Under-19 World Cup : ఐర్లాండ్‌తో మ్యాచ్‌.. అదరగొడుతున్న భారత ఓపెనర్లు

 అండర్‌-19 ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌, ఐర్లాండ్‌ జట్ల మధ్య ...

Published : 19 Jan 2022 20:34 IST

ఇంటర్నెట్ డెస్క్‌: అండర్‌-19 ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌, ఐర్లాండ్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న టీమ్‌ఇండియా 25 ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ నష్టపోకుండా 162 పరుగులు చేసింది. క్రీజ్‌లో రఘువన్షి (78*), హర్నూర్‌ సింగ్‌ (74*) ఉన్నారు. మొదటి రెండు ఓవర్లు ఆచితూచి ఆడిన ఓపెనర్లు.. ఆ తర్వాత రెచ్చిపోయారు. ఐర్లాండ్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా బ్యాటింగ్‌ చేస్తున్నారు. రెగ్యులర్‌ సారథి, ఉపసారథి యాష్‌ ధుల్, రషీద్‌ లేకుండానే యువ భారత్‌ బరిలోకి దిగింది. నిషాంత్‌ సింధు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. 

జట్టు వివరాలు: 

భారత్‌: రఘువన్షి, హర్నూర్ సింగ్, రాజ్‌ బవా, నిషాంత్‌ సంధు (కెప్టెన్‌), కౌషల్‌ తంబే, దినేశ్‌ బనా, గార్వ్‌సంగ్వాన్, విక్కీ ఓత్సవాల్‌, గౌతమ్, రాజ్‌వర్థన్‌, రవికుమార్‌

ఐర్లాండ్: లియామ్‌ దొహెర్తీ, డేవిడ్ విన్సెట్, జాక్‌ డిక్సన్‌, జాషువా కోక్స్, టిమ్‌ టెక్టర్ (కెప్టెన్), ఫిలిప్స్‌, స్కాట్‌, నాథన్‌, మాథ్యూ, జామీ ఫోర్బ్స్‌, ముజామిల్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని