Hockey: ఒకే రోజు.. ఇద్దరు ఒలింపిక్ స్టార్ హాకీ ఆటగాళ్ల రిటైర్మెంట్
ఈ ఏడాది టోక్యో ఒలింపిక్స్లో భారత హాకీ బృందం చరిత్రాత్మక కాంస్య పతకం సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఇద్దరు స్టార్ ఆటగాళ్లు ఒకే రోజు రిటైర్మెంట్ ప్రకటించారు.
దిల్లీ: ఈ ఏడాది టోక్యో ఒలింపిక్స్లో భారత హాకీ బృందం చరిత్రాత్మక కాంస్య పతకం సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఇద్దరు స్టార్ ఆటగాళ్లు ఒకే రోజు రిటైర్మెంట్ ప్రకటించారు. డ్రాగ్ ఫ్లికర్ రూపీందర్ పాల్ సింగ్, డిఫెండర్ బీరేంద్ర లక్రా.. గురువారం అంతర్జాతీయ హాకీకి వీడ్కోలు పలికారు. కొన్ని గంటల తేడాతో వీరిద్దరూ తమ నిర్ణయం ప్రకటించడం గమనార్హం.
తొలుత రూపీందర్ సింగ్ ట్విటర్ ద్వారా తన రిటర్మైంట్ ప్రకటించారు. యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించేందుకు తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. ఆ తర్వాత కొద్ది సేపటికి బీరేంద్ర లక్రా కూడా అంతర్జాతీయ హాకీకి వీడ్కోలు పలికినట్లు హాకీ ఇండియా ప్రకటించింది. అయితే.. వచ్చేవారం బెంగళూరులో ప్రారంభమయ్యే నేషనల్ క్యాంప్లో ఈ ఇద్దరికీ చోటు దక్కకపోవడంతో వీరు రిటైర్మెంట్ ప్రకటించినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
30ఏళ్ల రూపీందర్ పాల్ దేశంలో ఉత్తమ డ్రాగ్ ఫ్లికర్గా గుర్తింపు సాధించాడు. 13ఏళ్లుగా భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అతడు జట్టు తరఫున 223 మ్యాచ్లు ఆడాడు. టోక్యో ఒలింపిక్స్లో జర్మనీతో జరిగిన కాంస్య పతక పోరులో రూపీందర్ నాలుగు కీలక గోల్స్ సాధించి జట్టు పతకం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.
ఇక 31ఏళ్ల బీరేంద్ర లక్రా.. టోక్యోలో పాల్గొన్న హాకీ జట్టుకు వైస్ కెప్టెన్లలో ఒకడు. 2014లో జరిగిన ఇంచియాన్ ఏషియన్ గేమ్స్లో స్వర్ణ పతకం సాధించిన భారత జట్టులోనూ సభ్యుడు. 11ఏళ్లుగా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ‘‘నా ప్రయాణంలో ఇండియా జెర్సీ ధరించడం, దేశం తరఫున ఆడటం కంటే గొప్ప అనుభూతి మరేది లేదు. అయితే ఇప్పుడు తర్వాతి తరానికి కూడా అవకాశాలు ఇవ్వాల్సిన సమయం వచ్చింది. యువ ఆటగాళ్లకు చోటు కల్పించేందుకు నేడు భారత హాకీ జట్టు నుంచి వీడ్కోలు పలుకుతున్నా’’ అని బీరేంద్ర ఇన్స్టాలో రాసుకొచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి.
తాజా వార్తలు (Latest News)
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
మహిళకు శస్త్రచికిత్స చేసి తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి డాక్టర్ లక్ష్మి