‘మొతేరా’ విజయ రహస్యం చెప్పిన అజ్జూభాయ్!
మొతేరా తరహా పొడి పిచ్లపై విజయవంతం అవ్వాలంటే బ్యాట్స్మెన్ ఫుట్వర్క్, షాట్ల ఎంపిక అత్యంత కచ్చితత్వంతో ఉండాలని టీమ్ఇండియా మాజీ సారథి మహ్మద్ అజహరుద్దీన్ అన్నాడు. స్పిన్కు అనుకూలించే పిచ్లపై ఆడేటప్పుడు ఆటగాళ్లు రబ్బరు సోల్స్ ఉన్న బూట్లను ధరించాలని సూచించాడు....
హైదరాబాద్: మొతేరా తరహా పొడి పిచ్లపై విజయవంతమవ్వాలంటే బ్యాట్స్మెన్ ఫుట్వర్క్, షాట్ల ఎంపిక అత్యంత కచ్చితత్వంతో ఉండాలని టీమ్ఇండియా మాజీ సారథి మహ్మద్ అజహరుద్దీన్ అన్నాడు. స్పిన్కు అనుకూలించే పిచ్లపై ఆడేటప్పుడు ఆటగాళ్లు రబ్బరు సోల్స్ ఉన్న బూట్లను ధరించాలని సూచించాడు. డే/నైట్ టెస్టు రెండు రోజుల్లోనే ముగియడం అసంతృప్తికి గురిచేసిందని పేర్కొన్నాడు. శుక్రవారం ఆయన వరుస ట్వీట్లు చేశాడు.
ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంలో తలపడ్డ గులాబి పోరులో భారత్, ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ పరుగులు చేసేందుకు విపరీతంగా శ్రమించిన సంగతి తెలిసిందే. స్పిన్నర్ల బంతులను ఎదుర్కోలేక వారు త్వరగా బ్యాట్లెత్తేశారు. దాంతో ఇంగ్లాండ్ 112, 81 స్కోర్లకే పరిమితమవ్వగా టీమ్ఇండియా 10 వికెట్ల తేడాతో విజయం అందుకుంది.
‘బ్యాటింగ్ చేసేటప్పుడు స్పైక్స్ ధరించాలన్న కనీస ఆలోచన అవసరం. రబ్బరు సోల్స్ బ్యాట్స్మెన్ సామర్థ్యాన్ని తగ్గించవు. రబ్బరు సోల్స్ ఉన్న బూట్లను ధరించి కఠినమైన పిచ్లపై అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడిన బ్యాట్స్మెన్ను నేను చూశా. వికెట్ల మధ్య పరిగెడుతుంటే జారిపడతారన్న వాదనను నేను అంగీకరించను. ఎందుకంటే వింబుల్డన్లో టెన్నిక్ క్రీడాకారులంతా రబ్బరు సోల్స్ ఉన్న బూట్లనే ధరించి ఆడతారు. ఇంకా చెప్పాలంటే సునిల్ గావస్కర్, మొహిందర్ అమర్నాథ్, దిలీప్ వెంగ్సర్కారే వంటి భారతీయులే కాకుండా సర్ వివ్రిచర్డ్స్, మైక్ గ్యాటింగ్, అలన్ బోర్డర్, క్లైవ్ లాయిడ్ వంటి ఎంతోమంది నాకు గుర్తొస్తారు’ అని అజ్జూ అన్నాడు.
అహ్మదాబాద్ టెస్టులో బ్యాట్స్మెన్ వరుసపెట్టి పెవిలియన్ చేరడం నిరాశపరిచిందని అజహరుద్దీన్ అన్నాడు. పొడి పిచ్లు, స్పిన్ పిచ్లపై ఆడుతున్నప్పుడు ఫుట్వర్క్, షాట్ల ఎంపిక పక్కాగా ఉండాలని సూచించాడు. కాగా మొతేరా టెస్టులో రోహిత్, జాక్ క్రాలీ మాత్రమే అర్ధశతకాలు చేసిన సంగతి తెలిసిందే. చాలామంది స్పిన్ పిచ్ను విమర్శిస్తుండగా సునిల్ గావస్కర్ లాంటి వారు స్పిన్నర్ల సత్తాను ప్రశంసిస్తుండటం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్