Konijeti Rosaiah: అభిమాన నేతకు అంతిమ వీడ్కోలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్యకు కాంగ్రెస్ నాయకులు, అభిమానులు బరువెక్కిన హృదయాలతో అంతిమ వీడ్కోలు పలికారు. ఆయన భౌతికకాయాన్ని అమీర్పేట ధరమ్కరమ్ రోడ్డులోని ఇంట్లో ప్రజల
కడసారి చూపు కోసం తరలివచ్చిన శ్రేణులు
రోశయ్య పార్థివ దేహానికి నేతల నివాళులు
సోనియా తరఫున హాజరైన మల్లికార్జున ఖర్గే
అమీర్పేట, గాంధీభవన్, శామీర్పేట, న్యూస్టుడే: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్యకు కాంగ్రెస్ నాయకులు, అభిమానులు బరువెక్కిన హృదయాలతో అంతిమ వీడ్కోలు పలికారు. ఆయన భౌతికకాయాన్ని అమీర్పేట ధరమ్కరమ్ రోడ్డులోని ఇంట్లో ప్రజల సందర్శనార్థం ఉంచారు. రాజ్యసభలో ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ దూతగా అంత్యక్రియలకు హాజరయ్యారు. కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి, ప్రముఖ సినీనటుడు చిరంజీవి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్రావు, తితిదే ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఎంపీలు సురేశ్రెడ్డి, టీజీ వెంకటేష్, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, కేంద్ర మాజీమంత్రి పల్లంరాజు, మాజీ మంత్రి రఘువీరారెడ్డి, ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షుడు రామకృష్ణ టంగుటూరి, తెరాస పార్లమెంటరీ నేత కె.కేశవరావు, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ప్రెస్ అకాడమీ మాజీ ఛైర్మన్ తిరుమలగిరి సురేందర్ తదితరులు సందర్శించి నివాళులర్పించారు. ఏపీ మంత్రులు బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాసరెడ్డి, పేర్ని నాని, వెలంపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు.. మధ్యాహ్నం 12 గంటలకు భౌతికకాయాన్ని నాంపల్లిలోని గాంధీభవన్కు తీసుకువచ్చారు. తెలుగు రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు రేవంత్రెడ్డి, శైలజానాథ్, మాజీ ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, వి.హనుమంతరావు తదితరులు ఆయన పార్థివ దేహాన్ని ఉంచిన పేటికను మోస్తూ గాంధీభవన్ లోపలికి తీసుకువెళ్లారు. కాంగ్రెస్ పార్టీ, ఈ దేశం గొప్ప ప్రజాస్వామ్యవాదిని కోల్పోయాయని రేవంత్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, షబ్బీర్అలీ, బలరాం నాయక్, సీతక్క, మల్లు రవి, జి.నిరంజన్ పాల్గొన్నారు. అభిమాన నేతను కడసారి చూసేందుకు పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అక్కడి నుంచి మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా దేవరయాంజల్ గ్రామంలో ఉన్న వ్యవసాయ క్షేత్రం వరకు అంతిమయాత్ర సాగింది. రోశయ్య కుమారులు శివ సుబ్బారావు, శ్రీనివాసమూర్తి దహన సంస్కారాలు నిర్వహించారు. డాక్టర్ గీతారెడ్డి, శ్రీధర్బాబు, మర్రి శశిధర్రెడ్డి, సంపత్కుమార్, మాజీమంత్రి నక్కా ఆనంద్బాబు, తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ దామోదర్, నిజామాబాద్ ఎమ్మెల్యే గణేశ్ గుప్త, ఏపీ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు, ఏఐసీసీ కార్యదర్శి రుద్రరాజు పద్మరాజు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. పోలీసులు గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. ఇన్ఛార్జి కలెక్టర్ హరీష్, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.
ప్రముఖుల నివాళి
కాంగ్రెస్ గొప్ప నేతను కోల్పోయిందని మల్లికార్జున ఖర్గే అన్నారు. రోశయ్య మరణవార్త విని సోనియాగాంధీ తీవ్రంగా చలించిపోయారని తెలిపారు. ఆయన 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి రికార్డు సృష్టించారని, ఏ పదవి అప్పగించినా సమర్థంగా నిర్వర్తించారని పేర్కొన్నారు. ఏఐసీసీ, సోనియాగాంధీ తరఫున ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రోశయ్య మృతి రాజకీయ వ్యవస్థకు తీరనిలోటని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. సభలో ఎంతగా ఘర్షణ పడినా శత్రువుల మాదిరి కాకుండా, రాజకీయ ప్రత్యర్థుల్లాగే చూసేవారని పేర్కొన్నారు. నాటి సీఏం వై.ఎస్.రాజశేఖరరెడ్డికి కవచంలా ఉన్న ఘనత రోశయ్యకు దక్కుతుందని అన్నారు. అవినీతి ఆరోపణలకు దూరంగా ఉంటూ రాజకీయ నేతలకు ఆదర్శంగా నిలిచారని భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఆర్థికమంత్రి అంటే ఇప్పటికీ రోశయ్యే గుర్తుకొస్తారని పేర్కొన్నారు. శాసనసభలో, పార్లమెంట్లో ఆయనను చూసి ఎన్నో విషయాలు నేర్చుకున్నామని తెలిపారు. ఆయనొక నిఘంటువు వంటివారని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఎంత కోసం ఉన్నా ముఖంలో ఎప్పుడూ చూపలేదని, ఎంత క్లిష్టమైన సమస్యనైనా చాకచక్యంగా పరిష్కరించేవారని గుర్తుచేసుకున్నారు.
ప్రకాశం జిల్లాలో విగ్రహం పెడతాం: బాలినేని
తెలుగు ప్రజలకు చిరకాలం గుర్తుండిపోయే వ్యక్తి రోశయ్య అని ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి అన్నారు. వివాదరహితుడిగా తోటి శాసనసభ్యులకు ఆదర్శంగా నిలిచారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ప్రకాశం జిల్లాలో ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!