IND vs NZ: భారత్ని సొంత గడ్డపై ఓడించడం కఠిన సవాలే: ట్రెంట్ బౌల్ట్
టీమిండియాను సొంతగడ్డపై ఓడించడం కఠిన సవాలేనని న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ అన్నాడు. భారత్ని ఎదుర్కొనేందుకు కివీస్ ఆటగాళ్లు ఆతృతగా ఎదురు చూస్తున్నారని పేర్కొన్నాడు...
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియాను సొంతగడ్డపై ఓడించడం కఠిన సవాలేనని న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ అన్నాడు. భారత్ని ఎదుర్కొనేందుకు కివీస్ ఆటగాళ్లు ఆతృతగా ఎదురు చూస్తున్నారని పేర్కొన్నాడు. ‘ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడటంతో ఇక్కడి పిచ్లపై మంచి అవగాహన ఏర్పడింది. ఎలా బౌలింగ్ చేయాలి?, ఎన్ని పరుగులు చేస్తే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి? అనే విషయాల్లో స్పష్టత వచ్చింది. ఇవన్నీ మా జట్టుకు కలిసొచ్చే అంశాలు. ఆరంభంలోనే కీలక వికెట్లు పడగొడితే మ్యాచ్లో పై చేయి సాధించొచ్చు. అందుకోసం ఎలా బౌలింగ్ చేయాలో కూడా నాకు తెలుసు. ప్రస్తుతం మా ఆటగాళ్లంతా మంచి ఫామ్లో ఉన్నారు’ అని బౌల్ట్ పేర్కొన్నాడు.
గత కొద్దికాలంగా విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్న న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్కు ఆ దేశ క్రికెట్ బోర్డ్ విశ్రాంతినిచ్చింది. దీంతో బుధవారం నుంచి భారత్తో ప్రారంభం కానున్న టీ20 సిరీస్కు కివీస్ బౌలర్ టిమ్ సౌథీని తాత్కాలిక కెప్టెన్గా నియమించింది. ఇప్పటికే భారత్కి చేరుకున్న న్యూజిలాండ్ జట్టు మ్యాచ్ సన్నాహాలు ప్రారంభించింది.
► Read latest Sports News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!