సౌరశక్తి మచ్చికకు మానవ యుక్తి!
ఇంటిపై సౌర ఫలకాల్ని ఏర్పాటు చేసుకుని.. భానుడి భగభగల్ని విద్యుత్గా మార్చుకుంటున్నాం.. ఇంట్లో అవసరాలకు వాడేస్తున్నాం.. అదే భూమికి కొన్ని వేల మైళ్లు దూరంగా అంతరిక్షంలో సోలార్ ప్యానల్స్ని ఏర్పాటు చేస్తే.. భూమికి చేరకముందే సూర్యకాంతిని విద్యుత్గా అక్కడే ఒడిసి పట్టేస్తే!! కావాల్సినంత విద్యుత్ శక్తిని భూమిపై ఎక్కడికైనా పంపగలిగితే!! ...
సైన్స్ సంగతులు
ఇంటిపై సౌర ఫలకాల్ని ఏర్పాటు చేసుకుని.. భానుడి భగభగల్ని విద్యుత్గా మార్చుకుంటున్నాం.. ఇంట్లో అవసరాలకు వాడేస్తున్నాం.. అదే భూమికి కొన్ని వేల మైళ్లు దూరంగా అంతరిక్షంలో సోలార్ ప్యానల్స్ని ఏర్పాటు చేస్తే.. భూమికి చేరకముందే సూర్యకాంతిని విద్యుత్గా అక్కడే ఒడిసి పట్టేస్తే!! కావాల్సినంత విద్యుత్ శక్తిని భూమిపై ఎక్కడికైనా పంపగలిగితే!! అద్భుతమే కదా! ఇలాంటి ప్రయత్నాలు ఇప్పటికే మొదలయ్యాయి. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం!
సౌరశక్తి అనంతమైంది. కాలుష్యరహితమైంది కూడా. ఇప్పటికే సౌరశక్తిని పలు రకాలుగా వినియోగించుకుంటున్నాం. పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేయడానికీ ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. వీటిల్లో సౌరశక్తిని విద్యుత్ శక్తిగా మార్చే విధానాలు అతి ముఖ్యమైనవి. తక్కువ స్థలంలోనే చవకగా సౌరశక్తిని విద్యుత్ శక్తిగా మార్చాలన్నది పరిశోధకుల ప్రధాన లక్ష్యం. పెంటగాన్ శాస్త్రవేత్తలు మరో అడుగు ముందుకేసి అంతరిక్షంలోనే సౌరశక్తిని విద్యుత్ శక్తిగా మార్చేందుకు ప్రయోగాలు మొదలుపెట్టారు. అక్కడే సౌరశక్తిని విద్యుత్ శక్తిగా మలిచి భూమికి పంపడంలో విజయం సాధించారు. ఇందులో భాగంగా పిజ్జా పెట్టె పరిమాణంలో ఒక సోలార్ ప్యానెల్ని తయారు చేశారు. దాంట్లో ఫొటో వోల్టాయిక్ రేడియో ఫ్రీక్వెన్సీ యాంటెనా మాడ్యూల్ని అమర్చారు. గత ఏడాదిలో బాక్స్ని అంతరిక్షంలోకి ప్రయోగించారు. పెంటగాన్స్ ఎక్స్-37బీ అనే మానవరహిత డ్రోన్కి అమర్చిన ఈ బాక్స్ అంతరిక్షంలో లభించే సౌరశక్తిని వినియోగించుకుంటుంది. దాంట్లోని ప్యానెల్ సౌరశక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. ప్యానల్ వాతావరణ ఉపరి భాగాన ఉండటం వల్ల భూ వాతావరణంలో ప్రవేశించలేని సౌరశక్తి సైతం దీనికి అందుతుందన్నమాట. అంటే.. సౌరశక్తిలోని నీలి తరంగాలు కూడా ప్యానల్కి చిక్కుతాయన్నమాట. సౌరశక్తి భూ వాతావరణంలో ప్రవేశించినప్పుడు వాతావరణం దాంట్లోని నీలికిరణాలను విస్తరింపజేస్తుంది. దీని మూలంగానే మనకి ఆకాశం నీలంగా కనిపిస్తుంది.
ఉత్పత్తి సామర్థ్యం..
అంతరిక్షంలో చక్కర్లు కొట్టే 12్ల12 అంగుళాల పరిమాణం ఉన్న ప్యానల్ ఎంత విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తుందో తెలుసా? 10 వాట్లు. దీంతో ఒక ట్యాబ్లెట్ కంప్యూటర్ పని చేస్తుంది. ఒక్క ప్యానల్తోనే అంత శక్తి ఉత్పత్తి అయితే.. చాలా వరుసల ప్యానళ్లను అంతరిక్షంలో ఏర్పాటు చేసుకోగలిగితే? భూమిపై మారుమూల ప్రాంతాలకైనా విద్యుత్ని ప్రసారం చేయటం సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతరిక్షం నుంచి భూమికి విద్యుత్ని ప్రసారం చేయడం సాధ్యమేనని తమ ప్రయోగంలో తేలిందని తెలిపారు. అక్కడ ఎక్కువ మొత్తంలో ప్యానల్స్ని ఏర్పాటు చేయగలిగితే సేకరించిన విద్యుత్ని క్షణాల్లో భూమిపై ఏ కేంద్రానికైనా పంపేందుకు వీలవుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే, ఆర్థికంగా అది ఎంత వరకూ లాభదాయకం అనే విషయాన్ని తేల్చేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయోగానికి సంబంధించిన పూర్తి వివరాలు రహస్యంగా ఉన్నాయి. విశ్లేషకుల అభిప్రాయం మేరకు.. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఇది ఒక పరిష్కార మార్గంగా ఉపయోగపడుతుంది.
ఎదురయ్యే ఇబ్బందులు..
అంతరిక్షంలో హార్డ్వేర్ నిర్మాణం చాలా ఖర్చుతో కూడుకున్న పని. అయితే వచ్చే పదేళ్లలో నిర్మాణ వ్యయం బాగా తగ్గుతుందని భావిస్తున్నారు. మరో క్లిష్టమైన సమస్య స్థిరత్వం. భూమిపై నెలకొల్పే విద్యుత్ ఉత్పత్తి కేంద్రం భూమ్యాకర్షణతో నిర్దేశిత ప్రదేశంలో అక్కడే ఉంటుంది. అదే అంతరిక్షంలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రం స్థిరంగా ఉండాలంటే? కదలకుండా చేసే ఆధారాలు తప్పనిసరి. అంతరిక్షంలోని ఉష్ణోగ్రతా కీలకమే. తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఎలక్ట్రానిక్ పరికరాలు పూర్తి సామర్థ్యంతో పని చేస్తాయి. వేడి పెరిగే కొద్దీ వాటి పనితీరు మందగిస్తుంది. శాస్త్రవేత్తలు ప్రయోగించిన ఎక్స్-37బీ భూమి చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి 90 నిమిషాలు పడుతుంది. ఎందుకంటే.. అది భూమికి తక్కువ ఎత్తులో ఉన్న కక్ష్యలోనే తిరుగుతుంది. ఈ 90 నిమిషాల్లో 45 నిమిషాలు చీకట్లో.. అంటే చల్లదనంలోనే ఉంటుంది. ఒకవేళ ఈ పరికరాన్ని భూ స్థిర కక్ష్యలో ప్రవేశపెడితే రోజులో ఎక్కువ సేపు ఎండ వేడిలో ఉంటుంది. ఈ కక్ష్య భూమికి 36,000 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది మరి. ఇలా రెండు రకాల వాతావరణ పరిస్థితుల్ని తట్టుకునేలా పరికరం సామర్థ్యాన్ని పెంచేందుకూ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.
