అనుకూలించినప్పుడే అందిపుచ్చుకోవాలి: అక్షర్
పరిస్థితులు అనుకూలిస్తున్నప్పుడే అందిపుచ్చుకోవాలని టీమ్ఇండియా యువ స్పిన్నర్ అక్షర్ పటేల్ అంటున్నాడు. స్పిన్కు సహకరిస్తున్న పిచ్ను ఉపయోగించుకొని వికెట్లకు బంతులు విసరడమే తన లక్ష్యమని అతడు పేర్కొన్నాడు. ఇంగ్లాండ్తో డే/నైట్ టెస్టు తొలిరోజు ఆట ముగిసిన తర్వాత అతడు మీడియాతో మాట్లాడాడు...
(Pic:BCCI)
అహ్మదాబాద్: పరిస్థితులు అనుకూలిస్తున్నప్పుడే అందిపుచ్చుకోవాలని టీమ్ఇండియా యువ స్పిన్నర్ అక్షర్ పటేల్ అంటున్నాడు. స్పిన్కు సహకరిస్తున్న పిచ్ను ఉపయోగించుకొని వికెట్లకు బంతులు విసరడమే తన లక్ష్యమని అతడు పేర్కొన్నాడు. ఇంగ్లాండ్తో డే/నైట్ టెస్టు తొలిరోజు ఆట ముగిసిన తర్వాత అతడు మీడియాతో మాట్లాడాడు.
మొతెరా వేదికగా జరుగుతున్న గులాబి టెస్టులో అక్షర్ పటేల్ విజృంభించాడు. 21.4 ఓవర్లు విసిరి 38 పరుగులిచ్చి ఏకంగా 6 వికెట్లు పడగొట్టాడు. వరుసగా రెండో టెస్టులోనూ 5+ వికెట్ల ఘనత అందుకున్నాడు. ఇంగ్లాండ్ నడ్డి విరిచాడు. అతడికి తోడుగా అశ్విన్ 3 వికెట్లు తీయడంతో ప్రత్యర్థి 112 పరుగులకే కుప్పకూలింది. బదులుగా తొలిరోజు ఆట ముగిసే సరికి టీమ్ఇండియా 99/3తో నిలిచింది.
‘సహకరిస్తున్న పిచ్ను పూర్తిగా సద్వినియోగం చేసుకోవడమే నా లక్ష్యం. ఎందుకంటే పరిస్థితులు అనుకూలిస్తున్నప్పుడే అందిపుచ్చుకోవాలి. చెన్నైలో బంతి జారలేదు. మొతెరాలో మాత్రం బంతి జారిపోతోంది. అందుకే ఎక్కువగా ఎల్బీలు అయ్యారు. గరిష్ఠంగా గంటకు 85-90 కి.మీ వేగంతో బంతులు విసిరితే చాలు. ఎక్కువ టీ20 క్రికెట్ ఆడుతుండటంతో ఆ ప్రభావం టెస్టు క్రికెట్పై ఉంటోంది. బ్యాట్స్మెన్ దూకుడుగా ఆడుతున్నారు. అందుకే కఠినమైన లైన్, లెంగ్తులో వేగంగా బంతులు వేయడం విజయవంతం అవుతోంది. ఒకవేళ బ్యాట్స్మెన్ బంతిని చక్కగా అడ్డుకుంటే బౌలర్ వెనకడుగు వేసి వ్యూహం మార్చాలి. కానీ బ్యాటర్ స్వీప్, రివర్స్ స్వీప్ ఆడుతున్నాడంటే మాత్రం అవకాశం ఉన్నట్టే లెక్క’ అని అక్షర్ వివరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!