Omicron: ఒమిక్రాన్ కొమ్ము వంచే టీకా సులువేనా!
ప్రస్తుత కొవిడ్-19 టీకాలు ఒమిక్రాన్ వేరియంట్పై ఎంత సమర్థంగా పనిచేస్తాయనే అంశం చర్చనీయాంశమైంది. ఇప్పటికే వినియోగంలోకి వచ్చిన వ్యాక్సిన్లు తీవ్రస్థాయి అనారోగ్యం నుంచి రక్షిస్తాయని శాస్త్రవేత్తలు భరోసా ఇస్తున్నారు. అయితే కొత్త
కొత్త వేరియంట్పై పోరుకు ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లో మార్పు
వంద రోజులు చాలంటున్న నిపుణులు
ప్రస్తుత కొవిడ్-19 టీకాలు ఒమిక్రాన్ వేరియంట్పై ఎంత సమర్థంగా పనిచేస్తాయనే అంశం చర్చనీయాంశమైంది. ఇప్పటికే వినియోగంలోకి వచ్చిన వ్యాక్సిన్లు తీవ్రస్థాయి అనారోగ్యం నుంచి రక్షిస్తాయని శాస్త్రవేత్తలు భరోసా ఇస్తున్నారు. అయితే కొత్త వేరియంట్కు అనుగుణంగా ఎంఆర్ఎన్ఏ టీకాల్లో మార్పు చేసే అంశాన్ని ఫైజర్, మోడెర్నా వంటి సంస్థలు పరిశీలిస్తున్నాయి. ఈ ప్రక్రియ అంత సులువుగా సాగుతుందా అన్నది ఇక్కడ కీలకంగా మారింది. ఈ ప్రక్రియపై పరిశోధకుల విశ్లేషణ ఇది.
టీకాలను ఎందుకు మెరుగుపరచాలి?
ఇప్పటికే ఇచ్చిన టీకాతో ఉత్పత్తయిన యాంటీబాడీలు.. కొత్త వేరియంట్ను గుర్తించి, దాన్ని నిర్వీర్యం చేయలేని స్థితి ఉంటుందా
అన్నదానిపై ఇది ఆధారపడి ఉంటుంది.
* కరోనా వైరస్ తన కొమ్ము ప్రొటీన్ను (స్పైక్) ఉపయోగించుకొని మానవ కణాల్లోని ఏసీఈ2 గ్రాహకాల్లోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది.
* కొవిడ్ నివారణకు రూపొందిన ఎంఆర్ఎన్ఏ టీకాలన్నీ స్పైక్ ప్రొటీన్ను ఉత్పత్తి చేయాలన్న సందేశాన్ని మానవ కణాలకు అందిస్తాయి.
* ఇలా తయారయ్యే స్పైక్ ప్రొటీన్ యాంటీబాడీలను ఉత్పత్తి చేసేలా శరీరాన్ని ప్రేరేపిస్తుంది.
* ఆ యాంటీబాడీలు కరోనాలోని స్పైక్ ప్రొటీన్కు అంటుకొని వైరస్ను అడ్డుకుంటాయి.
* ఒమిక్రాన్లోని స్పైక్ ప్రొటీన్ ఉత్పరివర్తనాల్లో కొత్త పోకడ కనిపించింది. మునుపటి టీకాలతో ఉత్పత్తయిన యాంటీబాడీల్లో కొన్నింటి సామర్థ్యాన్ని అవి తగ్గించేయవచ్చు. అలాంటి పరిస్థితుల్లో వ్యాక్సిన్ను మెరుగుపరచాల్సి రావొచ్చు.
కొత్త వ్యాక్సిన్ ఎంత భిన్నంగా ఉంటుంది?
ప్రస్తుత ఎంఆర్ఎన్ఏ టీకాల్లో కరోనా వైరస్లో మొదట వచ్చిన వేరియంట్కు సంబంధించిన స్పైక్ ప్రొటీన్ సంకేతం ఉంది. కొత్తగా రూపొందించే వ్యాక్సిన్లో ఒమిక్రాన్ సంకేతాన్ని ఉంచుతారు. ఫలితంగా ఈ కొత్త టీకా ఒమిక్రాన్ వైరస్కు బలంగా అంటుకునే యాంటీబాడీలను ఉత్పత్తి చేయిస్తుంది.
* ఇప్పటికే టీకా పొందిన వారు లేదా గతంలో కొవిడ్ నుంచి కోలుకున్నవారు ఈ కొత్త టీకాతో కూడిన బూస్టర్ డోసును పొందాల్సి ఉంటుంది. తద్వారా వీరు ఇప్పటికే వ్యాప్తిలో ఉన్న ఇతర వేరియంట్లతో పాటు ఒమిక్రాన్ను కూడా సమర్థంగా ఎదుర్కోగలరు.
* ఒకవేళ డెల్టా వేరియంట్ను తోసిరాజని ఒమిక్రాన్ ప్రధాన రకంగా మారిపోతే.. ఇప్పటికీ టీకా పొందనివారు 2-3 డోసుల కొత్త వ్యాక్సిన్ను పొందితే సరిపోతుంది.