పారదర్శక సోలార్ ప్యానల్స్
పర్యావరణ పరిరక్షణపై అన్ని దేశాలూ దృష్టి సారిస్తున్నాయి. శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా సౌరశక్తి, వాయుశక్తి.. లాంటి కర్బన రహిత ఇంధనాల వినియోగంపై పరిశోధనలు ముమ్మరం చేశాయి. ఇప్పుడు అందరి ఆశలూ సౌరశక్తి మీదనే. ఎందుకంటే.. ఇది మన భూగోళంపై సమృద్ధిగా లభిస్తోంది. ఈ నేపథ్యంలో కొరియాలోని శాస్త్రవేత్తల బృందం పారదర్శక సోలార్ ప్యానల్స్ని నిర్మించడంలో విజయం సాధించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సౌర ఘటాల్లో కాంతి నిరోధకాలైన సెమీ కండక్టర్ పొరలుంటాయి. ఇవి సౌరశక్తిని పట్టుకుని విద్యుత్ శక్తిగా మారుస్తాయి. వినూత్నమైన పారదర్శక సోలార్ ప్యానల్స్ దీనికి భిన్నంగా పని చేస్తాయి. వీటిల్లో టైటానియం డైఆక్సైడ్ సెమీ కండక్టర్ను పొరలుగా వాడారు. దీంతో ప్యానల్స్ సౌరశక్తిలోని అతి నీలలోహిత కిరణాలను గ్రహించుకొని దృశా కాంతిని మాత్రమే తమ గుండా వెళ్లనిస్తాయి. అంటే.. ఇవి పర్యావరణహితమైనవే కాదు, విష రహితమైనవి కూడా. ఇంకా చెప్పాలంటే.. నికెల్ ఆక్సైడ్ని కూడా సెమీ కండక్టర్గా వాడొచ్చు. ఇది కూడా దృశా పారదర్శకత కలిగి ఉంటుంది. అంతేకాదు.. ఇది భూమిపై సమృద్ధిగా లభిస్తుంది. ఈ ఘటాల పనితీరు మెరుగ్గా ఉంటున్నట్టు ప్రయోగాల్లోనూ తేలింది. తక్కువ సూర్యకాంతి ఉన్న సమయాల్లోనూ సమర్థంగా పని చేస్తుంది. దృశాకాంతిలో 57 శాతం తమగుండానే పోనివ్వడం వీటి ప్రత్యేకత అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాచులో నత్రజని ఫ్యాక్టరీ
ప్రకృతిలో బ్యాక్టీరియా, ప్రాణులు ఒకదాని మీద మరోటి ఆధారపడటం (సింబయోటిక్) మామూలే. కానీ ఆ బ్యాక్టీరియా ప్రాణిలో భాగంగా మారితే? శక్తినందించే వనరుగా పరిణమిస్తే? అలాంటి విషయాన్నే శాస్త్రవేత్తలు గుర్తించారు. -
లిథియం బ్యాటరీ పేలకుండా..
ఇప్పుడు లిథియం-అయాన్ బ్యాటరీలు లేని డిజిటల్ పరికరాలను ఊహించుకోలేం. సెల్ఫోన్ల దగ్గరి నుంచి స్మార్ట్వాచ్ల వరకూ అన్నింటికీ ఇవే ఆధారం. ఐప్యాడ్, మ్యాక్, ఎలక్ట్రిక్ టూత్బ్రష్, ట్రిమ్మర్ వంటివీ వీటితోనే పనిచేస్తాయి. -
అణువు మందం బంగారు పొర
బంగారాన్ని పొరలుగా మలచటం తెలుసు. కానీ అతి పలుచటి.. ఆ మాటకొస్తే కేవలం అణువు మందం పొరగా మలచటం చాలా కష్టం. ఇందుకోసం శాస్త్రవేత్తలు చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. -
నక్షత్రాలూ సంచరిస్తాయి!
