పరిణామం అనంతం
ఇటీవల మానవజాతికో కొత్త బంధువు దొరికాడు. ఇప్పటివరకూ నియాండర్తాల్స్నే మన సమీప మానవులని భావిస్తున్న మనకు చైనాలో మరో ఆదిమ మానవుడి ఆచూకీ లభించటం పరిణామ చరిత్రను తిరగరాసేలా చేస్తోంది. మానవ పరిణామ ప్రక్రియపై మనకున్న అవగాహనను మార్చుకోవాల్సిన పరిస్థితి కల్పించింది.
ఇటీవల మానవజాతికో కొత్త బంధువు దొరికాడు. ఇప్పటివరకూ నియాండర్తాల్స్నే మన సమీప మానవులని భావిస్తున్న మనకు చైనాలో మరో ఆదిమ మానవుడి ఆచూకీ లభించటం పరిణామ చరిత్రను తిరగరాసేలా చేస్తోంది. మానవ పరిణామ ప్రక్రియపై మనకున్న అవగాహనను మార్చుకోవాల్సిన పరిస్థితి కల్పించింది. అనాదియైన, అనంతమైన మానవ పరిణామ క్రమం దిశగా మరోసారి దృష్టి సారించేలా చేసింది.
అప్పుడెప్పుడో 90 ఏళ్ల కిత్రం తూర్పు చైనాలోని హర్బిన్ పట్టణం సమీపంలో దొరికిన ఒక భారీ పుర్రె ఇప్పుడు మానవ పరిణామ చరిత్రనే తిరగరాస్తోంది. అది మామూలు పుర్రె కాదు. సుమారు 14.6 లక్షల ఏళ్ల క్రితం మరణించిన ఆదిమ మానవుడిది. నియాండర్తాల్స్ తర్వాత ఆవిర్భవించిన మానవజాతికి చెందిందని, మరణించే నాటికి అతడి వయసు 50 ఏళ్లని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ కొత్త జాతికి హోమో లోంగి అని పేరు పెట్టారు. ఇతడిని డ్రాగన్ మ్యాన్ అనీ పిలుచుకుంటున్నారు. ఆధునిక మానవజాతి అయిన హోమో సేపియన్స్ మాదిరిగానే హోమో లోంగి జాతి కూడా పక్షులను, జంతువులను వేటాడేదని.. పండ్లు, కూరగాయలను సేకరించేదని.. చేపలనూ పట్టుకొని ఉండొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. హోమో లోంగి కాలంలో హోమో సేపియన్స్ తూర్పు ఆసియాకు వచ్చినట్టయితే ఈ రెండు జాతుల మధ్య సంకరం జరిగి ఉండొచ్చన్నది శాస్త్రవేత్తల భావన. అయితే ఇదింకా స్పష్టం కాలేదు. పురాతత్వ వస్తువులేవీ లేకపోవటం వల్ల సంస్కృతి, పరిజ్ఞానం స్థాయుల గురించి ఎన్నో ప్రశ్నలు అలాగే మిగిలి ఉన్నాయి. తూర్పు ఆసియాలో ఇది మూడో మానవజాతి కావటం ఈ ప్రాంతం ప్రాముఖ్యతను చాటుతోంది. ఇదే కాదు.. ఇటీవల ఇజ్రాయెల్లోనూ పురాతన మానవుల ఎముకలను శాస్త్రవేత్తలు గుర్తించారు. రమ్లా ప్రాంతలో తవ్వకాలు జరుపుతుండగా ఈ శిలాజాలు బయటపడ్డాయి. ఈ కొత్త మానవజాతికి శాస్త్రవేత్తలు ‘నెషర్ రమ్లా హోమో టైప్’ అని పేరు పెట్టారు. లక్షలాది ఏళ్లుగా పరిణామం చెందుతూ వస్తున్న మన ప్రస్థాన రహస్యాలు ఇంకా మిగిలే ఉన్నాయని ఈ ఉదంతాలు చెప్పకనే చెబుతున్నాయి. మానవ పరిణామం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మున్ముందు మనషి స్వరూప, స్వభావాలెలా ఉంటాయో తెలియదు గానీ మన పరిణామ క్రమం ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ వచ్చింది.
సుదీర్ఘ ప్రక్రియ
పరిణామం ఉన్నట్టుండి జరిగేది కాదు. ఓ సుదీర్ఘ ప్రక్రియ. మానవుల వంటి సంక్లిష్ట జీవుల విషయంలో ఇందుకు ఇంకాస్త ఎక్కువ సమయమే పడుతుంది. కొత్త కొత్త శారీరక స్వభావాలు, ప్రవర్తనలను సంతరించుకుంటూ మానవజాతి క్రమంగా పరిణామం చెందుతూ వస్తోంది. తోకలేని కోతుల (ఏప్స్) నుంచి మొదలైన పరిణామం సుదీర్ఘంగా కొనసాగుతోంది. సుమారు 60 లక్షల ఏళ్లుగా శారీరక మార్పులు, ప్రవర్తనల వంటివన్నీ రూపుదిద్దుకుంటూ వస్తున్నాయని శాస్త్రీయ ఆధారాలు చెబుతున్నాయి. మొదట్లో అబ్బిన గుణాల్లో ముఖ్యమైంది రెండు కాళ్ల మీద నడవటం. జంతువుల నుంచి మనుషులను వేరు చేసిన తొలి మార్పు ఇదే. సుమారు 40 లక్షల సంవత్సరాల క్రితం ఇది ఆరంభమైంది. ఇతర ముఖ్య పరిణామాల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సినవి సంక్లిష్టమైన, పెద్ద మెదడు.. పరికరాలు తయారుచేసుకునే నైపుణ్యం.. భాషా సామర్థ్యం. మానవుడి ఆధిపత్యానికి బీజం వేసినవి ఇవే. సంకేతాలతో కూడిన వ్యక్తీకరణ, కళలు, విస్తృతమైన సాంస్కృతిక వైవిధ్యం వంటివన్నీ తదనంతర గుణాలని చెప్పుకోవచ్చు.
వానరుల నుంచి..
మానవులు వానరులు. అలాగని మనిషి ప్రస్తుతం జీవిస్తున్న కోతులు, వానరుల నుంచి పుట్టుకొచ్చాడని అనుకుంటున్నారేమో. అది నిజం కాదు. కాకపోతే కోతులు, వానరాలు, మనుషుల పూర్వికులు ఒకరే. ఇప్పటివరకూ ఆధునిక మానజాతిగా భావిస్తున్న హోమో సేపియన్స్ శారీరక, జన్యు పోలికలన్నీ ఏప్స్తో దాదాపుగా పోలి ఉంటున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. సుమారు 80 లక్షల నుంచి 60 లక్షల ఏళ్ల కిందట నివసించిన ఒకే పూర్వికుల నుంచే ఆఫ్రికాలోని చింపాజీలు, బోనబోస్ వంటి తోకలేని పెద్ద కోతులు.. గొరిల్లాలతో పాటు మనుషులు పుట్టుకొచ్చారు. మానవ తొలి పరిణామం ఆఫ్రికాలోనే మొదలైంది. మన పరిణామక్రమం మొత్తం దాదాపు అక్కడే కొనసాగింది. దాదాపు 60 లక్షల నుంచి 20 లక్షల ఏళ్ల కిందట నివసించిన తొలి మానవుల శిలాజాలన్నీ అక్కడే లభించటం దీనికి నిదర్శనం.
