విరాట్పై డకౌట్ ట్వీట్.. డిలీట్
టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ చిత్రాన్ని ఉపయోగించి చేసిన ట్వీట్ను ఉత్తరాఖండ్ పోలీసులు తొలగించారు. అభిమానుల నుంచి విమర్శలు రావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. పోలీసులు చేసిన ట్వీట్పై కొందరు.....
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ చిత్రాన్ని ఉపయోగించి చేసిన ట్వీట్ను ఉత్తరాఖండ్ పోలీసులు తొలగించారు. అభిమానుల నుంచి విమర్శలు రావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. పోలీసులు చేసిన ట్వీట్పై కొందరు నెటిజన్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారని సమాచారం. ఇంతకీ ఏం జరిగిందంటే?
ఇంగ్లాండ్తో జరిగిన తొలి టీ20లో విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి పెంచే ఉద్దేశంతో విరాట్ వికెట్లను వదిలేసి ఆడాడు. ఆదిల్ రషీద్ వేసిన బంతిన బలంగా బాదబోయాడు. అయితే బ్యాటుకు తగిలిన బంతి నేరుగా లాంగాఫ్లో జోర్డాన్ వద్దకు వెళ్లింది. అతడు బంతిని సులభంగా ఒడిసిపట్టాడు. శ్రేయస్ మినహా మిగతా ఆటగాళ్లు విఫలం కావడంతో టీమ్ఇండియా 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది.
వాహనదారులకు అవగాహన కల్పించేందుకు ఉత్తరాఖండ్ పోలీసులు విరాట్ చిత్రాన్ని ఉపయోగించుకున్నారు. ‘హెల్మెట్ ఒక్కటే సరిపోదు. పూర్తి ధ్యాసతో డ్రైవింగ్ చేయడం అత్యంత ఆవశ్యకం. లేకపోతే కోహ్లీ మాదిరిగానే మీరూ డకౌట్ అవుతారు’ అని హిందీలో పోస్ట్ చేశారు. పోలీసులు చేసిన ట్వీట్పై అభిమానులు మండిపడ్డారు. చేసిన ట్వీట్ టీమ్ఇండియా కెప్టెన్ను అవమానించేలా ఉందంటూ కొందరు.. పోస్ట్ చేసిన చిత్రానికి, ట్వీట్కు సంబంధం లేదని మరికొందరు విమర్శించారు. దీంతో ట్వీట్ తొలగించక తప్పలేదు!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
టీ20 ప్రపంచకప్కు టీమ్ ఇండియాను ఎంచుకోండి అని అడిగితే.. పాఠకులు సెలక్ట్ చేసిన 15 మంది వీరే. -
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