VVS Laxman: లక్ష్మణ్-ద్రవిడ్ అంటే ఈడెన్ ఒక్కటే కాదు.. అడిలైడ్ కూడా
వీవీఎస్ లక్ష్మణ్.. మణికట్టు స్పెషలిస్టు.. కంగారూ బౌలర్లకు అదరని, బెదరని గుండె ధైర్యం. క్రీజులో నిలిచాడంటే ఆసీస్ ఆధిపత్యానికి బ్రేక్ వేశాడనే అర్థం...
ఆసీస్ గడ్డపై వెరీ వెరీ స్పెషల్ బ్యాటింగ్..
వీవీఎస్ లక్ష్మణ్.. మణికట్టు స్పెషలిస్టు.. కంగారూ బౌలర్లపై అదరని, బెదరని గుండె ధైర్యం. క్రీజులో నిలిచాడంటే ఆసీస్ ఆధిపత్యానికి బ్రేక్ వేశాడనే అర్థం. టెస్టు క్రికెట్లో 1990, 2000 దశకాల్లో ఆస్ట్రేలియా మేటి జట్టనే సంగతి అందరికీ తెలిసిందే. ఆ జట్టు బౌలర్లను చూసి ప్రపంచంలోని ఏ బ్యాట్స్మెన్ అయినా కాస్త ఆలోచించి బ్యాటింగ్ చేయాల్సిన పరిస్థితులు. కానీ, ఆ దూకుడుకు కళ్లెం వేసింది లక్ష్మణ్-ద్రవిడ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. 2000లో తొలిసారి కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో సంచలన బ్యాటింగ్తో అపురూప విజయాన్ని అందించిన వీరిద్దరూ.. 2003లో మరోసారి ఆసీస్ సొంతగడ్డపైనే చెలరేగిపోయారు. అడిలైడ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో వీవీఎస్ లక్ష్మణ్-రాహుల్ ద్రవిడ్ మరోసారి తమ బ్యాటింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించి ఔరా అనిపించారు. అయితే, ఈ మ్యాచ్ గురించి కొంతమందికే తెలిసినా.. చాలా మంది మర్చిపోయి ఉంటారు. టీమ్ఇండియా సాధించిన గొప్ప విజయాల్లో ఒకటైన దీన్ని లక్ష్మణ్ పుట్టిన రోజు సందర్భంగా మరోసారి గుర్తుకుచేసుకుందాం.
పాంటింగ్ మానసికంగా దెబ్బకొట్టి..
అడిలైడ్ టెస్టులో రికీ పాంటింగ్ సారథ్యంలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసి 556 పరుగుల భారీ స్కోర్ చేసింది. దాంతో భారత్ను ముందే మానసికంగా బెదరగొట్టింది. పాంటింగ్ (242; 352 బంతుల్లో 31x4) ఓర్పుతో బ్యాటింగ్ చేసి ద్విశతకం సాధించాడు. ఓపెనర్ లాంగర్ (58; 72 బంతుల్లో 7x4, 2x6), మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్ సైమన్ కటిచ్ (75; 109 బంతుల్లో 9x4, 1x6) అర్ధశతకాలతో రాణించారు. ఈ క్రమంలోనే చివర్లో జేసన్ గిలెస్పీ (48; 53 బంతుల్లో 6x4) ధనాధన్ ఇన్నింగ్స్తో జట్టు స్కోరును 550 దాటించాడు. టీమ్ఇండియా స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే ఐదు వికెట్లు తీయగా ఆశిష్ నెహ్రా, అజిత్ అగార్కర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇర్ఫాన్ పఠాన్ ఒక వికెట్ తీశాడు.
అదరని బెదరని ఈడెన్ హీరోలు..
