MSD-John Cena: ‘నువ్వు నన్ను చూడలేదు’.. ధోనీ ఫొటోను షేర్‌ చేసిన డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్

 అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి విరామం పొంది కేవలం ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్న భారత మాజీ కెప్టెన్‌...

Published : 15 Nov 2021 01:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి విరామం పొంది కేవలం ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్న భారత మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీకి క్రేజ్‌ మాత్రం తగ్గలేదు. టీమ్‌ఇండియాకు రెండు ప్రపంచకప్‌లు (వన్డే, టీ20) అందించిన ధోనీకి పెద్ద స్టార్ల నుంచి సామాన్యుడి వరకు ప్రపంచమంతా అభిమానులు ఉన్నారు. సోషల్‌ మీడియాలో తక్కువ కనిపించే ధోనీ అప్పుడప్పుడు మాత్రమే ఫొటోలను షేర్‌ చేస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు మరొక స్టార్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ధోనీ ఫొటోను ఉంచడంతో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారిపోయాడు. నెటిజన్ల నుంచి తమదైన శైలిలో కామెంట్ల వర్షం కురుస్తోంది. ఇంతకీ అసలు ఎవరు షేర్‌ చేశారు.. ఎలాంటి కామెంట్లు వస్తున్నాయో తెలుసుకోండి మరీ.. 

రెజ్లింగ్‌ ఎంటర్‌టైనర్‌గా డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్‌ జాన్‌ సెన తెలియని క్రీడాభిమానులు ఉండరు. నిన్న (శనివారం) తన సోషల్‌ మీడియా ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంఎస్ ధోనీ ఇమేజ్‌ను షేర్‌ చేశాడు. మ్యాచ్‌ ముగిశాక మెట్ల నుంచి కిందకు దిగుతూ షేక్‌హ్యాండ్‌ ఇవ్వడానికి చేతిని చాచిన ఫొటోకు ఎలాంటి క్యాప్షన్‌ ఇవ్వకుండా పోస్ట్‌ చేసేశాడు. దీంతో నెటిజన్లు తమ కామెంట్లతో చెలరేగిపోయారు. ‘ధోనీ.. నువ్వు నన్ను చూడలేదు’ అని ఒకరు అంటే.. ‘ఇద్దరు దిగ్గజాలు చేయిచేయి కలిపేందుకు వస్తున్నారు’ అంటూ ధోనీ-సెనను ఉద్దేశించి మరొకరు కామెంట్‌ చేశారు. ‘‘తలా - సెన కలిసినప్పుడు’.. ‘‘ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు దిగ్గజాలు’’, ‘‘పవర్‌ఫుల్‌ పీపుల్‌ మేక్స్‌ ప్లేసెస్ పవర్‌ఫుల్’’ అని సరదాగా కామెంట్లు పెడుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని