T20 League : రెండు జట్లు ఫిక్స్.. మరో రెండింటి కోసం టఫ్ ఫైట్
ప్రస్తుత టీ20 మెగా టోర్నీలో ముప్పావు మ్యాచులు ముగిసినా టాప్-4 జాబితాలో ఉండే జట్లు ఏంటనేవి ఇంకా తెలియలేదు. మ్యాచులు జరిగే కొద్దీ ప్లేఆఫ్స్ బెర్తులను ఖరారు చేసుకునే జట్లేవో తెలుసుకోవడం ఆసక్తికరంగా మారింది. కొన్ని జట్లేమో వరుసగా...
ఎక్కువ అవకాశాలు ఉన్న జట్లపై ప్రత్యేక కథనం
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుత టీ20 మెగా టోర్నీలో ముప్పావు మ్యాచులు ముగిసినా టాప్-4 జాబితాలో ఉండే జట్లు ఏంటనేవి ఇంకా తెలియలేదు. మ్యాచులు జరిగే కొద్దీ ప్లేఆఫ్స్ బెర్తులను ఖరారు చేసుకునే జట్లేవో తెలుసుకోవడం ఆసక్తికరంగా మారింది. కొన్ని జట్లేమో వరుసగా ఓటమి బాట పట్టగా.. మరికొన్నేమో విజయాలను నమోదు చేస్తున్నాయి. ఇప్పటి వరకు లీగ్ దశలో 56 మ్యాచ్లు ముగిశాయి. ఇందులో రెండు జట్లు దాదాపు ప్లేఆఫ్స్ బెర్తులను ఖరారు చేసుకోగా.. మిగతా రెండు స్థానాలు ఎవరికి దక్కుతాయో తేలాల్సి ఉంది. మరి అవేంటో ఓ సారి తెలుసుకుందాం..
తొలిసారే బెర్తులు ఖరారు..
హేమాహేమీలను కాదని కొత్త జట్లు లఖ్నవూ, గుజరాత్ ఈ సీజన్లో దూసుకుపోతున్నాయి. రెండు జట్లూ తలో పదకొండేసి మ్యాచ్లను ఆడేశాయి. ఎనిమిదేసి విజయాలతో ఉన్నాయి. అయితే కాస్త రన్రేట్ ఎక్కువగా ఉండటంతో లఖ్నవూ (16) గుజరాత్ (16) కంటే ముందుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ జట్లకు ఇంకా మూడేసి మ్యాచ్లు ఉన్నాయి. వాటిల్లో ఓడినా సరే పదహారేసి పాయింట్లతో టాప్-4లో మాత్రం ఉండటం పక్కా. కాబట్టి గుజరాత్, లఖ్నవూ దాదాపు ప్లేఆఫ్స్కు వెళ్లినట్లే.
మిగిలిన మ్యాచ్లు..
* లఖ్నవూ: గుజరాత్, రాజస్థాన్, కోల్కతా
* గుజరాత్: లఖ్నవూ, చెన్నై, బెంగళూరు
రెండు జట్లకే ఎక్కువ అవకాశాలు
లఖ్నవూ, గుజరాత్ టీమ్ల తర్వాత పాయింట్ల పట్టికలో రాజస్థాన్ (14), బెంగళూరు (14) వరుసగా ఉన్నాయి. అయితే బెంగళూరు ఇప్పటి వరకు 12 మ్యాచులకుగాను ఏడు విజయాలు, ఐదు ఓటములతో కొనసాగుతోంది. కానీ రాజస్థాన్ మాత్రం 11 మ్యాచుల్లోనే ఏడు విజయాలు నమోదు చేసింది. కాబట్టి బెంగళూరు కంటే రాజస్థాన్కే కాస్త అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఒకవేళ మిగతా మూడు మ్యాచ్లను కనీసం రెండు గెలిస్తే రాజస్థాన్ ఖాయంగా ప్లేఆఫ్స్కు చేరుకుంటుంది. అదేవిధంగా బెంగళూరు తన చివరి రెండు మ్యాచుల్లో విజయం సాధిస్తే మాత్రం ఇతర జట్ల సమీకరణాలతో అవసరం లేకుండానే ప్లేఆఫ్స్కు వెళ్తుంది. అలా కాకుండా ఒకటే గెలిస్తే రన్రేట్ను బట్టి అడుగు ముందుకు పడుతుందో లేదో చూడాలి.
మిగిలిన మ్యాచ్లు..
* రాజస్థాన్: దిల్లీ, లఖ్నవూ, చెన్నై
* బెంగళూరు: పంజాబ్, గుజరాత్
ఈ మూడు ముందుకు సాగేనా..?
వరుసగా ఐదు మ్యాచ్లను గెలిచి ప్లేఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చిన హైదరాబాద్ ఆ తర్వాత నాలుగు ఓటములతో డీలా పడింది. హైదరాబాద్తో పాటు దిల్లీ, పంజాబ్ జట్లు కూడా ఐదేసి విజయాలతో 10 పాయింట్లు సాధించాయి. ప్రస్తుతం దిల్లీ ఐదు, హైదరాబాద్ ఆరు, పంజాబ్ ఏడో స్థానాల్లో నిలిచాయి. ఇంకా ఈ జట్లకు మూడేసి మ్యాచ్లు ఉన్నాయి. అన్నింట్లోనూ గెలిస్తే తప్పకుండా ప్లేఆఫ్స్ అవకాశాలు ఉంటాయి. అయితే ఒక్కటి ఓడినా రేసు నుంచి తప్పుకుని ఇంటిముఖం పట్టక తప్పదు. హైదరాబాద్, పంజాబ్ కంటే దిల్లీకే ఛాన్సులు అధికం. నెట్రన్రేట్ ఎక్కువ ఉండటం కలిసొస్తుంది. కేన్ విలియమ్సన్ సారథ్యంలోని హైదరాబాద్ వరుసగా నాలుగు మ్యాచ్లు ఓడిపోవడంతో ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.
