యువీ.. రిటైర్మెంట్ వెనక్కి!
టీమ్ఇండియా ప్రపంచకప్ల హీరో యువరాజ్ సింగ్ అభిమానులకు శుభవార్త. అతడు రిటైర్మెంట్ను వెనక్కి తీసుకోనేందుకు నిర్ణయించుకున్నాడని సమాచారం. అంతర్జాతీయం కాకుండా దేశవాళీ క్రికెట్లో పంజాబ్ తరఫున టీ20 క్రికెట్ ఆడేందుకు మొగ్గు చూపుతున్నాడని తెలిసింది....
పునరాగమనంపై దాదా, షాకు ఈమెయిల్
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా ప్రపంచకప్ల హీరో యువరాజ్ సింగ్ అభిమానులకు శుభవార్త. అతడు రిటైర్మెంట్ను వెనక్కి తీసుకోనేందుకు నిర్ణయించుకున్నాడని సమాచారం. అంతర్జాతీయం కాకుండా దేశవాళీ క్రికెట్లో పంజాబ్ తరఫున టీ20 క్రికెట్ ఆడేందుకు మొగ్గు చూపుతున్నాడని తెలిసింది. తన పునరాగమనానికి అనుమతి ఇవ్వాలని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జే షాకు ఈమెయిల్ పంపించాడని సంబంధిత వర్గాలు అంటున్నాయి.
యువరాజ్ సింగ్ క్రికెట్కు వీడ్కోలు పలికి ఏడాదిన్నర గడిచింది. ఈ సమయంలో విదేశీ టీ20 లీగుల్లో ఆడాడు. అయితే పోటీ క్రికెట్ కాకుండా సరదా కోసమే ఆడుతానని చెప్పాడు. కొన్నాళ్లుగా అతడు శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ, ప్రభ్సిమ్రన్ సింగ్, అన్మోల్ప్రీత్ సింగ్కు మొహాలీలోని పీసీఏ స్టేడియంలో పంజాబ్ సంఘం తరఫున వారికి మార్గనిర్దేశం చేస్తున్నాడు. ఈ క్రమంలో స్వయంగా బ్యాటు పట్టుకొని నెట్స్లో షాట్లు ఎలా ఆడాలో నేర్పించాడు. అప్పుడు అద్భుతంగా బంతిని బాదుతున్నానని యువీకి అనిపించింది. మరో శిబిరంలో అలాగే చేయడంతో పంజాబ్ కార్యదర్శి పునీత్ బాలి అతడిని కలిశాడు. వీడ్కోలు వెనక్కి తీసుకోవాలని కోరాడని తెలిసింది. దాని గురించి కొన్ని వారాలు ఆలోచించిన యువీ అనుమతి కోరుతూ బీసీసీఐకి ఈమెయిల్ పంపించాడు. ‘క్రిక్ బజ్’తో జరిపిన సంభాషణలో యువరాజ్ సింగ్ స్వయంగా ఈ విషయం చెప్పడం గమనార్హం.
‘యువకులతో సమయం గడపడం, ఆట పరంగా విభిన్న అంశాలు వారికి నేర్పించడం చాలా బాగుంది. నెట్స్లో వారికి కొన్ని షాట్లు చూపించాను. బంతిని అద్భుతంగా బాదుతుండటంతో నాపై నాకే ఆశ్చర్యం వేసింది. అప్పటికే నేను బ్యాటింగ్ చేసి చాలా కాలమైంది. రెండు నెలలు పంజాబ్ తరఫున ఆఫ్ సీజన్ శిబిరానికి వచ్చాను. యువకులతో కలిసి సాధన మ్యాచులు ఆడాను. పరుగులు తీశాను. అప్పుడు పంజాబ్ కార్యదర్శి పునీత్ బాలీ నా వద్దకొచ్చి వీడ్కోలు వెనక్కి తీసుకోవడాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు’ అని యువీ చెప్పాడు.
‘మొదట్లో అనిపించలేదు కానీ తర్వాత ఆలోచిస్తే ప్రతిపాదన నచ్చింది. పంజాబ్కు ఛాంపియన్షిప్లు అందించాలని ప్రేరణ కలిగింది. భజ్జీ, నేనూ వేర్వేరుగా ఎన్నో గెలిచాం. కానీ ఇద్దరం కలిసి పంజాబ్కు ఏం చేయలేకపోయాం. అదే నన్ను నిర్ణయం తీసుకొనేందుకు పురికొల్పింది. అనుమతి వస్తే మాత్రం కేవలం టీ20లు మాత్రమే ఆడతాను. చూద్దాం, ఏం జరుగుతుందో’ అని యువీ అన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం