Rakheem Cornwall: టీ20ల్లో తొలి 200 కొట్టిన విండీస్‌ బాహుబలి

టీ20ల్లో శతకం చేయడమే అద్భుతమనుకుంటే.. విండీస్‌ బ్యాటర్‌ ఏకంగా డబుల్ సెంచరీ కొట్టేశాడు. అయితే ఇది టీ20 లీగ్‌లో కావడం గమనార్హం. ఇంతకీ అతడు విండీస్ బాహుబలిగా పేరొందిన రకీం కార్నెల్‌ కేవలం 77 బంతుల్లోనే 200+ బాదేశాడు.

Updated : 06 Oct 2022 16:34 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20ల్లో అర్ధశతకం చేస్తే గొప్ప.. ఇక సెంచరీ మార్క్‌ను తాకితే అద్భుతం.. ఇలాంటి పొట్టి ఫార్మాట్‌లో ఏకంగా ఓ బ్యాటర్‌ డబుల్‌ సెంచరీ బాదేశాడు. మొత్తం 120 బంతులు ఉండే మ్యాచ్‌లో అతడే 77 బంతులను ఆడి 205 పరుగులు సాధించడం గమనార్హం. ఇంతకీ ఆ వీరభయంకర ప్లేయర్ ఎవరంటారా...? వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ రకీం కార్నెల్.. ఇలా పేరు చెబితే పెద్దగా ఎవరికీ తెలియదు. ఎందుకంటే అతడు తన జాతీయ జట్టు తరఫున ఆడిందే కేవలం తొమ్మిది టెస్టులు మాత్రమే. కానీ ‘విండీస్‌ బాహుబలి’ అనగానే.. భారీ కాయంతో ఉండే రకీం కార్నెల్‌ తప్పకుండా గుర్తుకొస్తాడు.

అయితే విండీస్‌ తరఫున ఆడుతూ రకీం కార్నెల్‌ ఇలా వీరవిహారం చేయలేదు. అమెరికా వేదికగా టీ20 టోర్నమెంట్‌ అట్లాంటా ఓపెన్‌లో అట్లాంటా ఫైర్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ చెలరేగాడు. కేవలం 77 బంతుల్లో 266.23 స్ట్రైక్‌రేట్‌తో 205 పరుగులను బాదేశాడు. అందులో 22 సిక్స్‌లు, 17 ఫోర్లు ఉండటం గమనార్హం. దీంతో స్క్వేర్‌ డ్రైవ్‌ జట్టుపై అట్లాంటా ఫైర్‌ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 326 పరుగులు చేసింది. ప్రముఖ గణాంక నిపుణుడు మోహన్‌దాస్‌ మేనన్‌ తన ట్విటర్‌లో పోస్టు చేశాడు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని