది. ఆ జట్టు గెలుపు కంటే మరొక అంశం అభిమానులను ఆకట్టుకుంది. అదే ఎంఎస్ ధోనీ (MS Dhoni) బ్యాటింగ్ వీరవిహారం. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో 22న పదోతరగతి ఫలితాలు
-
ఎన్నికల బాండ్లపై సీతారామన్ వ్యాఖ్యలు.. తీవ్రంగా విమర్శించిన కాంగ్రెస్
-
వాటిని నమ్మకండి.. మహేశ్-రాజమౌళి సినిమాపై నిర్మాత కామెంట్స్
-
‘నా తమ్ముడికి ఓట్లేస్తే మీకు నీళ్లు’.. డీకే శివకుమార్ వ్యాఖ్యలపై కేసు నమోదు
-
‘చోటా కె గారు.. మీ గౌరవాన్ని కాపాడుకోండి’.. కాదు.. కూడదంటే I AM Waiting: హరీశ్
-
హెచ్డీఎఫ్సీ ఫలితాలు.. నికర లాభం రూ.17,622 కోట్లు