తీరని లోటు మిగిల్చిన ఓటమి: వార్న్
గాయపడ్డ టీమ్ఇండియా చేతుల్లో ఓటమి పాలవ్వడం పూడ్చలేని లోటు మిగిల్చిందని ఆసీస్ మాజీ స్పిన్నర్ షేన్వార్న్ అన్నాడు. కెప్టెన్ టిమ్పైన్, బౌలర్ల వ్యూహాలను ప్రశ్నించక తప్పదన్నాడు. రాబోయే రోజుల్లో కొందరిపై వేటు తప్పదని అంచనా వేశాడు. పూర్తి సామర్థ్యంతో బరిలోకి దిగిన కంగారూలు తక్కువ...
బ్రిస్బేన్: గాయపడ్డ టీమ్ఇండియా చేతుల్లో ఓటమి పాలవ్వడం పూడ్చలేని లోటు మిగిల్చిందని ఆసీస్ మాజీ స్పిన్నర్ షేన్వార్న్ అన్నాడు. కెప్టెన్ టిమ్పైన్, బౌలర్ల వ్యూహాలను ప్రశ్నించక తప్పదన్నాడు. రాబోయే రోజుల్లో కొందరిపై వేటు తప్పదని అంచనా వేశాడు. పూర్తి సామర్థ్యంతో బరిలోకి దిగిన కంగారూలు తక్కువ బలమున్న రహానె సేన చేతిలో ఓటమిపాలవ్వడం కలిచివేసిందన్నాడు.
‘ఈ ఓటమి పూడ్చలేని లోటును మిగిల్చింది. రెండో, మూడో స్థాయి జట్టుతో ఎక్కువసార్లు ఓడిపోకూడదు. ఆస్ట్రేలియా వ్యూహాలు, జట్టును ప్రశ్నించక తప్పదు. బౌలర్లను కచ్చితంగా ప్రశ్నించాలి. జట్టులో కొందరు ఆటగాళ్ల చోటూ ప్రశ్నార్థకమే. అలా తప్పక చేయాల్సిందే. భారత్ అద్భుతంగా ఆడిందని చెప్పి తప్పించుకోవడానికి వీల్లేదు’ అని షేన్వార్న్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
సీనియర్లు గాయపడ్డా రిజర్వుబెంచీ ఆటగాళ్లతో సిరీస్ గెలిచిన టీమ్ఇండియాపై వార్న్ ప్రశంసలు కురిపించాడు. ‘కోల్పోయేందుకు ఏమీ లేని భారత్ పట్టుదలగా ఆడింది. కానీ తొలి ప్రాధాన్యం ఉన్న ఆటగాళ్లు ముగ్గురు, నలుగురే ఆడారు. కుర్రాళ్లు కసిని ప్రదర్శించారు’ అని పేర్కొన్నాడు. గబ్బా టెస్టులో వచ్చిన అవకాశాల్ని ఆసీస్ ఒడిసిపట్టలేదని వార్న్ అన్నాడు.
‘అవును, అవకాశాలు వచ్చాయి. టీమ్ఇండియాను చిత్తు చేసేందుకు ఆసీస్కు ఎన్నో అవకాశాలు లభించాయి. కానీ వారు అందిపుచ్చుకోలేదు. టిమ్పైన్ వ్యూహాలు బాగాలేవు. అతనొక్కడినే నిందించేందుకు వీల్లేదు. బౌలర్లు, కెప్టెన్ ఉమ్మడిగా బాధ్యులు. ఏదేమైనా సారథిగా పైన్ అన్నింటికీ బాధ్యత వహించాలి. అతడు తీవ్రంగా నిరాశపరిచాడు’ అని షేన్వార్న్ తెలిపాడు.
ఇవీ చదవండి
ప్రపంచమంతా సెల్యూట్ చేస్తోంది: రవిశాస్త్రి
మేం వస్తున్నాం.. టీమిండియా కాస్త జాగ్రత్త!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భళా పంత్!
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!