Tokyo Olympics: భారత్కు చేరిన బంగారు ‘చోప్రా’.. అథ్లెట్లకు ఘన స్వాగతం
టోక్యో ఒలింపిక్స్లో పాల్గొన్న భారత క్రీడాకారులు, విజేతలు సోమవారం స్వదేశానికి తిరిగివచ్చారు. జావెలిన్ త్రోలో బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రా సైతం తిరిగి భారత్కు చేరుకున్నాడు...
ఇంటర్నెట్డెస్క్: టోక్యో ఒలింపిక్స్లో పాల్గొన్న భారత క్రీడాకారులు, విజేతలు సోమవారం స్వదేశానికి తిరిగివచ్చారు. జావెలిన్ త్రోలో బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రా సైతం తిరిగి భారత్కు చేరుకున్నాడు. ఈ సందర్భంగా వారికి దిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఎయిర్పోర్ట్ సిబ్బంది పూలమాలలు, పుష్పగుచ్చాలు అందజేసి అభినందించారు. మరోవైపు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ సందీప్ ప్రధాన్ ఎయిర్పోర్టుకు వెళ్లి క్రీడాకారులను ఘనంగా ఆహ్వానించారు. అభిమానులు సైతం పెద్ద ఎత్తున తరలిరావడంతో అక్కడ భౌతిక దూరం గాలికొదిలేశారు. దాంతో క్రీడాకారులు అక్కడి నుంచి త్వరగానే వెళ్లిపోయారు.
కాగా, ఈ ఒలింపిక్స్లో భారత్ అత్యుత్తమ ప్రదర్శన చేయడం విశేషం. ఇంతకుముందు 2012 లండన్ ఒలింపిక్స్లో అత్యధికంగా ఆరు పతకాలు సాధించిన భారత అథ్లెట్లు ఈసారి ఏడు పతకాలతో తిరిగొచ్చారు. దాంతో వారు భవిష్యత్పై మరిన్ని ఆశలు పెంచారు. అందులో అథ్లెటిక్స్ విభాగంలో నీరజ్ చోప్రా తొలిసారి స్వర్ణం సాధించి కొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక మిగతావారిలో మీరాబాయి చాను, రవికుమార్ దాహియా రజత పతకాలు సాధించగా బాక్సర్ లవ్లీనా బార్గోహేన్, పీవీ సింధు, బజ్రంగ్ పునియా, భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకాలు గెలుపొందారు. ఈ క్రమంలోనే సింధు, మీరాబాయి తమ ఈవెంట్లు పూర్తికాగానే తిరిగి స్వదేశానికి చేరారు. మిగతా అథ్లెట్లు ఈరోజు ప్రత్యేక విమానంలో చేరుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.