WTC final: బంతి బాగుంటేనే వికెట్లు తీయడం సులువు
ఉమ్మి రుద్దకున్నా ఇంగ్లాండ్లో బంతి స్వింగ్ అవ్వగలదని టీమ్ఇండియా సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ అంటున్నాడు. జట్టు సభ్యుల్లో ఎవరో ఒకరు బంతి నిర్వహణ బాధ్యతను చూసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. మరోవైపు ఇంగ్లాండ్లో పర్యటించేటప్పుడు చెత్త బంతుల్ని వదిలేయడం ముఖ్యమని..
ఉమ్మి రుద్దకున్నా స్వింగ్ అవ్వగలదు: ఇషాంత్
సౌథాంప్టన్: ఉమ్మి రుద్దకున్నా ఇంగ్లాండ్లో బంతి స్వింగ్ అవ్వగలదని టీమ్ఇండియా సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ అంటున్నాడు. జట్టు సభ్యుల్లో ఎవరో ఒకరు బంతి నిర్వహణ బాధ్యతను చూసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. మరోవైపు ఇంగ్లాండ్లో పర్యటించేటప్పుడు చెత్త బంతుల్ని వదిలేయడం ముఖ్యమని యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ అభిప్రాయపడుతున్నాడు. వారిద్దరూ మీడియాతో మాట్లాడారు. సౌథాంప్టన్ వేదికగా జూన్ 18న భారత్, న్యూజిలాండ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో తలపడనున్న సంగతి తెలిసిందే.
‘ఉమ్మి రుద్దకున్నా బంతి స్వింగ్ అవ్వగలదు. అయితే ఎవరో ఒకరు బంతి నిర్వహణ బాధ్యత తీసుకోవాలి. ఇంగ్లాండ్ వాతావరణం, పరిస్థితుల్లో బంతిని జాగ్రత్తగా పర్యవేక్షించడం అవసరం. అప్పుడే బౌలర్లు వికెట్లు తీయడం తేలికవుతుంది’ అని ఇషాంత్ అన్నాడు. కరోనా వైరస్ మహమ్మారి మొదలైనప్పటి నుంచి బంతిపై ఉమ్మి రుద్దడాన్ని ఐసీసీ నిషేధించడం తెలిసిందే. ఇంగ్లాండ్లో లెంగ్త్లను సరిచూసుకోవడం కీలకమని శర్మ అంటున్నాడు.
అన్ని బంతులూ ఆడొద్దు: గిల్
‘ఇంగ్లాండ్లో భిన్నమైన సాధన అవసరం. మార్పునకు త్వరగా అలవాటు పడాలి. భారత్లో కొంత సమయం తర్వాత రివర్స్ స్వింగ్ లభిస్తుంది. ఇంగ్లాండ్లో స్వింగ్ ఉంటుంది కాబట్టి ఆ లెంగ్త్ ఫుల్లర్గా ఉంటుంది. అందుకే ఇక్కడి లెంగ్త్లకు సర్దుకుపోవాలి. ఇక్కడి వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి అలవాటు పడేందుకు కొంత సమయం పడుతుంది. దానికి తోడు క్వారంటైన్లో ఉండటం సవాల్గా మారింది. ఎందుకంటే జిమ్లో కసరత్తులు చేయడానికి మైదానంలో సాధన చేయడానికి ఎంతో తేడా ఉంటుంది’ అని ఇషాంత్ తెలిపాడు.
ఇంగ్లాండ్లో క్రీజులో నిలవాలంటే బ్యాటర్లు చెత్త బంతుల్ని వదిలేయాలని టీమ్ఇండియా యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ అన్నాడు. ‘గతంలో నేను భారత్-ఏ, అండర్-19 జట్ల తరఫున ఇంగ్లాండ్లో ఆడాను. పరుగులు చేయాలంటే కొన్ని బంతుల్ని మాత్రమే ఎంచుకొని ఆడాలని చాలామంది అప్పుడు చెప్పారు. నా వరకైతే పరుగులు చేయాలన్న తపనను ప్రదర్శిస్తేనే బాగుంటుంది. కేవలం నిలబడితే చాలన్నట్టు కనిపించొద్దు. ఎందుకంటే మనం పరుగులు చేయాలన్న ఉద్దేశంతో కనిపిస్తేనే బౌలర్లు వెనకడుగు వేస్తారు. అప్పుడు వారిపై ఒత్తిడి పెట్టగలం. కొన్నిసార్లు ఇంగ్లాండ్లో ఔటవ్వకుండా ఉండాలంటే మాత్రం చెత్త బంతులు వదిలేయాలి’ అని గిల్ పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.