ఆఫ్రికా నుంచి ఆసియాకు
తొలి మానవులకు సంబందించిన ఎన్నో జాతులను శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిల్లో చాలావరకు పూర్తిగా అంతరించిపోయాయి. ఈ జాతుల పుట్టుకకు, అంతరించటానికి ఎలాంటి అంశాలు దోహదం చేశాయనేదానిపై తర్జనభర్జనలు ఇంకా సాగుతూనే ఉన్నాయి. ఆదిమ మానవులు 20 లక్షల నుంచి 18 లక్షల ఏళ్ల కిందట మొదటిసారిగా ఆఫ్రికా నుంచి ఆసియాకు వలస వచ్చారు. అనంతరం 15 లక్షల నుంచి 10 లక్షల ఏళ్ల కిందట ఐరోపాకు చేరుకున్నారు. అనంతరం చాలాకాలం తర్వాతే ఆధునిక మానవజాతులు మిగతా భాగాలకు విస్తరించాయి. ఉదాహరణకు- ఆస్ట్రేలియాకు 60 వేల ఏళ్ల క్రితం, అమెరికాకు 30 వేల ఏళ్ల క్రితం వచ్చి ఉండొచ్చని అంచనా. వ్యవసాయం, తొలి నాగరికతల వంటివన్నీ గత 12వేల ఏళ్ల కాలంలోనే ఆరంభమయ్యాయి.
ఎన్నెన్నో కీలక ఘట్టాలు
సుమారు 15-21 మానవ జాతులు ఉండొచ్చన్నది శాస్త్రవేత్తల భావన. వీటిల్లో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మనుగడలో ఉన్నది ఒక్క మనమే. ఎన్నెన్నో కీలక ఘట్టాలను దాటుకొని మనం ఈ దశకు చేరుకున్నాం.
80-60 లక్షల ఏళ్ల క్రితం
తొలి గొరిల్లాల ఆవిర్భావం. అనంతరం చింపాజీలు, మానవజాతులు విడిపోవటం.
58 లక్షల ఏళ్ల క్రితం
అతి పురాతన ఆదిమ మానవుడు (ఒరోరిన్ టుజెనెసిస్) రెండు కాళ్ల మీద నడిచాడని భావిస్తుంటారు.
40 లక్షల ఏళ్ల క్రితం
ఆస్ట్రలోపితెసిన్ల పుట్టుక. చింపాంజీలంత మెదడే ఉన్నప్పటికీ రెండు కాళ్ల మీద నిటారుగా నడిచారు.
25 లక్షల ఏళ్ల క్రితం
రాతి పరికరాల వాడకం ఆరంభం. ఈ పరికరాల తయారీ 10 లక్షల ఏళ్ల వరకు కొనసాగింది. కొందరు హోమినిడ్స్ మాంసాహారం తినటం అలవరచుకోవటం మెదడు పెద్దగా ఎదగటానికి దోహదం చేసింది.
16 లక్షల ఏళ్ల క్రితం
మంటను వాడుకోవటం ఆరంభమైంది. మరింత సంక్లిష్టమైన రాతి పరికరాలను తయారుచేయటం మొదలైంది.
6 లక్షల ఏళ్ల క్రితం
మెదడు సామర్థ్యం పెరగటం మొదలైంది. ఆధునిక మానవుల స్థాయికి మెదడు సామర్థ్యం చేరుకుంది.
5 లక్షల ఏళ్ల క్రితం
ఆవాసాలు, చెక్క గుడిసెలు నిర్మించుకోవటం ఆరంభించారు.
4 లక్షల ఏళ్ల క్రితం
బల్లాలతో వేట మొదలెట్టారు.
1.95 లక్షల ఏళ్ల క్రితం
మన సొంత మానవజాతి హోమో సేపియన్స్ రంగంలోకి వచ్చారు. ఆ వెంటనే ఆసియా, ఐరోపా అంతటికీ వలస వెళ్లారు. అప్పటి సగటు మనిషి మెదడు పరిమాణం 1350 సెంమీ
1.7 లక్షల ఏళ్ల క్రితం
ప్రస్తుతం జీవిస్తున్న మానవులందరి మూల జనని ‘మైటోకాండ్రియల్ ఈవ్’ ఆవిర్భావం. ఆమె ఆఫ్రికాలో నివసించి ఉండొచ్చు.