నక్షత్ర మండలంలో కోట్లాది నక్షత్రాలుంటాయి. సాధారణంగా ఇవి తమ నక్షత్ర మండలానికే పరిమితమవుతాయి. కానీ కొన్ని మాత్రం నక్షత్ర మండలాల మధ్య తిరుగుతుంటాయి. తమ నక్షత్ర మండలం గురుత్వాకర్షణకు కట్టుబడి ఉండవు. -
లాలీపాప్తో నోటి క్యాన్సర్ జాడ
క్యాన్సర్లను నిర్ధరించటానికి కణజాలం నుంచి చిన్న ముక్కను తీసి పరీక్ష చేస్తుంటారు (బయాప్సీ). ఇందుకోసం శరీరానికి కోత పెట్టాల్సి ఉంటుంది. నొప్పి పుడుతుంది. బయాప్సీ చేయటానికి నిపుణులు అవసరం. -
వరదొచ్చే.. వరదొచ్చే.. వారం ముందే అంచనా
కృత్రిమ మేధ (ఏఐ) రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. కంపెనీలు వినూత్న టూల్స్ను సృష్టిస్తూ సత్తాను చాటుకోవటానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంలో గూగుల్ ఇటీవల గొప్ప పురోగతిని సాధించింది. -
భూగర్భంలో నీరెంత?
భూమి మీద మూడొంతుల మేర ఉండేది నీరే. మరి భూగర్భంలో ఎంత నీరుంటుంది? ఎంతుంటే ఏంటని మనం అనుకుంటామేమో గానీ శాస్త్రవేత్తలు అలా కాదు. -
గది ఉష్ణోగ్రత వద్దే క్యూబిట్లు స్థిరంగా..
క్వాంటమ్ కంప్యూటింగ్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. సమాచార పరిశీలన, విశ్లేషణ ప్రక్రియలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. -
పాలపుంత కేంద్రం తెలుసా?
మన నక్షత్ర మండలమైన పాలపుంత కేంద్రం ఎక్కడుందో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఐఫోన్ కొత్త యాప్ సాయం తీసుకోవచ్చు. -
పీసీఆర్ కథ
పాలిమరేజ్ చైన్ రియాక్షన్ అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ పీసీఆర్ పరీక్ష అనగానే అంతా గుర్తుపట్టేస్తారు. కొవిడ్ విజృంభించినప్పుడు ఇదెంత ప్రాముఖ్యం సంతరించుకుందో తెలిసిందే -
పురాతన నక్షత్ర మండలం సరికొత్త సవాల్
కృష్ణ పదార్థం (డార్క్ మ్యాటర్) చుట్టూ ఉండే భారీ పరివేషాల సమీపంలో తొలి నక్షత్ర మండలాలు ఏర్పడ్డాయని ఖగోళ శాస్త్రవేత్తలు భావిస్తుంటారు. -
సుదూర అంతరిక్షంలో మరో భూమి!
భూమి ఆయుష్షు ఏటికేడు తగ్గుతూ వస్తోంది. వనరులూ తగ్గుతూ వస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే మన భూమిలాంటి నివాసయోగ్య గ్రహాల కోసం ఖగోళ శాస్త్రవేత్తలు చాలాకాలంగా అన్వేషిస్తూనే ఉన్నారు. ఒకవేళ భవిష్యత్తులో ఎప్పుడైనా భూమి నివసించటానికి పనికిరాకుండా పోతే, మానవజాతి అంతరించకుండా చూడటం దీని ఉద్దేశం. ఈ నేపథ్యంలో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా శాస్త్రవేత్తలు ‘భారీ భూమి’ని (సూపర్ ఎర్త్) గుర్తించారు. -
ఇంటి గాలిని వడపోసే మొక్క
వాయు కాలుష్యం అనగానే రద్దీ రహదారులు, పారిశ్రామిక పాంతాలే గుర్తుకొస్తాయి. కానీ ఇళ్లు, కార్యాలయాలూ తక్కువేమీ కాదు. ఆ మాటకొస్తే బెంజీన్, టొల్యూన్, జైలీన్, ఫార్మాల్డిహైడ్ వంటి వాయు కాలుష్య కారకాలు ఆరుబయట కన్నా ఇంటి లోపలే 2 నుంచి 5 రెట్లు ఎక్కువని అమెరికాకు చెందిన ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజేన్సీ చెబుతోంది. -
అంగారకుడి శోధనకు వినూత్న వ్యోమనౌక
అంగారకుడి శోధనకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వినూత్న వ్యోమనౌకను రూపొందించనుంది. దీని పేరు మార్స్ ఏరియల్ గ్రౌండ్ ఇంటెలిజెంట్ ఎక్స్ప్లోరర్ (మ్యాగ్గీ). -
గోబర్ గ్యాస్ రాకెట్!
