Ganguly, Dravidకు డబ్ల్యూవీ రామన్ లేఖ..
టీమ్ఇండియా మహిళల జట్టులో ‘అంతా నేనే, నా తర్వాతే ఎవరైనా’ అనే అహంకారపూరిత సంస్కృతి నెలకొందని, అది పూర్తిగా తొలగిపోవాలని మాజీ కోచ్ డబ్ల్యూవీ రామన్...
మహిళల టీమ్ఇండియాలో ఆ పద్ధతి పోవాలి..
(Photo: WV Raman Twitter)
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియా మహిళల జట్టులో ‘అంతా నేనే, నా తర్వాతే ఎవరైనా’ అనే అహంకారపూరిత సంస్కృతి నెలకొందని, అది పూర్తిగా తొలగిపోవాలని మాజీ కోచ్ డబ్ల్యూవీ రామన్.. బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ, జాతీయ క్రికెట్ అకాడమీ హెడ్ రాహుల్ ద్రవిడ్కు లేఖ రాశారు. ఇటీవల మహిళల జట్టుకు క్రికెట్ అడ్వైజరీ కమిటి.. మాజీ కోచ్ రమేశ్ పొవార్ను ఎంపిక చేయడంతో రామన్ ఆ బాధ్యతల నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన గంగూలీ, ద్రవిడ్కు లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. రామన్ ఎప్పుడూ క్రికెటర్ల వ్యక్తిగత ప్రాముఖ్యతల కన్నా జట్టుకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని సన్నిహిత వర్గాలు తెలిపాయి.
కాగా, రామన్ రాసిన ఈ లేఖ ఇప్పుడు భారత క్రికెట్లో దుమారం లేపే విధంగా కనిపిస్తోంది. క్రికెటర్లతో విభేదాలున్న ప్రతిసారి కోచ్లు తప్పుకుంటున్నారని, లేదా వారినే తొలగిస్తున్నారనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో రామన్ ఎవరి పేరూ ప్రస్తావించకుండ ఆ లేఖలో జాగ్రత్తపడ్డారు. జట్టులో తామే స్టార్ క్రికెటర్లమనే భావన బలంగా ఉందని, అది జట్టుకు మరింత చేటు చేస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తపర్చినట్లు సమాచారం. మరోవైపు ఈ లేఖను ఎన్సీఏ హెడ్ రాహుల్ ద్రవిడ్కు సైతం పంపించడంలో ఓ ముఖ్యమైన విషయం స్పష్టంగా కనిపిస్తోంది. క్రికెటర్ల కోచింగ్కు సంబంధించిన అంశాలతో పాటు, ట్రైనింగ్ విషయాల్లోనూ ఎన్సీఏనే ప్రణాళికలు సిద్ధం చేసి అమలుచేస్తుంది. దాంతో రామన్ టీమ్ఇండియా మహిళల క్రికెటర్లకు సంబంధించి ఏదైనా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో సూచనలు, సలహాలు చేయాలంటే రాహుల్ ద్రవిడ్ పెద్ద దిక్కుగా కనిపిస్తున్నాడు. అందువల్లే ద్రవిడ్కు సైతం లేఖ రాయడం విశేషంగా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!