IPL 2022: హార్దిక్ పాండ్య కష్టమే.. సారథ్యం వైపు శ్రేయస్ చూపు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా వేలం త్వరలో జరగనుంది. ప్రస్తుతం ఉన్న ఫ్రాంచైజీలునలుగురు.....
ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా వేలం త్వరలో జరగనుంది. ప్రస్తుతం ఉన్న ఫ్రాంచైజీలు నలుగురు ఆటగాళ్లను రిటెన్షన్ చేసుకునే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. కొత్తగా వస్తోన్న అహ్మదాబాద్, లఖ్నవూ జట్లకు మెగా వేలానికి ముందే ముగ్గురు ఆటగాళ్లను ఎంపిక చేసుకునే వెసులుబాటును బీసీసీఐ కల్పించనుంది. ఈ క్రమంలో జట్టు యాజమాన్యాలు ఎవరిని ఉంచుకుంటాయి..? మళ్లీ వేలంలో ఎవరిని తీసుకుంటాయనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. నవంబర్ చివరి నాటికి రిటెయిన్ ఆటగాళ్ల జాబితాను ఫ్రాంచైజీలు బీసీసీఐకి ఇవ్వాల్సి ఉంది. తాను ఐపీఎల్ మెగా వేలంలోకి వస్తానని, సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తనను రిటెయిన్ చేస్తుందనే నమ్మకం లేదని ఇప్పటికే డేవిడ్ వార్నర్ వ్యాఖ్యానించాడు. ఈ నేపథ్యంలో ముంబయి, దిల్లీ జట్లు ఎవరిని రిటెయిన్ చేసుకుంటాయనే దానిపై విశ్లేషకులు అంచనా వేస్తున్నారు..
హార్దిక్ విషయంలో కష్టమే..
అత్యంత ఖరీదైన ఫ్రాంచైజీ అయిన ముంబయి ఇండియన్స్ ఎవరిని రిటెయిన్ చేసుకుంటుందనే దానిపై తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే ముంబయి ఇండియన్స్లో అందరూ అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లే. ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ, ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, కీరన్ పొలార్డ్ను రిటెయిన్ చేసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక నాలుగో స్థానం కోసం తీవ్రమైన పోటీ ఉందనే చెప్పాలి. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ ముందు వరుసలో ఉన్నారు. అయితే ఫామ్ కోల్పోయి ఇబ్బందిపడుతున్న హార్దిక్ పాండ్యను ఉంచుకునే అవకాశాలు చాలా తక్కువని ఐపీఎల్ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. రెండేళ్ల కిందట హార్దిక్ సూపర్ ఫామ్లో ఉండేవాడని.. ప్రస్తుతం బౌలింగ్ చేసేందుకు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడని పేర్కొన్నారు. అదే సమయంలో బ్యాటింగ్లోనూ రాణించడం లేదు. అయితే పాండ్యను రిటెయిన్ చేసుకోకపోయినా, వేలంలో మాత్రం ముంబయి ఇండియన్స్ కొనుగోలు చేసే అవకాశం ఉన్నట్లు వివరించారు. ముంబయి ఇండియన్స్ రిటెయిన్ చేసుకునే టాప్-4 జాబితాలో రోహిత్, బుమ్రా, పొలార్డ్, సూర్యకుమార్/ఇషాన్ కిషన్ ఉండొచ్చని విశ్లేషించారు.
* ఐపీఎల్ 14వ సీజన్లో ఆల్ రౌండర్ పాత్రకు హార్దిక్ న్యాయం చేయలేదనే చెప్పొచ్చు. 12 మ్యాచులు ఆడిన పాండ్య కేవలం 127 పరుగులు మాత్రమే చేశాడు. ఒక్కటంటే ఒక్క అర్ధశతకం లేదు. అత్యధిక స్కోరు 40* పరుగులు. ఐపీఎల్ 2020 సీజన్లో 14 మ్యాచ్లకుగాను ఒక అర్ధశతకంతో 281 పరుగులు చేశాడు. వ్యక్తిగత అత్యధిక స్కోరు 60* పరుగులు.
* 12 మ్యాచుల్లో ఒక్క మ్యాచులోనూ బౌలింగ్ చేయకపోవడం గమనార్హం. గతేడాదీ ఇదే పరిస్థితి. వెన్నెముక గాయమైనప్పటి నుంచి బ్యాటింగ్, బౌలింగ్లో రాణించలేకపోతున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్ తొలి మ్యాచ్లోనూ బౌలింగ్ చేయలేదు. నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్నప్పటికీ వచ్చే మ్యాచుల్లో బౌలింగ్ చేస్తాడనే నమ్మకమూ తక్కువే. హార్దిక్ బదులు వేరే బ్యాటర్ను లేదా ఆల్రౌండర్ను తీసుకోవాలనే సూచనలు వస్తున్నాయి.
కెప్టెన్సీ వైపు అయ్యర్ చూపులు..!
