T20 series: న్యూజిలాండ్తో టీ20 సిరీస్.. సీనియర్లకు విశ్రాంతి.!
వచ్చే నెలలో న్యూజిలాండ్తో జరగనున్న మూడు మ్యాచుల టీ20 సిరీస్కు.. పలువురు సీనియర్లకు విశ్రాంతినివ్వనున్నట్లు సమాచారం. టీ20 ప్రపంచకప్ ముగిసిన వెంటనే ఈ సిరీస్ ఉండటం, పలువురు ఆటగాళ్లు గత నాలుగు..
ఇంటర్నెట్ డెస్క్: వచ్చే నెలలో న్యూజిలాండ్తో జరగనున్న మూడు మ్యాచుల టీ20 సిరీస్కు.. పలువురు సీనియర్లకు విశ్రాంతినివ్వనున్నట్లు సమాచారం. టీ20 ప్రపంచకప్ ముగిసిన వెంటనే ఈ సిరీస్ ఉండటం, పలువురు ఆటగాళ్లు గత నాలుగు నెలలుగా వరుసగా బయో బబుల్లో గడుపుతుండటం ఇందుకు ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. జూన్ నుంచి బయో బబుల్లో గడుపుతున్న విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమి వంటి కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే, టీ20 ప్రపంచకప్ ముగిసిన వెంటనే నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటానని కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రకటించిన నేపథ్యంలో.. రోహిత్ శర్మకు విశ్రాంతి ఇవ్వాలా.. వద్దా.. అనే విషయంలో సందిగ్దం నెలకొంది. నవంబరు 17 నుంచి న్యూజిలాండ్తో టీ20 సిరీస్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మెరుగ్గా రాణించిన ఆటగాళ్లకు ఈ సిరీస్లో అవకాశమివ్వనున్నారు. ఈ నేపథ్యంలో యువ ఆటగాళ్లు రుతురాజ్ గైక్వాడ్, హర్షల్ పటేల్, అవేశ్ ఖాన్, వెంకటేశ్ అయ్యర్ జట్టులో స్థానం కోసం పోటీపడుతున్నారు. ఇదిలా ఉండగా, జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)కి హెడ్ కోచ్గా వ్యవహరిస్తున్న రాహుల్ ద్రావిడ్.. న్యూజిలాండ్తో జరుగునున్న టీ20 సిరీస్కు తాత్కాలిక కోచ్గా వ్యవహరించనున్నారని ఊహాగానాలు వస్తున్నాయి.అయితే, సరైన సమయంలో తర్వాతి కోచ్ ఎవరో వెల్లడిస్తామని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. టీమిండియా ప్రస్తుత కోచ్ రవి శాస్త్రి పదవి కాలం ఈ నెలతో ముగియనున్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం