MS Dhoni: ధోనీ చెబుతున్న జీవిత పాఠం.. వైరల్గా మారిన ‘లెస్సన్ 7’ యాడ్
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తాజాగా ఆన్లైన్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ సంస్థ ‘అన్అకాడెమీ’ యాడ్ ఫిల్మ్లో మెరిశారు. ఇందులో గొప్పేం.. ఇంతకుముందూ అనేక ప్రకటనలు చేశారు కదా అనుకోవచ్చు! కానీ.. దీనికో ప్రత్యేకత ఉంది. ఈ ప్రకటనను...
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తాజాగా ఆన్లైన్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ సంస్థ ‘అన్అకాడమీ’ యాడ్ ఫిల్మ్లో మెరిశారు. ఇందులో గొప్పేం ఉంది.. ఇంతకుముందూ అనేక ప్రకటనలు చేశారు కదా అనుకోవచ్చు! కానీ.. దీనికో ప్రత్యేకత ఉంది. ఈ ప్రకటనను రూపొందించేందుకు దాదాపు ఏడాది పట్టడం గమనార్హం. బెంగళూరుకు చెందిన ఈ సంస్థ.. ‘లెస్సన్ 7’ పేరిట రూపొందించిన ఈ స్ఫూర్తిదాయక ప్రకటనను సోమవారం విడుదల చేసింది.
వెనుక రైలు వస్తుండగా.. ధోనీ పట్టాలపై పరిగెత్తుతూ ఎదుట వస్తున్న అడ్డంకులను దాటుకుంటూ చివరకు తన లక్ష్యాన్ని అందుకుంటున్నట్లు ఇందులో చూపించారు. ‘లక్ష్యంపై చూపు.. అడ్డంకులను ఛేదించాలనే సంకల్పం.. ఛాంపియన్ని చేస్తుంది! ఈ అంతర్జాతీయ విద్యాదినోత్సవం సందర్భంగా.. కష్ట సమయాల్లో ‘లెస్సన్ 7’ను గుర్తుచేసుకోండి’ అంటూ సంస్థ ఈ యాడ్ను ట్వీట్ చేసింది. ‘మాకు సంబంధించిన వాటిలో ఇప్పటివరకు అత్యంత ప్రతిష్ఠాత్మక, ఐకానిక్ యాడ్ ఇది. దీన్ని రూపొందించేందుకు దాదాపు ఏడాది పట్టింది’ అని సంస్థ సీఈఓ గౌరవ్ ముంజల్ వెల్లడించారు.
ధోనీ స్టైలిష్ లుక్స్, స్పెషల్ ఎఫెక్ట్స్తో ఆకట్టుకుంటున్న ఈ ప్రకటన ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ట్విటర్లో దాదాపు 15 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఈ యాడ్ను పోస్ట్ చేస్తూ.. హెలికాప్టర్ షాట్లాగే ఇది కూడా అద్భుతంగా ఉందంటూ ధోనీకి కితాబిచ్చారు. ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే, సినీ నటి సమంత తదితరులూ దీన్ని ట్వీట్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)