1.5 లక్షల ఏళ్ల క్రితం
మనిషి మాట్లాడే సామర్థ్యం సంతరించుకున్నాడు.
50 వేల ఏళ్ల కిత్రం
చనిపోయిన వారిని పూడ్చిపెట్టటం, జంతువుల చర్మం నుంచి దుస్తులు తయారుచేయటం వంటివన్నీ ఆరంభమయ్యాయి. ఆస్ట్రేలియాలో ఆధునిక మానవులు ఆవాసాలు ఏర్పరచుకున్నారు.
33 వేల ఏళ్ల కిత్రం
ఆసియాలో హోమో ఎరక్టస్లు మరణించారు. వీరి స్థానాన్ని ఆధునిక మానవులు ఆక్రమించారు.
10వేల ఏళ్ల క్రితం
వ్యవసాయం అభివృద్ధి చెందింది. విస్తరించింది. తొలి గ్రామాల పుట్టుక.
5.5 వేల ఏళ్ల క్రితం
రాతియుగం ముగిసి రాగియుగం మొదలైంది.
5 వేల ఏళ్ల క్రితం
తొలి రాత ఆనవాళ్లు.
4,000-3,500 క్రీ.పూ.
మెసొపొటామియాలో సుమేరియన్లు ప్రపంచపు మొట్టమొదటి నాగరికతను అభివృద్ధి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మానవ రోబో దండు!
రోబో అనగానే ఏం గుర్తుకొస్తుంది? లోహ చట్రంతో కదిలే మర యంత్రమో, కదిలే లోహం బొమ్మో మదిలో కదలాడుతుంది. రబ్బరు కండరాలతో చేసినదైతే మనిషి మాదిరిగానూ కనిపిస్తుంది. చూపు, మాట మనిషిని పోలి ఉంటాయి. -
paul alexander: ఇనుప ఊపిరితిత్తి!
ఓ పొడవైన పెట్టె. శరీరమంతా అందులోనే. తల మాత్రమే బయటకు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 72 ఏళ్లు అందులోనే గడిపితే? అమెరికాకు చెందిన పాల్ అలెగ్జాండర్ అలాగే గడిపారు -
గూగుల్ సెర్చ్ తెలివిగా..
స్మార్ట్ఫోన్లలో గూగుల్ సెర్చ్ను వాడనివారుండరంటే అతిశయోక్తి కాదు. కానీ తేలికగా, త్వరగా ఆయా అంశాలను శోధించటానికి కొన్ని చిట్కాలు ఉన్నాయనే సంగతి తెలుసా? అలాంటి కొన్ని ఉపాయాల గురించి తెలుసుకుందాం. -
భళారే డిజిటల్ విచిత్రం!
ఒకప్పటి కన్నా స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్ల సామర్థ్యం, వేగం పుంజుకున్న మాట నిజం. కానీ ఆకారంలో పెద్దగా మారింది లేదు. ఒకసారి అంచులు చిన్నగా.. మరోసారి కెమెరా బంప్లు పెద్దగా ఉండటం తప్పించి దాదాపు అలాగే కనిపిస్తుంటాయి. -
కృత్రిమ మేధ గుండె కాయ
కృత్రిమ మేధ.. కృత్రిమ మేధ.. కృత్రిమ మేధ. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎక్కడ చూసినా ఈ పేరే మార్మోగుతోంది. -
ఇక ఏఐ సినిమా!
పదాల కూర్పు ఆధారంగా చిటికెలో ఫొటోలు, చిత్రాలు, సంగీతం, పాటలను పుట్టిస్తున్న కృత్రిమ మేధ (ఏఐ) మరో అడుగు ముందుకేసింది. ఏకంగా వీడియోలనూ సృష్టించే స్థాయికి చేరుకుంది. విప్లవాత్మక ఛాట్జీపీటీని రూపొందించిన ఓపెన్ఏఐ సంస్థ కొత్తగా తీసుకొచ్చిన జనరేటివ్ కృత్రిమ మేధ (జెన్ఏఐ) మోడలే దీనికి నిదర్శనం. -
ఈ విశ్వ కిరణాలు..