గోబర్ గ్యాస్తో వంట చేసుకోవటం పాత విషయమే. దీంతో రాకెట్లనూ నడపొచ్చని తెలుసా? జపాన్కు చెందిన ఒక అంతరిక్ష సంస్థ అలాంటి రాకెంట్ ఇంజిన్నే రూపొందించింది. -
హ్యామ్- అంతరిక్షంలోకి వెళ్లిన తొలి చింపాంజీ
మనుషుల కన్నా ముందు జంతువులే అంతరిక్షంలో అడుగుపెట్టాయి. వీటిల్లో హ్యామ్ అనే చింపాంజీ ఒకటి. అమెరికా చేపట్టిన మెర్క్యురీ ప్రాజెక్టులో భాగంగా ప్రయోగాత్మక రాకెట్ ద్వారా ఇది అంతరిక్షంలోకి వెళ్లింది. అప్పుడు హ్యామ్ వయసు మూడున్నరేళ్లే. గంటకు 8,046 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన రాకెట్ ద్వారా ఇది 241 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది. -
స్వయం ప్రయోగశాలలు
స్వయం చోదక వాహనాల గురించి తెలిసిందే. ఎక్కి కూర్చోగానే వాటంతటవే గమ్యానికి చేరుస్తాయి. మొదట్లో సైన్స్ ఫిక్షన్ కథలా అనిపించినా ఇప్పుడివి కొన్నిదేశాల్లో నిత్య జీవనంలోకీ వచ్చేశాయి. -
భారీ విశ్వదర్శిని!
అంతర్జాతీయ టెలిస్కోప్ ప్రాజెక్టు స్క్వయర్ కిలోమీటర్ అరే(ఎస్కేఏ)లో మనదేశం అధికారికంగా చేరనుంది. దీని నిర్మాణానికి రూ.1,250 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. -
కీటకం ఈత గుట్టు
కీటకాలకు ఒలింపిక్ క్రీడల పోటీలు నిర్వహిస్తే ఈతలో వర్లిగిగ్ బీటిల్ బంగారు పతకం కొట్టేయటం ఖాయం. ఉండేది సెంటీమీటరు పొడవే అయినా వేగంలో దీన్ని మించిన కీటకం లేదు -
కిరణజన్య సంయోగక్రియ మూలం!
మన భూమ్మీద ప్రాణులు జీవించి ఉండటానికి ఆక్సిజన్నే ఆధారం. దీనికి మూలం కిరణజన్య సంయోగక్రియ. వృక్షాలు, మొక్కలు గాల్లోంచి కార్బన్ డయాక్సైడ్, భూమిలోంచి నీరు, సూర్యుడి నుంచి కాంతిని గ్రహించి చక్కెరను సృష్టించుకుంటాయి. -
బొగ్గు దాణా!
బొగ్గుతో ఏం చేస్తారు? పొయ్యిలో మండించి వంట వండుకుంటారు. విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్తు ఉత్పత్తి చేస్తారు. ఇంకేం చేస్తారు? చైనా శాస్త్రవేత్తలైతే దాణానూ తయారుచేస్తారు
తాజా వార్తలు (Latest News)
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!