Yuvi In InstaGram: క్రికెట్లోకి పునరాగమనం!.. యువీ సంచలన పోస్టు
రెండేళ్ల కిందట అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పిన టీమ్ఇండియా మాజీ క్రికెటర్, స్టార్ బ్యాటర్ యువరాజ్ సింగ్ సామాజిక మాధ్యమాల్లో ...
ఇంటర్నెట్ డెస్క్: రెండేళ్ల కిందట అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పిన టీమ్ఇండియా మాజీ క్రికెటర్, స్టార్ బ్యాటర్ యువరాజ్ సింగ్ సామాజిక మాధ్యమాల్లో ఒక్కసారిగా వైరల్గా మారాడు. ‘‘వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మళ్లీ పిచ్ మీదకు వస్తున్నా’’ అని ఇన్స్టాగ్రామ్లో పోస్టు పెట్టాడు. దీంతో యువీ అభిమానులు సహా యావత్ క్రికెట్ ప్రపంచం ఆశ్చర్యానికి గురైంది. యువీ మళ్లీ క్రికెట్లోకి పునరాగమనం చేస్తున్నాడా..? అంటూ చర్చించుకుంటున్నారు. క్రికెటర్గానా.. వ్యాఖ్యాతగానా? అంటూ పలువురు విశ్లేషిస్తున్నారు. 2007 టీ20 ప్రపంచకప్, 2011 ప్రపంచకప్లో తన ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన యువీ 2019 జూన్లో అంతర్జాతీయంగా అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ను ప్రకటించాడు. ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన యువీ.. క్రీజ్లో ఉన్నాడంటే విజయంపై ప్రత్యర్థి ఆశలు వదులుకోవాల్సిందే. ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి విరామం తర్వాత ఐపీఎల్ సహా వివిధ లీగ్ పోటీల్లో ఆడుతున్నాడు. అయితే గత రెండు సీజన్ల నుంచి ఐపీఎల్లోనూ ప్రాతినిధ్యం వహించలేదు. ఈ క్రమంలో యువీ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. ‘‘దేవుడే విధిని నిర్ణయిస్తాడు. అభిమానులు, ప్రజల డిమాండ్ మేరకు ఫిబ్రవరిలో పిచ్ మీదకు వస్తానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. అయితే ఇందులో ఎలాంటి ఫీలింగ్ లేదు. మీ అందరి ప్రేమ, శుభాకాంక్షలకు ధన్యవాదాలు. మద్దతు ఇస్తూనే ఉండండి. ఇది మన జట్టు. నిజమైన అభిమాని కష్టసమయాల్లో మద్దతుగా నిలుస్తారు. జైహింద్’’ అంటూ పోస్ట్ చేశాడు. అయితే 39 ఏళ్ల యువరాజ్ సింగ్ మళ్లీ జాతీయ జట్టులోకి రావడం కష్టమేనని, ఐపీఎల్లో ఆడే అవకాశాలను కొట్టిపారేయలేమని.. అలానే క్రికెట్ వ్యాఖ్యాతగానూ మారే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
యువరాజ్సింగ్ 2000వ సంవత్సరంలో టీమ్ఇండియా జట్టులోకి వచ్చాడు. దాదాపు 19 ఏళ్లపాటు జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 40 టెస్టుల్లో 1,900 పరుగులు, 10 వికెట్లు.. 304 వన్డేల్లో 8,701 పరుగులు, 111 వికెట్లను పడగొట్టాడు. టీ20ల్లో 58 మ్యాచులకుగాను 1,177 పరుగులు చేశాడు. బౌలింగ్లోనూ ఫర్వాలేదనించి 29 వికెట్లు తీశాడు. 2002వ సంవత్సరంలో టీమ్ఇండియా నాట్వెస్ట్ సిరీస్ను కైవసం చేసుకోవడంలో యువీ కీలక పాత్ర పోషించాడు. ఇంగ్లాండ్తో లార్డ్స్ వేదికగా జరిగిన మ్యాచ్లో భారీ లక్ష్యాన్ని కైఫ్తో కలిసి యువీ ఛేదించడం.. అప్పటి కెప్టెన్ సౌరభ్ గంగూలీ చొక్కా విప్పి గిరగిరా తిప్పడం ఎన్నటికీ మరువలేం. ఆ మ్యాచ్లో 325 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 24 ఓవర్లలో 146/5తో కష్టాల్లో ఉన్న భారత్ను కైఫ్ (87*) తో కలిసి యువీ (69) సెంచరీ భాగస్వామ్యంతో విజయబాట పట్టించాడు. అలానే 2007 టీ20 ప్రపంచకప్లో ఇంగ్లాండ్ బౌలర్ సువర్ట్ బ్రాడ్ బౌలింగ్లో ఆరు సిక్సర్లు బాదడం గుర్తు ఉండే ఉంటుంది. యువీని ఇంగ్లాండ్ ఆటగాడు ఆండ్రూ ఫ్లింటాప్ కవ్వించడంతో పాపం బ్రాడ్ బలయ్యాడు. ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదడంతోపాటు కేవలం 12 బంతుల్లోనే అర్ధశతకం సాధించిన యువరాజ్ సింగ్(58) సరికొత్త రికార్డును సృష్టించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ దూకుడు ప్రదర్శిస్తోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. -
మా అమ్మ ఇక్కడే ఉన్నారు.. 4 ఏళ్లుగా నా కష్టాలను చూశారు: రియాన్ పరాగ్
రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ ఐపీఎల్ సీజన్లో అదరగొట్టేస్తున్నాడు. దిల్లీపై భారీ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.