విశ్వ కిరణాలు.. కాస్మిక్ రేస్. అంతరిక్షం ఆవలి నుంచి దూసుకొచ్చే ఇవి నిరంతరం అతి వేగంగా.. దాదాపు కాంతి వేగంతో సమానంగా విశ్వమంతటా ప్రయాణిస్తుంటాయి. వీటి మీద మొదటి నుంచీ శాస్త్రవేత్తలకు ఎంతో ఆసక్తి. ఎందుకంటే అంతరిక్షంలో పుట్టుకొచ్చిన చోటు, ఢీకొట్టిన వస్తువులను బట్టి ఇవి విశ్వానికి సంబంధించిన ఎన్నో విషయాలను వివరిస్తాయి. -
ప్రేమ శాస్త్రం!
ప్రేమ ఎందుకు పుడుతుందో, ఎవరి మీద పుడుతుందో తెలియదు. ఒకరికి నచ్చిన వ్యక్తి మరొకరికి నచ్చకపోవచ్చు. ఒకరికి అసలే నచ్చనివారు మరొకరికి ప్రాణం కన్నా మిన్నగా అనిపించ్చొచ్చు. -
ఫోల్డర్ మాయలు
విండోస్ పీసీలో రోజూ ఫోల్డర్లను వాడుతూనే ఉంటాం. కొత్త ఫైళ్లను స్టోర్ చేయటం, డేటాను వరుసగా పెట్టుకోవటం.. ఇలా ఎన్నింటికో వీటిని ఉపయో గిస్తుంటాం. మరి అదృశ్య ఫోల్డర్ను సృష్టించుకోగలరా? ఒకేసారి బోలెడన్ని ఫోల్డర్ల పేర్లను మార్చుకోగలరా? ఖాళీ ఫోల్డర్లను గుర్తించగలరా? ఇలాంటి కొన్ని చిత్రమైన ఫోల్డర్ చిట్కాల గురించి తెలుసుకుందాం. -
అమెజాన్ అడుగున బంగారు నేల
అమెజాన్ అనగానే దట్టమైన అడవులే గుర్తుకొస్తాయి. మనుషులు దూరటానికి వీల్లేని అక్కడ ఒకప్పుడు పెద్ద పట్టణమే ఉండేదని ఇటీవల తేలటం అందరినీ ఆశ్చర్యపరచింది -
ఏఐ టెక్కులు!
అసలే కృత్రిమ మేధ (ఏఐ) యుగం. ఆపై ప్రపంచంలోనే అతి పెద్ద ఎలక్ట్రానిక్ వస్తు ప్రదర్శన. ఇక చెప్పేదేముంది? ఏ పరికరాన్ని చూసినా ఏఐమయమే. హెల్త్ ట్రాకర్ల దగ్గరి నుంచి వాహనాల వరకూ అన్నింటికీ అదే ఆలంబన. -
Cyber Crime: నయా సైడర్!
నేటి సైబర్ యుగంలో నేరాలూ మారిపోతున్నాయి. ఆన్లైన్ మోసాలు కోకొల్లలు. డెబిట్, క్రెడిట్ కార్డు వివరాలు చోరీ చేసి మన ప్రమేయమేమీ లేకుండానే నేరగాళ్లు షాపింగ్ చేయటం తెలిసిందే -
కొత్త టెక్ లోకం
డిజిటల్ పరిణామం ఆగేది కాదు. ఇదో నిరంతర ప్రక్రియ. గత ఏడాదిని గతి తిప్పిన ట్రెండ్స్ కొత్త సంవత్సరాన్నీ పరుగులు తీయించనున్నాయి. మెషిన్ ఇంటెలిజెన్స్ జోరందుకోనుంది. వాస్తవ, కాల్పనిక ప్రపంచాల మధ్య హద్దులు చెరగటం ఖాయంగా కనిపిస్తోంటే.. నిరంతర అంతర్జాల పరిణామ ప్రక్రియ మన జీవితాలను గణనీయంగా శాసించేలా రూపుదిద్దుకుంటోంది. -
ఇస్రో ఏఐ వత్సరం 2024
ఇది మనదేశం జాబిల్లిని తాకి ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచిన సంవత్సరం.ఇది కృత్రిమ మేధ ప్రయోగశాలలను దాటుకొని నిత్య జీవన వ్యవహారాల్లోకి విరివిగా చొచ్చుకొచ్చిన సంవత్సరం.శాస్త్ర, సాంకేతిక రంగాలు ఒకదాంతో మరోటి పోటీ పడుతూ కొత్త వత్సరంలోకి అడుగిడుతున్న వేళ సాధించిన ఘనతలను సమీక్షించుకోవటం ముదావహం. -
స్థానిక మేధ
కృత్రిమ మేధ (ఏఐ) తీరు మారుతోంది. ఆంగ్లం గడపను దాటుకొని స్థానిక భాషలపై దృష్టి సారిస్తోంది. ఆయా భాషల వైవిధ్యం, యాసలు, సంస్కృతులకు అనుగుణంగా రూపాంతరం చెందుతోంది. -
గాజు బిందువు ఇంద్రజాలం
ఎప్పుడైనా గాజు కన్నీటి చుక్కల గురించి విన్నారా? అవి స్టీలు కన్నా దృఢంగా ఉంటే? బుల్లెట్ దెబ్బనైనా తట్టుకుంటే? సైన్స్ సూత్రాలనూ ధిక్కరిస్తే? అంత విచిత్రమైన గాజు బిందువు లేంటని అనుకుంటున్నారా? అవే ప్రిన్స్ రూపర్ట్స్ డ్రాప్స్. -
వృక్షో రక్షతి రక్షితః
జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఛార్లెస్ డార్విన్ అప్పుడెప్పుడో కన్న కల ఎట్టకేలకు సాకారమైంది. ప్రపంచంలో మనకు తెలిసిన అన్ని మొక్కల జాబితాను రూపొందించాలనే ఆయన ఆశయాన్ని రాయల్ బొటానిక్ గార్డెన్స్ ఇటీవల సాకారం చేసింది. -
వాతావరణతరంగ శోధన
భూమి, అంతరిక్ష వాతావరణం మధ్య జరిగే చర్యల మీద అధ్యయనం చేయటం దీని ఉద్దేశం. -
ఏఐయ్యారే!
సాంకేతిక రంగంలో కృత్రిమ మేధ (ఏఐ) సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. ఛాట్జీపీటి సమస్త సమాచార సారాంశాన్ని చిటికెలో ముందుంచుతోంది. -
వర్షం కృత్రిమం
ఉక్కపోస్తే ఫ్యాన్ వేసుకుంటాం. చుట్టుపక్కల గాలిని మనవైపు తిప్పుకొంటాం. ఇంట్లో ఉష్ణోగ్రత పెరిగితే ఏసీ వేసుకుంటాం. వేడి గాలిని చల్లబరచి హాయిని అనుభవిస్తాం -
Phone Hacking: ఫోన్ హ్యాక్ అయ్యిందా?
ప్రభుత్వ ప్రాయోజిత అటాకర్లు ఐఫోన్ల మీద దాడి చేసే అవకాశముందని ఇటీవల యాపిల్ సంస్థ ప్రముఖ ప్రతిపక్ష నేతలు, పాత్రికేయులను హెచ్చరించటం తీవ్ర కలకలం సృష్టించింది. ఒక్క మనదేశానికి చెందినవారికే కాదు.. 150 దేశాల్లోకి వ్యక్తులకూ ఈ నోటిఫికేషన్లు అందాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం యాపిల్కు నోటీసులు జారీ చేసి, వివరణ కోరింది.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
-
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
-
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
-
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
-
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా