British Rule: ఆంగ్లే‘యమలోకం’
ఈస్టిండియా కంపెనీ హయాంలోనే అండమాన్ దీవులను ఖైదీల వలస కేంద్రంగా మార్చేందుకు ప్రయత్నించారు. ఇక్కడి వైపర్ దీవిని రాజకీయ ఖైదీల జైలుగా మార్చి... బహిరంగంగా ఉరి తీసేవారు కూడా. 1857లో సిపాయిల తిరుగుబాటు తర్వాత భారతీయుల్లో
బ్రిటిష్వారికి గరుడ పురాణం... అందులో చెప్పే నరకలోక శిక్షల గురించి తెలియకున్నా... భూమ్మీదే అలాంటి నరకాన్ని సృష్టించారు. అదే అండమాన్ సెల్యులర్ జైలు. కాలాపానీగా పేరొందిన ఈ కారాగారం స్వాతంత్య్రం కోరిన భారతీయుల కోసం తెల్లవారు కట్టించిన ఓ మృత్యులోగిలి! విప్లవవాదులకు, తమను ఎదిరించిన రాజకీయ ఖైదీలకిక్కడ నరకం చూపించి, మిగిలినవారిలోనూ భయభ్రాంతులు కల్పించారు.
అండమాన్లోని కాలాపానీ జైలు
ఈస్టిండియా కంపెనీ హయాంలోనే అండమాన్ దీవులను ఖైదీల వలస కేంద్రంగా మార్చేందుకు ప్రయత్నించారు. ఇక్కడి వైపర్ దీవిని రాజకీయ ఖైదీల జైలుగా మార్చి... బహిరంగంగా ఉరి తీసేవారు కూడా. 1857లో సిపాయిల తిరుగుబాటు తర్వాత భారతీయుల్లో భయం నింపటానికి అత్యంత భయానక జైలును నిర్మించాలని బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించింది. తమలోని క్రూరత్వాన్ని కాలాపానీ రూపంలో చూపించింది. తిరుగుబాటుదారులను, సమస్యాత్మక రాజకీయ ఖైదీలను ఇక్కడికి పంపించి నరకయాతన పెట్టేవారు. అనేకమంది ఆ బాధలు, కష్టాలు పడలేక కన్నుమూశారు. మరికొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇక మతిభ్రమించిన వారెందరో!
సిపాయిల తిరుగుబాటు తర్వాత కొన్నాళ్లకు జైలర్ డేవిడ్బారీ, మేజర్ జేమ్స్ పాటిసన్ వాకర్ల ఆధ్వర్యంలో 200 మంది ఖైదీలను అండమాన్ దీవుల్లో దించింది బ్రిటిష్ ప్రభుత్వం. వారితోనే 1896లో సెల్యులర్ జైలు నిర్మాణం ఆరంభించారు. బర్మా నుంచి తెప్పించిన రాయితో... 693 గదులతో జైలును నిర్మించారు. 13 సంవత్సరాల పాటు కష్టించి... తాముండే జైలును తామే కట్టుకున్నారు ఖైదీలు. సైకిల్ చక్రానికుండే పుల్లల ఆకృతిలో వరుసలు వరుసలుగా, ఖైదీలు ఒకరికొకరు కన్పించకుండా దీన్ని కట్టారు. చిన్న కిటికీతో ప్రతి గది 4.5మీటర్ల పొడవు, 2.7మీటర్ల వెడల్పు. వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి ఒక్కో గది (సెల్) ఉంటుంది కాబట్టి దీనికి సెల్యులర్ అనే పేరు వచ్చింది.
జైలులో ఈ దాష్టీకాలను భరించలేక నిరాహార దీక్ష చేసినవారు కూడా లేకపోలేదు. అయితే... వీటిని బ్రిటిష్ జైలర్లు దారుణంగా అణచివేశారు. బలవంతంగా ఖైదీలను పట్టుకొని కట్టేసి... వారి గొంతుల్లోంచి గొట్టాల ద్వారా పాలు, గుడ్లు, కూరగాయలు పంపించేవారు. ఈ క్రమంలో ఊపిరితిత్తులు పాడై, అనారోగ్యంపాలై మరణించినవారెందరో. వీరందరినీ బండలకు కట్టి సముద్రంలో విసిరేసేవారు.
1935 తర్వాత జరిగిన రాజకీయ ఒప్పందాల ఫలితంగా... ఈ జైలులోని ఖైదీలను విడిచిపెట్టేందుకు బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరించింది. రెండో ప్రపంచయుద్ధంలో జపాన్ ఈ దీవులను స్వాధీనం చేసుకుంది. ఆ సమయంలో రెండు, స్వాతంత్య్రానంతరం మరో రెండు వరుసలను కూల్చేశారు. మిగిలిన వరుసలు, టవర్ను జాతీయ స్మారకచిహ్నంగా మార్చారు.
తాగేందుకు నీళ్లు అడిగితే..
అసలే ఒంటరితనం. ఆపై దారుణమైన శిక్షలు. తమలోని విప్లవవాదం, జాతీయవాదం... రాజకీయంపై విరక్తి పుట్టేలా ఖైదీలను బాధించేవారు. బానిసలా పని చేయించేవారు. ఇంత పని చేయాలని కోటా పెట్టేవారు. మండే ఎండల్లో గంటల తరబడి పనిచేశాక... మంచి నీళ్లడిగితే మూత్రం పోసేవారు. ఎంతగా అలసిపోయినా విశ్రాంతి తీసుకోవటానికి లేదు. ఎవరైనా పనిలో బద్ధకిస్తున్నట్లు అనిపిస్తే దారుణంగా శిక్షించేవారు. జైలు గోడలకు, ఇనుప ఊచలకు, గుంజలకు బట్టలు ఆరవేసినట్లు రోజంతా వేలాడదీసేవారు. ఎప్పుడు పడితే అప్పుడు కాలకృత్యాలు తీర్చుకోవటానికి కూడా లేదు. నిర్దేశించిన సమయాల్లో మాత్రమే వెళ్లాలి. గార్డు అనుమతివ్వకుంటే నిర్దేశిత సమయం అయ్యేదాకా ఆపుకోవాల్సిందే. నూనె గానుగలకు పశువులకు బదులు వీరినే కట్టి తిప్పేవారు. 1911 నుంచి 1921 దాకా ప్రముఖ స్వాతంత్య్రయోధుడు వినాయక్ దామోదర్ సావర్కర్ ఈ జైలులోనే శిక్ష అనుభవించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవగా.. పార్టీల నాయకులు వివిధ రూపాల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. -
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు
తాజా వార్తలు (Latest News)
-
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!