Venkatesh Iyer: హర్భజన్ ముందే చెప్పాడు .. కానీ నమ్మలేకపోయా: అయ్యర్
వెంకటేశ్ అయ్యర్కు ఈ ఏడాది సమ్థింగ్ స్పెషల్... ఐపీఎల్ 14వ సీజన్లో అదరగొట్టిన ఆల్రౌండర్ను...
ఇంటర్నెట్ డెస్క్: వెంకటేశ్ అయ్యర్కు ఈ ఏడాది సమ్థింగ్ స్పెషల్... తన తొలి ఐపీఎల్ సీజన్లోనే అదరగొట్టిన ఈ ఆల్రౌండర్కు భారత జట్టులోకి ఆహ్వానం అందింది. న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు ఎంపికైన లెఫ్ట్ఆర్మ్ బ్యాటర్, కుడిచేతివాటం మీడియం పేసర్ వెంకటేశ్ అయ్యర్ భారత్ జట్టు తరఫున టీ20ల్లోకి అరంగేట్రం చేశాడు. కివీస్తో తొలి మ్యాచ్లో బౌలింగ్ చేయని అయ్యర్ (4) బ్యాటింగ్లో ఎదుర్కొన్న తొలి బంతినే బౌండరీగా మలిచాడు. అయితే ధాటిగా ఆడే క్రమంలో రెండో బంతికే పెవిలియన్కు చేరాడు. కీలకమైన ఆఖరి ఓవర్లో ఫోర్ కొట్టడంతో ఒత్తిడి తగ్గి కివీస్పై టీమ్ఇండియా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించగలిగింది. మరోవైపు రెండు దశల్లో జరిగిన ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్కు ప్రాతినిధ్యం వహించాడు. యూఏఈ వేదికగా జరిగిన రెండో అంచెలో వెంకటేశ్ అయ్యర్ దుమ్మురేపాడు. కేకేఆర్ ఫైనల్కు దూసుకెళ్లడంలో ముఖ్యభూమిక పోషించాడు. కేకేఆర్ తరఫున 10 మ్యాచ్లు ఆడిన వెంకటేశ్ 128 స్ట్రైక్రేట్తో 370 పరుగులు సాధించారు. అందులో నాలుగు అర్ధశతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 67 పరుగులు. బౌలింగ్లోనూ మూడు వికెట్లను పడగొట్టాడు.
అయితే గత ఐపీఎల్లో తన ప్రదర్శనపై టీమ్ఇండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ముందే అంచనా వేశాడని వెంకటేశ్ అయ్యర్ తెలిపాడు. ఐపీఎల్ 14 సీజన్లో హర్భజన్ కూడా కేకేఆర్ జట్టులోనే ఉన్నాడు. ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోతో అయ్యర్ మాట్లాడుతూ.. ‘‘ఐపీఎల్ 14వ సీజన్ ప్రారంభానికి ముందే హర్భజన్ నాతో సూటిగా చెప్పేశాడు. అయితే అప్పటికి నేను తుది జట్టులో ఉంటానో లేదో కూడా తెలియదు. భజ్జీ నన్ను నెట్ప్రాక్టీస్ సెషన్స్లో చూసి ఉంటాడమో. ‘ఈసారి కేకేఆర్ అంటే నువ్వే. నాకు ఆ నమ్మకం ఉంది. మీకు అవకాశం వచ్చినప్పుడు కచ్చితంగా చేసి చూపిస్తారు’ అని చెప్పాడు. దీంతో ఒక్కసారిగా షాక్కు గురయ్యా. నిజం చెప్పాలంటే నేను నమ్మలేదు. అసలు ప్రాక్టీస్లో నా బ్యాటింగ్ కూడా చూసి ఉండడు. ఎందుకు ఈయన ఈ విధంగా చెబుతున్నాడు అని కూడా ఆలోచించా. భజ్జీలోని మంచి వ్యక్తిత్వం నన్ను ఓదార్చడం కోసమే ఇలా చెప్పిందేమో అనుకున్నా’’ అని వెంకటేశ్ అయ్యర్ చెప్పుకొచ్చాడు. అయితే ఐపీఎల్లో రాణించి కేకేఆర్ ఫైనల్కు దూసుకెళ్లడంలో కీలకపాత్ర పోషించినందుకు నిజంగా సంతోషపడినట్లు వివరించాడు.
► Read latest Sports News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు