సంతోషంలో రాహుల్, కుంబ్లే!
ఐపీఎల్ వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్ల పట్ల కెప్టెన్ కేఎల్ రాహుల్, కోచ్ అనిల్ కుంబ్లే సంతోషంగా ఉన్నారని పంజాబ్ కింగ్స్ సహ యజమాని నెస్వాడియా అన్నారు. అవసరమైన క్రికెటర్లు దొరకడంతో ఇక మైదానంలోకి దిగి అద్భుతంగా ఆడటమే మిగిలుందని పేర్కొన్నారు. జట్టు పేరును మార్చాలని...
2019 నుంచే పేరు మార్పుపై ఆలోచించాం: నెస్ వాడియా
(Image: Twitter)
ముంబయి: ఐపీఎల్ వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్ల పట్ల కెప్టెన్ కేఎల్ రాహుల్, కోచ్ అనిల్ కుంబ్లే సంతోషంగా ఉన్నారని పంజాబ్ కింగ్స్ సహ యజమాని నెస్వాడియా అన్నారు. అవసరమైన క్రికెటర్లు దొరకడంతో ఇక మైదానంలోకి దిగి అద్భుతంగా ఆడటమే మిగిలుందని పేర్కొన్నారు. జట్టు పేరును మార్చాలని రెండేళ్లుగా భావిస్తున్నామని ఆయన వెల్లడించారు. ‘కింగ్స్ XI పంజాబ్’తో పోలిస్తే ‘పంజాబ్ కింగ్స్’ అభిమానులను మరింత ఆకట్టుకుంటుందని ధీమాగా ఉన్నారు.
‘చాలా అంశాలను మార్చాలని మేం భావించాం. చాలా ఏళ్లు గడవడంతో మమ్మల్ని మేం రీబ్రాండ్ చేసుకోవాల్సిన అవసరముందని నిర్ణయించుకున్నాం. కొన్ని సవ్యంగా సాగకపోతే మార్పుచేసి ప్రయత్నించాలన్నది తెలిసిందే కదా’ అని నెస్వాడియా అన్నారు.
‘కింగ్స్ XI పంజాబ్ అనేది పదకొండు మందినే ప్రతిబింబిస్తోంది. పంజాబ్ కింగ్స్ మరింత సమ్మిళితంగా ఉంది. ఎక్కువ మందిని ఆకట్టుకునేలా ఉంటుంది. రెండు మూడేళ్లుగా పేరు మార్పుపై సమాలోచించాం. 2020లో కొవిడ్ రావడంతో ఆపేశాం. వచ్చే ఏడాది భారీ వేలంలో లేదా ఈ సారి చిన్న వేలంలోనైనా మారుద్దామని అనుకున్నాం. చివరికి ఇదే ఏడాది మార్పు చేశాం’ అని వాడియా పేర్కొన్నారు.
యూఏఈలో భారీ సంఖ్యలో కొవిడ్ కేసులు నమోదవుతున్నాయని వాడియా తెలిపారు. ఇప్పటికైతే భారత్ సురక్షితంగా కనిపిస్తోందని స్పష్టం చేశారు. గతేడాది మాదిరిగానే కఠిన నిబంధనలు అమలు చేయాల్సి ఉంటుందన్నారు. ‘ఈసారి స్టేడియంలోకి అభిమానులు వస్తారు. పూర్తి స్థాయిలో అనుమతిస్తారని మాత్రం అనుకోను. ఏదేమైనా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పగలను. టోర్నీకి ఇంకా రెండు నెలల సమయం ఉంది’ అని ఆయన పేర్కొన్నారు. 9 లేదా 10 జట్ల ఐపీఎల్ గురించి మాట్లాడుతూ ‘9 జట్లతో నిర్వహణ బాగుంటుందని అనుకోను. పదైతే మంచి సంఖ్య. బ్రాండ్ను విస్తరించినట్టూ అవుతుంది. అభిమానులూ పెరుగుతారు. ఐపీఎల్ అవకాశం ఎక్కువ మందికి దొరుకుతుంది’ అని ఆయన వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని