భారత్, సచిన్ కోసం గెలవాలనుకున్నాం
2011 ఏప్రిల్ 2. భారత క్రికెట్లో అత్యంత కీలకమైన రోజు. 28 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షిణకు తెరదించిన రోజు. సగటు భారత క్రికెట్ అభిమాని ఎన్నటికీ మరులేని రోజు. క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్...
2011 వన్డే ప్రపంచకప్పై యువరాజ్ వీడియో..
ఇంటర్నెట్డెస్క్: 2011 ఏప్రిల్ 2. భారత క్రికెట్లో అత్యంత కీలకమైన రోజు. 28 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షిణకు తెరదించిన రోజు. సగటు భారత క్రికెట్ అభిమాని ఎన్నటికీ మరులేని రోజు. క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ తన కెరీర్ మొత్తం వేచిచూసిన రోజు. ధోనీ కొట్టిన సిక్సర్కు యావత్ భారతం సగర్వంగా సంబరాలు చేసుకున్న రోజు. అదే 2011 ఏప్రిల్ 2వ తేదీ.. అదే టీమ్ఇండియా రెండోసారి వన్డే ప్రపంచకప్ను ముద్దాడిన రోజు. ఇది జరిగి నేటికి పదేళ్లు గడిచాయి. ఈ సందర్భంగా ఆ సిరీస్లో కీలక పాత్ర పోషించిన స్టార్ ఆల్రౌండర్ యువరాజ్సింగ్ కొద్దిసేపటి క్రితం స్పందించాడు. భారత దేశం, సచిన్ కోసం తాము కప్ గెలవాలనుకున్నామని చెప్పాడు.
‘మేం చివరిసారి ప్రపంచకప్ గెలిచి పదేళ్లు పూర్తయ్యాయి. ఈ సమయమంతా చాలా త్వరగా గడిచిపోయింది. ఆ రోజు టీమ్ఇండియా మొత్తం కచ్చితంగా కప్పు గెలవాలని అనుకున్నాం. ముఖ్యంగా సచిన్ కోసం. ఎందుకంటే అదే అతడికి చివరి ప్రపంచకప్ అని అందరికీ తెలుసు. అలాగే స్వదేశంలో ప్రపంచకప్ గెలవడం అంతకుముందు ఏ జట్టూ చేయలేనిది మేం చేయాలనుకున్నాం. ఆరోజు ఎంతో ప్రత్యేకమైంది. మాటల్లో చెప్పలేను. ఆ టోర్నీ మొత్తంలో పలువురు ఆటగాళ్లు గొప్ప ప్రదర్శనలు చేశారు. ఫైనల్లో ధోనీ, గౌతమ్ గంభీర్ రెచ్చిపోగా.. సిరీస్ మొత్తంలో సెహ్వాగ్, సచిన్ మంచి ఓపెనింగ్ భాగస్వామ్యాలు అందించారు. అలాగే జహీర్ ఖాన్ అత్యధిక వికెట్లు, నేను కొన్ని మంచి ప్రదర్శనలు చేశా’ అని యువీ గుర్తుచేసుకున్నాడు.
ఏ క్రికెటర్కైనా ప్రపంచకప్ సాధించడమనేది ప్రత్యేక సందర్భమని, ముఖ్యంగా చిన్న వయసులో టీమ్ఇండియాకు ఆడడం. అక్కడి నుంచి ప్రపంచకప్ గెలవడం అనేవి గొప్ప విశేషాలని యువరాజ్ చెప్పుకొచ్చాడు. ఇదో చారిత్రకమైన రోజని, దీన్ని సచిన్, వీరూతో సహా నాటి జట్టు సభ్యులతో కలిసి జరుపుకోవాలనుకున్నట్లు మాజీ ఆల్రౌండర్ పేర్కొన్నాడు. అయితే, ప్రస్తుతం సచిన్, ఇర్ఫాన్, యూసుఫ్ వంటి నాటి ఆటగాళ్లు కరోనా బారిన పడటంతో వారిని కలవలేకపోతున్నట్లు బాధ పడ్డాడు. తన క్రికెట్ కెరీర్లో ఇంతకుమించిన సంతోషం ఏదీ లేదన్నాడు. ఈరోజును అభిమానులు గుర్తు చేసుకోవాలని అప్పటి ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ ఆకాంక్షించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్