ఎర మొక్కలుంటే.. మిరప దక్కేది
ఒకప్పుడు మిరప చేలకు వెళితే చుట్టూ గట్టుపై బంతి లేదా జొన్న, మొక్కజొన్న వరసలు కనిపించేది. ఇప్పుడు అవి కనిపించడం లేదు. చేను చుట్టూ సహజ రక్షణ కోసం ఇలాంటి సహజ కంచెలు వేయడంలో రైతులు చూపుతున్న
ఎకరానికి రూ.లక్షకు పైగా పెట్టుబడి పెట్టిన రైతులు
పురుగులు, తెగుళ్లతో నష్టాల పాలు
చేల చుట్టూ బంతి మొక్కలుంటే పంటను కాపాడుకోవచ్చు
తెగుళ్లపై భారత వ్యవసాయ పరిశోధన మండలి అధ్యయనం
భద్రాద్రి జిల్లాలో మిరప తోటను పరిశీలిస్తున్న ఐసీఏఆర్ శాస్త్రవేత్తలు
ఈనాడు, హైదరాబాద్: ఒకప్పుడు మిరప చేలకు వెళితే చుట్టూ గట్టుపై బంతి లేదా జొన్న, మొక్కజొన్న వరసలు కనిపించేది. ఇప్పుడు అవి కనిపించడం లేదు. చేను చుట్టూ సహజ రక్షణ కోసం ఇలాంటి సహజ కంచెలు వేయడంలో రైతులు చూపుతున్న నిర్లక్ష్యమే ఇప్పుడు పంటలను కబళిస్తోందని ‘భారత వ్యవసాయ పరిశోధన మండలి’ (ఐసీఏఆర్) శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మిరప, పత్తి, పసుపు, మొక్కజొన్న తదితర పంటలకు పురుగులు, తెగుళ్లు సోకకుండా వాటి చుట్టూ ఎరగా ఇతర మొక్కల సాగు మంచి ఫలితాలనిస్తుంది. ఏవైనా పురుగులు వస్తే తొలుత ఈ మొక్కలపై చేరతాయి. రైతులు వాటిని గుర్తించి నియంత్రించడం ద్వారా అసలు పంటను కాపాడుకోవచ్చు. మిరప రైతులు ఎకరానికి రూ.లక్షకు పైగా పెట్టుబడి పెడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఎకరా కౌలుకు రూ.30 వేలకు పైగా చెల్లించి ఈ పంట వేస్తే తెగుళ్లతో పంట దెబ్బతిని నిలువునా నష్టపోతున్నారు. తామర పురుగుతో పాటు కొత్త రకం తెగుళ్లు సోకి మిరప చెట్లు పూత, కాత లేక నాశనమవుతున్నాయని వారు చెబుతున్నారు. అప్పుల పాలై ఆవేదనతో మిరప తోటలను దున్నేస్తున్నారు. రాష్ట్ర ఉద్యానశాఖ సూచనల మేరకు ఐసీఏఆర్కు చెందిన బెంగళూరులోని ‘భారత ఉద్యాన పరిశోధనా సంస్థ’(ఐఐహెచ్ఆర్) శాస్త్రవేత్తలు తెలంగాణలోని పలు జిల్లాల్లో తెగుళ్లు సోకిన మిరప తోటలపై అధ్యయనం చేశారు. ఈ తెగుళ్లకు ప్రధాన కారణం సాగులో సరైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవడమేనని వారు స్పష్టంచేశారు. వచ్చే ఏడాది మే నెలలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన అధికారులతో కలసి జాతీయ శాస్త్రవేత్తలు మిరప సాగుపై రైతులకు శిక్షణ ఇస్తామని ఉద్యానశాఖ రాష్ట్ర సంచాలకుడు ఎల్.వెంకట్రాంరెడ్డి ‘ఈనాడు’కు చెప్పారు. నర్సరీలు పెట్టి మిరప నారు పెంచుతున్న వ్యాపారులకు కూడా శిక్షణ అవసరమని జాతీయ శాస్త్రవేత్తలు సిఫారసు చేశారని తెలిపారు. తెగుళ్ల నివారణకు వారు గుర్తించిన అంశాలపై ఐసీఏఆర్కు నివేదిక పంపారు.