ఆపై టీమ్ఇండియాకు శుభారంభం దక్కినా ఆ సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. 66 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన గంగూలీ సేన 85 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆకాశ్ చోప్రా (27), వీరేంద్ర సెహ్వాగ్ (47), సచిన్ (1), గంగూలీ (2) విఫలమయ్యారు. ఇక మిగిలింది ద్రవిడ్, లక్ష్మణ్, పార్థివ్ పటేల్ మాత్రమే. ఒకవైపు కొండంత లక్ష్యం.. మరోవైపు భీకరమైన బౌలర్లు. అయినా పట్టుదలతో బ్యాటింగ్ చేశారు ఈడెన్ గార్డెన్స్ హీరోలు. లక్ష్మణ్ (148; 282 బంతుల్లో 18x4) సెంచరీతో మెరవగా ద్రవిడ్ (233; 446 బంతుల్లో 23x4, 1x6) ద్విశతకంతో ఆదుకున్నాడు. వీరిద్దరూ కంగారూ బౌలర్లకు మరోసారి పరీక్ష పెట్టారు. చూడచక్కని షాట్లతో ఏ బౌలర్నూ వదలలేదు. గిలెస్పీ, ఆండీ బిచెల్, స్టువర్ట్ మాక్గిల్లను ఆటాడుకున్నారు. ఐదో వికెట్కు 303 పరుగులు జోడించి జట్టును పోటీలో నిలిపారు. ఇక 150కి చేరువైన వేళ లక్ష్మణ్ ఔటయ్యాక ద్రవిడ్ చివరి వరకు క్రీజులో నిలిచి స్కోరును 523 పరుగులకు తీసుకెళ్లాడు. దీంతో వీరిద్దరూ కంగారూల ఆధిక్యాన్ని 23 పరుగులకే పరిమితం చేశారు.
పాంటింగ్ తుస్.. ఆసీస్ మటాష్..
ఇక రెండో ఇన్నింగ్స్లో కంగారూలను టీమ్ఇండియా తక్కువ స్కోరుకే పరమితం చేసింది. ఇక్కడ కీలకంగా ఆడింది అగార్కర్. 6/41 ప్రదర్శనతో నిప్పులు చెరిగే బంతులేశాడు. చివరికి ఆస్ట్రేలియా 196 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్లు జస్టిన్ లాంగర్ (10), మాథ్యూ హెడెన్ (17)తో పాటు కెప్టెన్ పాంటింగ్ డకౌట్గా వెనుతిరిగి పూర్తిగా విఫలమయ్యారు. ఆపై మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మార్టిన్ (38), స్టీవ్వా (42), సైమన్ కటిచ్ (31), ఆడం గిల్క్రిస్ట్ (43) పెద్దగా పరుగులు చేయలేకపోయారు. భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 23 పరుగులు కలుపుకొని ఆస్ట్రేలియా 232 పరుగుల లక్ష్యాన్ని టీమ్ఇండియాకు నిర్దేశించింది.
బంతితో తిరుగుబాటు.. టీమ్ఇండియా తడబాటు..
మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమ్ఇండియాకు చివరిరోజు పెద్ద పరీక్షే ఎదురైంది. అప్పటికే నాలుగు రోజులు గడవడంతో పిచ్ మందకొడిగా మారింది. మోస్తరు లక్ష్యమే అయినా అప్పటికే బంతి అనూహ్యంగా తిరగడం మొదలైంది. దీంతో భారత్ ఎలా గెలుస్తుందనే ఆందోళన నెలకొంది. అయినా టీమ్ఇండియా ఆటగాళ్లు బెదరకుండా పోరాటం చేశారు. చోప్రా (20), సెహ్వాగ్ (47) శుభారంభం చేయగా తర్వాత ద్రవిడ్ (72 నాటౌట్; 170 బంతుల్లో 7x4) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సచిన్ (37; 59 బంతుల్లో 5x4)తో కలిసి నిలకడగా ఆడి కాసేపు వికెట్లు పడకుండా అడ్డుకున్నాడు. అయితే, ఊహించని పరిస్థితుల్లో సచిన్, గంగూలీ (12) విఫలమవడంతో టీమ్ఇండియా మళ్లీ ఒత్తిడిలోకి పడిపోయింది. ఈ క్రమంలోనే లక్ష్మణ్ (32; 34 బంతుల్లో 6x4) క్రీజులోకి వచ్చి ద్రవిడ్కు అండగా నిలిచాడు. వీరిద్దరూ ఈడెన్లో గెలిపించినట్లే అడిలైడ్లోనూ కంగారూలకు పీడకల మిగిల్చారు. కష్టమైన ఆసీస్ గడ్డపై క్లిష్ట పరిస్థితుల్లో మరో అద్భుత విజయం అందించారు. ఇలాంటి గొప్ప మధురానుభూతి మిగిల్చిన లక్ష్మణ్కు జన్మదిన శుభాకాంక్షలు..!
-ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
166.. 58 బంతుల్లో ఉఫ్
47 నిమిషాలు.. 58 బంతులు.. 167 పరుగులు.. 0 వికెట్లు! బుధవారం ఉప్పల్ స్టేడియంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో సన్రైజర్స్ బ్యాటింగ్ విధ్వంసమిది. ఇన్నింగ్స్ విరామంలో అభిమానులు స్నాక్స్ తెచ్చుకునేలోపే.. టీవీ సెట్ల ముందున్న ప్రేక్షకులు కాస్త బ్రేక్ తీసుకునేలోపే సన్రైజర్స్ లక్ష్య ఛేదన పూర్తయింది. -
ముంబయి తప్ప..
ఐపీఎల్-17 లీగ్ దశలో ఇంకా 13 మ్యాచ్లే మిగిలాయి. కానీ ఇప్పటికీ ఏ జట్టూ అధికారికంగా ప్లేఆఫ్స్ చేరలేదు. లఖ్నవూపై సన్రైజర్స్ విజయంతో ముంబయి అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. -
సంగీతం వింటూ.. సిరీస్లు చూస్తూ
ఒలింపిక్స్ పతకం నెగ్గాలన్నది ప్రతి అథ్లెట్ కల. అందుకోసం ఒక్కో అథ్లెట్ ఒక్కోలా సాగుతారు. తీవ్రమైన సాధన చేస్తూనే మెదడును ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం ఇతర వ్యాపకాల్లోనూ మునిగిపోతారు. -
మూడేళ్లలో తొలిసారి..
ఒలింపిక్, ప్రపంచ ఛాంపియన్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మూడేళ్లలో తొలిసారి స్వదేశంలో పోటీపడనున్నాడు. భువనేశ్వర్లో ఈ నెల 12 నుంచి 15 వరకు జరిగే జాతీయ ఫెడరేషన్ కప్లో అతడు ఆడనున్నాడు. -
ఓడలో ఫ్రాన్స్కు ఒలింపిక్ జ్యోతి
1896లో తొలిసారి ఉపయోగించిన మూడు వరుసల తెరచాపలతో కూడిన పురాతన ఓడ.. మధ్యధరా సముద్రంలో 12 రోజుల పాటు ప్రయాణం.. చివరగా గమ్యాన్ని చేరుకుని ఫ్రాన్స్లో ఒలింపిక్ జ్యోతి వెలుగులు నింపింది. -
నా రికార్డులను జైస్వాల్ బద్దలు కొడతాడు
టీమ్ఇండియా యువ ఓపెనర్, ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్కు ప్రాతినిధ్యం వహించే యశస్వి జైస్వాల్కు గొప్ప భవిష్యత్తు ఉందని వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ బ్రయాన్ లారా కొనియాడాడు. -
శాంసన్.. మాస్టర్ బ్లాస్టర్!
ఈ ఐపీఎల్లో భీకర ఫామ్తో సాగిపోతున్న రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్పై ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ ప్రశంసల జల్లు కురిపించాడు. అతణ్ని మాస్టర్బ్లాస్టర్గా అభివర్ణించాడు. -
అమన్పై ఆశలు
ప్రపంచ రెజ్లింగ్ క్వాలిఫయర్స్ గురువారం ఆరంభం కానున్నాయి. పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల కోసం ఇదే చివరి అర్హత ఈవెంట్. భారత ఫ్రీస్టైల్ రెజ్లర్లలో అమన్ శెరావత్, దీపక్ పునియాలపై పెద్ద ఆశలే ఉన్నాయి. -
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
సొంత గడ్డపై హైదరాబాద్ ఎప్పటికీ మరిచిపోలేని అద్భుతమైన విజయాన్ని అందుకుంది. లఖ్నవూను 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి ప్లే ఆఫ్స్కు మరింత చేరువైంది. ఈ మ్యాచ్లో హైదరాబాద్ పలు రికార్డులు నమోదు చేసింది. -
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్
ఒకే ఒక్క క్యాచ్ రాజస్థాన్ను ఓటమి వైపు నడిపించగా.. గెలుస్తామనే ఆశలు లేని సమయంలో దిల్లీకి ఊపిరి పోసింది. దీంతో ఆ జట్టు విజయం సాధించి ప్లేఆఫ్స్ రేసులోకి వచ్చింది. -
నా ‘400’ రికార్డును కొట్టే సత్తా ఈ భారత కుర్రాడి సొంతం: బ్రియాన్ లారా
టీమ్ఇండియా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్పై బ్రియాన్ లారా అభినందనల వర్షం కురిపించాడు. భవిష్యత్తులో ఎన్నో రికార్డులను కొల్లగొడతాడని పేర్కొన్నాడు.
తాజా వార్తలు (Latest News)
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్