మేం ఛేదించగలం: లంబూ
ఇంగ్లాండ్తో తొలి టెస్టులో గెలుపు అవకాశాలు ఉన్నాయని టీమ్ఇండియా సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ అన్నాడు. 420 పరుగుల లక్ష్యాన్ని ఛేదించగలమని సానుకూల దృక్పథంతో ఉన్నామని పేర్కొన్నాడు. కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూశానని వివరించాడు....
ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లాండ్తో తొలి టెస్టులో గెలుపు అవకాశాలు ఉన్నాయని టీమ్ఇండియా సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ అన్నాడు. 420 పరుగుల లక్ష్యాన్ని ఛేదించగలమని పేర్కొన్నాడు. కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూశానని వివరించాడు. ఈ మ్యాచులో లంబూ 300 వికెట్ల మైలురాయిని అందుకున్న సంగతి తెలిసిందే. కపిల్, జహీర్ తర్వాత టీమ్ఇండియా తరఫున ఈ ఘనత సాధించిన మూడో పేసర్గా అతడు అవతరించాడు.
‘కెరీర్లో ఎత్తుపల్లాలు ఎన్నో చూశా. ఎంతో అనుభవం గడించా. ఉపఖండం, విదేశాల్లో ఎలా బౌలింగ్ చేయాలో ఎంతో మంది మార్గనిర్దేశకులు నేర్పించారు. గాయం తర్వాత దేశవాళీ క్రికెట్లో 4 ఓవర్లు విసిరిన తర్వాత కాస్త అలసిపోయినట్టు అనిపించింది. 3-4 రోజుల వ్యవధిలోనే 35 ఓవర్లు విసిరాను. ఆఖరి రోజు మాకు శుభారంభం లభిస్తే ఈ లక్ష్యాన్ని మేం ఛేదించగలం. ఎందుకంటే మాకు నిర్భయంగా ఆడగలిగే బ్యాటింగ్ లైనప్ ఉంది. ఇక్కడ చూడాల్సింది 381 పరుగుల్ని 9 వికెట్లను కాదు’ అని ఇషాంత్ అన్నాడు.
‘తొలి రెండు రోజులు పేసర్లు, స్పిన్నర్లకు పిచ్ అనుకూలించలేదు. రహదారిపై ఆడినట్టు అనిపించింది. నాలుగో రోజు ఆఖర్లో మాత్రం బంతి టర్న్ అవ్వడం మొదలైంది. ఇప్పుడు మరింత స్పందిస్తోంది’ అని లంబూ వెల్లడించాడు.
ఇవీ చదవండి
పంత్కే ఐసీసీ తొలి పురస్కారం
లోకల్ బాయ్స్ ఆల్రౌండ్ షో
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి.
తాజా వార్తలు (Latest News)
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్