BCCI: దక్షిణాఫ్రికాలో కరోనా విజృంభణ.. టీమ్ఇండియా పర్యటనపై సందిగ్ధం.!
దక్షిణాఫ్రికాలో కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో.. టీమ్ఇండియా పర్యటనపై సందిగ్ధం నెలకొంది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా క్రికెట్ (సీఎస్ఏ) అధికారులతో చర్చించిన తర్వాతే.. టీమ్ఇండియా..
ఇంటర్నెట్ డెస్క్: దక్షిణాఫ్రికాలో కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో.. టీమ్ఇండియా పర్యటనపై సందిగ్ధం నెలకొంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వచ్చిన తర్వాత దక్షిణాఫ్రికా క్రికెట్ (సీఎస్ఏ) అధికారులతో చర్చిస్తామని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. దాని తర్వాతే టీమ్ఇండియా పర్యటనపై తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నాయి. డిసెంబరు 17 నుంచి వచ్చే సంవత్సరం జనవరి 26 వరకు టీమ్ఇండియా.. దక్షిణాఫ్రికాలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా భారత జట్టు దక్షిణాఫ్రికాతో.. మూడు టెస్టులు, మూడు వన్డేలు, 4 టీ20 మ్యాచులు ఆడనుంది.
‘ప్రస్తుతం న్యూజిలాండ్తో జరుగుతోన్న టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత డిసెంబరు 8న గానీ, 9న గానీ దక్షిణాఫ్రికా బయలు దేరాలని గతంలో నిర్ణయించాం. అయితే, దక్షిణాఫ్రికాలో కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో టీమ్ఇండియా పర్యటనపై సందిగ్ధం నెలకొంది. మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వనున్న జొహన్నెస్ బర్గ్, సెంచూరియన్ సమీపంలోని ప్రిటోరియాల్లో కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది. న్యూజిలాండ్తో టెస్టు సిరీస్ ముగిసిన వెంటనే ఆటగాళ్లు ముంబయి నుంచి నేరుగా ఛార్టర్డ్ ఫ్లైట్లో జొహన్నెస్ బర్గ్ చేరుకున్నా.. ప్రస్తుత పరిస్థితుల్లో తప్పనిసరిగా 3-4 రోజులు క్వారంటెయిన్లో ఉండాల్సిందే. అందుకే, మ్యాచ్ల నిర్వహణపై దక్షిణాఫ్రికా క్రికెట్ అధికారిక వర్గాల నుంచి పూర్తి స్పష్టత వచ్చిన తర్వాతే.. టీమ్ఇండియా పర్యటనపై మా నిర్ణయాన్ని వెల్లడిస్తాం’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఇండియా-ఏ జట్టు దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే.
టీమ్ఇండియా.. దక్షిణాఫ్రికా షెడ్యూలిదే..
తొలి టెస్టు : డిసెంబరు 17 నుంచి 21 వరకు - జొహన్నెస్ బర్గ్
రెండో టెస్టు : డిసెంబరు 26 నుంచి 30 వరకు - సెంచూరియన్
మూడో టెస్టు : జనవరి 3 నుంచి 7 వరకు - కేప్టౌన్
తొలి వన్డే : జనవరి 11న - పార్ల్
రెండో వన్డే : జనవరి 14న - కేప్ టౌన్
మూడో వన్డే : జనవరి 16న - కేప్ టౌన్
తొలి టీ20 మ్యాచ్ : జనవరి 19న - కేప్ టౌన్
రెండో టీ20 మ్యాచ్ : జనవరి 21న - కేప్ టౌన్
మూడో టీ20 మ్యాచ్ : జనవరి 23న - పార్ల్
నాలుగో టీ20 మ్యాచ్ : జనవరి 26న - పార్ల్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరుకు రెండో విజయం దక్కింది. మరోవైపు సొంత మైదానంలో హైదరాబాద్కు ఓటమి ఎదురైంది. -
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
వెస్టిండీస్ క్రికెటర్లకు ఐపీఎల్ తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందులను పాక్ మాజీ క్రికెటర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. -
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
టీ20 ప్రపంచకప్కు టీమ్ ఇండియాను ఎంచుకోండి అని అడిగితే.. పాఠకులు సెలక్ట్ చేసిన 15 మంది వీరే. -
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!