నివేదికలో ముఖ్యాంశాలు...
* రాష్ట్రంలో మిరప ఆకు ముడతకు కారణమైన పురుగులు ఆగ్నేయాసియా దేశాల నుంచి వచ్చినవని అనుమానిస్తున్నారు. నిర్ధరణ కోసం నమూనాలు సేకరించి ‘జాతీయ వ్యవసాయ కీటక వనరుల పరిశోధనా మండలి’కి పంపారు. గత జూన్ నుంచి నవంబరు వరకు రాష్ట్రంలో అసాధారణ వాతావరణ పరిస్థితులు నమోదయ్యాయి. తెగుళ్లు సోకడానికి ఇవే ప్రధాన కారణం. దీనిపై శాస్త్రీయ అధ్యయనానికి వాతావరణ సమాచారాన్ని సమగ్రంగా ఐఐహెచ్ఆర్కు రాష్ట్ర ఉద్యానశాఖ పంపాలి.
* ప్రతి మిరపతోట చుట్టూ రెండు వరసల బంతి, సజ్జ, మొక్కజొన్న, జొన్న మొక్కల్లో ఏదో ఒకటి కచ్చితంగా రెండు వరసలు నాటాలి. మిరప నాటేందుకు 20 రోజుల ముందే వీటిని నాటాలి. కిలోకు 8 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ రసాయనంతో మిరప విత్తనాలను శుద్ధి చేశాకే నారు పెంచాలి. మిరప నాట్లు వేశాక 15 రోజులకు నేలలో ఎకరానికి 8 కిలోల చొప్పున ‘ఫిప్రోనిల్’ 10 జీ గుళికలను వేయాలి. వేప చెక్కను ఎకరానికి 250 కిలోలు వేయాలి. లీటరు నీటిలో 3 గ్రాముల కాపరాక్సీక్లోరైడ్ చొప్పున కలిపి మిరప చెట్టు వేళ్ల వద్ద వేయాలి. పది రోజుల దాకా నీరు పెట్టవద్దు. ప్రస్తుతం తోటలో తెగుళ్లు సోకిన కొమ్మలను కత్తిరించి తగులబెట్టాలి.
* మొక్కకు మొక్కకు మధ్య కనీసం 60 సెంటీమీటర్ల దూరం ఉండేలా నాట్లు వేయాలి. మొక్కలు ఏపుగా పెరుగుతాయని అధికంగా యూరియా వేస్తున్నారు. అలా వేయడం వల్ల పురుగులు, తెగుళ్లు అధికంగా సోకుతున్నాయి. భూసార పరీక్షలు చేయించి అవసరాన్ని బట్టి మాత్రమే యూరియా వేయాలి. మిరప నాట్లు వేసేముందు అదే పొలంలో జీలుగ, జనుము, పిల్లిపెసర వంటి పైర్లు వేసి మిరప నాట్లకు ముందు కలియదున్నితే భూమికి అవసరమైన పోషకాలు అందుతాయి. మిరపపొలాలకు కాల్వల ద్వారా నీరు పెట్టడం వల్ల అధిక తేమతో తెగుళ్లు సోకుతున్నాయి. బిందుసేద్యం విధానంలో నీరివ్వడం మంచిది. తెగుళ్లు సోకాయనే అనుమానంతో విపరీతంగా రసాయన పురుగుమందులు చల్లడం మానేయాలి.
* జింకు, బోరాన్, మాంగనీసు వంటి సూక్ష్మపోషకాలను రైతులు వాడటం లేదు. వీటిని కచ్చితంగా వినియోగించాలి.
* మిరప కోతలు కోసే ముందు కచ్చితంగా నెల ముందు నుంచే రసాయన పురుగుమందులు వాడకం ఆపివేయాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?