శ్రేయస్ అయ్యర్ దిల్లీ క్యాపిటల్స్ కీలక ఆటగాడు. సారథిగా గత సీజన్లో డీసీని ఫైనల్కు చేర్చిన అయ్యర్ను కాదని ఈ సీజన్లో రిషభ్ పంత్కు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది యాజమాన్యం. ఇంగ్లండ్తో స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్ సందర్భంగా శ్రేయస్ అయ్యర్ గాయపడటంతో డీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ 21 మొదటి దశకు దూరం కాగా.. రెండో దశకు అందుబాటులోకి వచ్చాడు. యూఏఈ ఎడిషన్లో శ్రేయస్ ఎనిమిది మ్యాచుల్లో 175 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. అయితే డీసీ యాజమాన్యం కెప్టెన్గా పంత్నే కొనసాగించింది. దిల్లీని పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిపి ప్లేఆఫ్స్కు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో వచ్చే సీజన్కు పంత్ను కాదని అయ్యర్కు సారథ్యం అప్పగించే అవకాశాలు తక్కువే. అయితే టాప్ బ్యాటర్ అయిన శ్రేయస్ను రిటెయిన్ చేసుకునేందుకు మాత్రం డీసీ మొగ్గు చూపుతుంది. అయితే సారథ్యం ఇవ్వకపోతే వచ్చే సీజన్లో దిల్లీకి ఆడేందుకు అయ్యర్ ఇష్టపడకపోవచ్చు. అవకాశం ఉంటే కొత్తగా వస్తున్న జట్లలో ఒకదానికి కెప్టెన్గా వ్యవహరించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు కొత్త సారథుల కోసం వేట మొదలెట్టాయని.. అందుకే అయ్యర్ చూపు కెప్టెన్సీ వైపు మళ్లినట్లు విశ్లేషకులు అంచనా వేశారు. దిల్లీ క్యాపిటల్స్ రిటెయిన్ చేసుకోవాలంటే మాత్రం శిఖర్, పంత్, శ్రేయస్, హెట్మెయిర్, పృథ్వీషా, రబాడా, నార్జే ఆటగాళ్లలో నలుగురిని అట్టిపెట్టుకునే అవకాశం ఉంది. మరి ఎవరిని రిటెయిన్ చేసుకుంటారో వేచి చూద్దాం..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోహ్లీకి అరుదైన గౌరవం.. జైపుర్ మ్యూజియంలో మైనపు విగ్రహం
టీమ్ఇండియా స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీకి మరో అరుదైన గౌరవం దక్కింది. -
ఐపీఎల్లో ఆ రూల్ నాకు నచ్చలేదు: రోహిత్ శర్మ
ఐపీఎల్లో అనుసరిస్తున్న ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తనకు అంతగా నచ్చలేదని ముంబయి స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ (Rohit Sharma) అన్నాడు. -
స్వదేశంలో జోఫ్రా ఆర్చర్ వరల్డ్ కప్ ఆడటం కష్టమేనా..?
ఐపీఎల్ ముగిసిన వారం తర్వాత టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. అయితే, ఇంగ్లాండ్ స్టార్ పేసర్ మాత్రం ఆడే అవకాశాలు తక్కువే. -
ముంబయి గెలవాలంటే.. హార్దిక్ ఫామ్ అందుకోవడం అత్యవసరం: ఫించ్
ముల్లాన్పుర్ వేదికగా పంజాబ్తో తలపడేందుకు ముంబయి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఆ జట్టు విజయం సాధించాలంటే కెప్టెన్ రాణించాలని మాజీ క్రికెటర్ ఫించ్ వ్యాఖ్యానించాడు. -
అనుమానిత బుకీలను గుర్తించిన బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్!
ఐపీఎల్లో ఎలాంటి అనైతిక కార్యకలాపాలు జరగకుండా చూసేందుకు ఏర్పాటైన యాంటీ కరప్షన్ యూనిట్ తన పనిని మొదలు పెట్టింది. -
డేవన్ కాన్వే ఔట్.. మరో సీనియర్ ప్లేయర్కు చెన్నై అవకాశం
న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు డేవన్ కాన్వే ప్రస్తుత ఐపీఎల్ సీజన్ నుంచి వైదొలిగాడు. గాయం కారణంగా ఆటడం లేదని ఐపీఎల్ మేనేజ్మెంట్ వెల్లడించింది. -
భారత క్రికెట్లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం
ఐపీఎల్లో చెన్నై జట్టును తక్కువ చేయడం సరికాదని భారత మాజీ క్రికెటర్ శివరామకృష్ణన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. -
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ
పొట్టి కప్ కోసం జట్టు ఎంపికపై ఇప్పటి వరకు తానెవరినీ కలవలేదని భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) స్పష్టం చేశాడు. -
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
భారీ విజయంతో దిల్లీ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగు పర్చుకుంది. సొంతమైదానంలోనే గుజరాత్ను చిత్తు చేసి ఈ సీజన్ ఐపీఎల్లో దిల్లీ మూడో విజయాన్ని నమోదు చేసింది. -
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
భళా పంత్!.. అదరగొడుతున్న దిల్లీ కెప్టెన్
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..
తాజా వార్తలు (Latest News)
-
జీహెచ్ఎంసీ పరిధిలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం
-
పదవి కోసం పెద్దిరెడ్డి నా కాళ్లు పట్టుకున్నారు: కిరణ్కుమార్రెడ్డి
-
ఇండిగో ప్యాకేజీ ఫుడ్లో అధిక ఉప్పు.. ఇన్ఫ్లూయెన్సర్ వీడియోపై సంస్థ క్లారిటీ
-
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కోహ్లీకి అరుదైన గౌరవం.. జైపుర్ మ్యూజియంలో మైనపు విగ్రహం