మిగిలిన మ్యాచ్లు..
* హైదరాబాద్: కోల్కతా, ముంబయి, పంజాబ్
* దిల్లీ: రాజస్థాన్, పంజాబ్, ముంబయి
* పంజాబ్: హైదరాబాద్, దిల్లీ, బెంగళూరు
అద్భుతాలే జరగాలి..
పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన ముంబయి (4) ప్లేఆఫ్స్ చేరే అవకాశమే లేదు. మరోవైపు తొమ్మిదో స్థానంలో ఉన్న చెన్నై (8).. అద్భుతాలు జరిగితే తప్ప టాప్-4లో నిలవదు. ఇక ఎనిమిదిలో ఉన్న పంజాబ్ (10), ఏడులో ఉన్న కోల్కతా (10) ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే మిగిలిన రెండు మ్యాచ్ల్లో శక్తికి మించి రాణించాలి. అవి విజయం సాధించినా ఇతర జట్లతో రన్రేట్ పరంగా మెరుగ్గా ఉండాలి.
మిగిలిన మ్యాచ్లు..
* చెన్నై: ముంబయి, గుజరాత్, రాజస్థాన్
* కోల్కతా: హైదరాబాద్, లఖ్నవూ
* ముంబయి: చెన్నై, హైదరాబాద్, దిల్లీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐపీఎల్లో ఆ రూల్ నాకు నచ్చలేదు: రోహిత్ శర్మ
ఐపీఎల్లో అనుసరిస్తున్న ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తనకు అంతగా నచ్చలేదని ముంబయి స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ (Rohit Sharma) అన్నాడు. -
స్వదేశంలో జోఫ్రా ఆర్చర్ వరల్డ్ కప్ ఆడటం కష్టమేనా..?
ఐపీఎల్ ముగిసిన వారం తర్వాత టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. అయితే, ఇంగ్లాండ్ స్టార్ పేసర్ మాత్రం ఆడే అవకాశాలు తక్కువే. -
ముంబయి గెలవాలంటే.. హార్దిక్ ఫామ్ అందుకోవడం అత్యవసరం: ఫించ్
ముల్లాన్పుర్ వేదికగా పంజాబ్తో తలపడేందుకు ముంబయి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఆ జట్టు విజయం సాధించాలంటే కెప్టెన్ రాణించాలని మాజీ క్రికెటర్ ఫించ్ వ్యాఖ్యానించాడు. -
అనుమానిత బుకీలను గుర్తించిన బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్!
ఐపీఎల్లో ఎలాంటి అనైతిక కార్యకలాపాలు జరగకుండా చూసేందుకు ఏర్పాటైన యాంటీ కరప్షన్ యూనిట్ తన పనిని మొదలు పెట్టింది. -
డేవన్ కాన్వే ఔట్.. మరో సీనియర్ ప్లేయర్కు చెన్నై అవకాశం
న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు డేవన్ కాన్వే ప్రస్తుత ఐపీఎల్ సీజన్ నుంచి వైదొలిగాడు. గాయం కారణంగా ఆటడం లేదని ఐపీఎల్ మేనేజ్మెంట్ వెల్లడించింది. -
భారత క్రికెట్లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం
ఐపీఎల్లో చెన్నై జట్టును తక్కువ చేయడం సరికాదని భారత మాజీ క్రికెటర్ శివరామకృష్ణన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. -
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ
పొట్టి కప్ కోసం జట్టు ఎంపికపై ఇప్పటి వరకు తానెవరినీ కలవలేదని భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) స్పష్టం చేశాడు. -
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
భారీ విజయంతో దిల్లీ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగు పర్చుకుంది. సొంతమైదానంలోనే గుజరాత్ను చిత్తు చేసి ఈ సీజన్ ఐపీఎల్లో దిల్లీ మూడో విజయాన్ని నమోదు చేసింది. -
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
భళా పంత్!.. అదరగొడుతున్న దిల్లీ కెప్టెన్
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..
తాజా వార్తలు (Latest News)
-
భారీ బంగారం కంటెయినర్ మాయం కేసు.. నిందితుల్లో భారత సంతతి వ్యక్తులు
-
దుబాయ్లో వర్షాలు.. భారతీయుల కోసం హెల్ప్లైన్ నంబర్లు
-
ఐపీఎల్లో ఆ రూల్ నాకు నచ్చలేదు: రోహిత్ శర్మ
-
ఇన్ఫీ లాభం 30 శాతం జంప్.. ఒక్కో షేరుపై ₹28 డివిడెండ్
-
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో రెండు కెమెరాలతో నిఘా: సీఈవో మీనా
-
సినిమాల్లేక ఖాళీగా కూర్చొనే వాళ్లే అలా ఆలోచిస్తారు: విశాల్