IND vs NZ: అయ్యో.. రివ్యూకు వెళ్లకపోవడం ఎంత పొరపాటు..!
న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ఇండియా మ్యాచ్పై పట్టు సాధించేలా కనిపిస్తోంది. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్ కొనసాగుతున్న భారత జట్టు ఈరోజు మరింత ధాటిగా ఆడాల్సిన అవసరం ఉంది...
ఇంటర్నెట్డెస్క్: న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ఇండియా మ్యాచ్పై పట్టు సాధించేలా కనిపిస్తోంది. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్ కొనసాగిస్తున్న భారత జట్టు ఈరోజు మరింత ధాటిగా ఆడాల్సిన అవసరం ఉంది. 300 పైచిలుకు ఆధిక్యం సంపాదించి చివరిరోజు సోమవారం భారీ లక్ష్యాన్ని నిర్దేశిస్తే మ్యాచ్ గెలిచే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో కాన్పూర్ పిచ్ స్పిన్కు సహకరిస్తున్న వేళ నాలుగో ఇన్నింగ్స్లో కివీస్ బ్యాటింగ్కు మరింత కష్టమయ్యే వీలుంది. దీంతో ఈరోజు భారత బ్యాటింగే కీలకం కానుంది. కాగా, ఈ విషయం పక్కనపెడితే.. తొలి ఇన్నింగ్స్లో కివీస్ ఓపెనర్లను ఔట్ చేయడానికి టీమ్ఇండియా బౌలర్లు ఎంత కష్టపడ్డారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
టామ్ లాథమ్ (95; 282 బంతుల్లో 10x4), విల్ యంగ్ (89; 214 బంతుల్లో 15x4) తొలి వికెట్కు 151 పరుగులు జోడించి భారత్పై ఆధిపత్యం చెలాయించారు. ఆ తర్వాత పుంజుకున్న భారత్.. న్యూజిలాండ్ను 296 పరుగులకే ఆలౌట్ చేసింది. కివీస్ స్కోరులో సగం వీరిద్దరే సాధించారు. అందులో అదృష్టం కూడా కలిసొచ్చింది! ముఖ్యంగా శుక్రవారం రెండో రోజు ఆటలో న్యూజిలాండ్ బ్యాటింగ్లో లాథమ్ పలుమార్లు ఔటయ్యే ప్రమాదాల నుంచి తప్పించుకున్నాడు. అతడిని పెవిలియన్ పంపే క్రమంలో భారత బౌలర్లు మూడుసార్లు అప్పీల్ చేయగా.. అంపైర్లు ఔటివ్వడం.. లాథమ్ రివ్యూకు వెళ్లడం.. అక్కడ నాటౌట్గా తేలడం క్రమంగా జరిగాయి. ఈ క్రమంలోనే శనివారం సైతం అశ్విన్ వేసిన 73వ ఓవర్లో అతడు 66 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తుండగా ఎల్బీడబ్యూగా ఔటయ్యాడు. అయితే, ఆన్ఫీల్డ్ అంపైర్ నాటౌటిచ్చాడు. దీంతో భారత్ కూడా రివ్యూకు వెళ్లకుండా మిన్నకుండిపోయింది. అప్పటికి చేతిలో రెండు రివ్యూలున్నా.. ఒకవేళ రివ్యూలో నాటౌట్గా తేలితే మరో అవకాశం పోతుందన్న ఉద్దేశంతో సైలెంట్గా ఉండిపోయింది. ఇక్కడే భారత్ తప్పులో కాలేసింది.
లాథమ్ ఎల్బీడబ్ల్యూ విషయంలో రివ్యూకు వెళ్లాల్సిందని తర్వాత తేలింది. ఎందుకంటే అశ్విన్ వేసిన ఆ బంతి వికెట్ టు వికెట్ నేరుగా పిచ్ అయి వికెట్ల మధ్య తాకేలా కనిపించింది. ఇది కచ్చితంగా వికెట్ దక్కే బంతి కావడం విశేషం. దీంతో అశ్విన్, కెప్టెన్ అజింక్య రహానె అసహనం వ్యక్తం చేయడం ఆ రీప్లేలో కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. చివరికి అతడు శతకానికి ఐదు పరుగుల దూరంలో అక్షర్ పటేల్ బౌలింగ్లో ఔటయ్యాడు. ఇన్నింగ్స్ 103వ ఓవర్లో సబ్స్టిట్యూట్ కీపర్ కేఎస్ భరత్ చేతిలో స్టంపౌటయ్యాడు. అంతకుముందు యువ ఓపెనర్ విల్ యంగ్ సైతం భరత్ చేతికే చిక్కి తొలి వికెట్గా వెనుదిరిగాడు. ఇక్కడా అంపైర్ తొలుత నాటౌటిచ్చినా భరత్ పట్టబట్టి మరీ రివ్యూకు వెళ్లేలా చేశాడు. అశ్విన్ వేసిన 67వ ఓవర్లోని ఆ బంతి విల్యంగ్ బ్యాట్ అంచులకు తాకుతూ కీపర్ చేతుల్లో పడినట్లు రీప్లేలో తేలింది. దీంతో భారత్కు తొలి వికెట్ దక్కింది. ఈ వీడియో కూడా నెట్టింట్లో వైరల్గా మారింది. తర్వాత న్యూజిలాండ్ వరుసగా వికెట్లు కోల్పోయి మ్యాచ్పై పట్టు కోల్పోయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
ముంబయి ఇండియన్స్ జట్టు గురించి తాను మాట్లాడిన మాటలు వక్రీకరణకు గురికావడం వల్లే సోషల్ మీడియాలో వైరల్గా మారినట్లు అంబటి రాయుడు అభిప్రాయపడ్డాడు. -
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
మరికొన్ని రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడించారు. -
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
టీమ్ఇండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బంతిని ఎంత బలంగా బాదుతాడో.. మాటల తూటానూ అలాగే పేలుస్తాడు. -
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!