* డెల్టా, ఒమిక్రాన్లు రెండూ విస్తృతంగా వ్యాప్తిలో ఉంటే.. ప్రస్తుత, మెరుగుపరచిన టీకాలతో కూడిన మిశ్రమాన్ని పొందాల్సి రావొచ్చు.
టీకాను మెరుగుపరిచేదెలా?
ఎంఆర్ఎన్ఏ టీకాను మెరుగుపరచడానికి కొత్త వేరియంట్కు సంబంధించిన స్పైక్ ప్రొటీన్ జన్యుక్రమం, ఎంఆర్ఎన్ఏ నిర్మాణానికి ఉపయోగించే డీఎన్ఏ టెంప్లేట్ అవసరం. ఒమిక్రాన్లోని స్పైక్ ప్రొటీన్కు సంబంధించిన జన్యు సంకేతాన్ని శాస్త్రవేత్తలు ఇప్పటికే వెలుగులోకి తెచ్చారు. ఇప్పుడు మిగిలిందల్లా.. స్పైక్ ప్రొటీన్కు సంబంధించిన డీఎన్ఏ టెంప్లేట్ను తయారుచేయడమే. దాని సాయంతోనే కొత్త వ్యాక్సిన్లలోని ఎంఆర్ఎన్ఏ భాగాన్ని ఉత్పత్తి చేస్తారు. ఇందుకోసం శాస్త్రవేత్తలు డీఎన్ఏ టెంప్లేట్లను కృత్రిమ ఎంజైమ్లు, ఎంఆర్ఎన్ఏలోని నాలుగు నిర్మాణ ‘ఇటుక’లైన జి, ఎ, యు, సిలతో కలుపుతారు. ఫలితంగా డీఎన్ఏ టెంప్లేట్కు సంబంధించిన ఎంఆర్ఎన్ఏ ప్రతులు సిద్ధమవుతాయి. ఈ విధానంలో ఒక బ్యాచ్ ఎంఆర్ఎన్ఏను ఉత్పత్తి చేయడానికి కొన్ని నిమిషాలు సరిపోతాయి. ఆ తర్వాత ఈ ఎంఆర్ఎన్ఏ ప్రతులను ఫ్యాటీ నానోరేణువుల్లో ఉంచుతారు.
ఎంత సమయం పడుతుంది?
డీఎన్ఏ టెంప్లేట్ సృష్టికి 3 రోజులు సరిపోతుంది. ల్యాబ్లో పరీక్షించడానికి సరిపడా వ్యాక్సిన్ను ఉత్పత్తి చేయడానికి వారం పడుతుంది. ఆ తర్వాత టెస్ట్ ట్యూబుల్లో మానవ కణాలపై పరీక్షించడానికి మరో ఆరువారాలు అవసరం. మనుషులపై క్లినికల్ ప్రయోగాలు చేయడానికి మరికొన్ని వారాలు అవసరం. అంతిమంగా కొత్త వ్యాక్సిన్ను అప్డేట్ చేసి, అన్ని పరీక్షలు పూర్తిచేయటానికి దాదాపు 100 రోజులు పడుతుంది. ఈ ప్రయోగాలు జరుగుతుండగానే ఉత్పత్తిదారులు తమ తయారీ ప్రక్రియల్లో మార్పులు చేసుకుంటే.. కొత్త టీకాకు ఆమోదం లభించగానే దాన్ని వేగంగా అందుబాటులోకి తీసుకురావొచ్చు.
- ఈనాడు ప్రత్యేక విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జాతీయ రహదారిని.. జగన్కు రాసిచ్చేశారా?
నా దారి రహదారి.. అడ్డం రాకు.. ఇది నరసింహ సినిమాలో రజనీకాంత్ డైలాగ్. సీఎం జగన్ కూడా చెన్నై- కోల్కతా జాతీయ రహదారి తనదే అంటున్నారు. అందుకు ఎవరూ అడ్డు చెప్పకూడదంటున్నారు. -
సీఎం వస్తున్నారని.. సాగునీటి కాలువను పూడ్చేశారు
సీఎం జగన్ ‘సిద్ధం’ సభలకు చెట్లు కొట్టేయడమే కాదు.. సాగునీటి కాలువలను సైతం మట్టితో పూడ్చేస్తున్నారు. -
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రతీక. ఎన్నికల్లో అక్కడి ప్రజలు ఇచ్చే తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి ఉంటుంది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఊరూరా మాదక ద్రవ్యాలతో మత్తెక్కిన ఆంధ్రా!
ఆంధ్రప్రదేశ్ను గంజాయి ఉపద్రవం కమ్మేసింది. దీని వినియోగం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. విశాఖ మన్యం నుంచి ఏటా రూ.10 వేల కోట్ల విలువైన గంజాయి మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశ, విదేశాలకు తరలుతోంది. -
ఈసారైనా ఒకటో తేదీన.. ఇంటి దగ్గరే పింఛన్లిస్తారా?
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా చేరాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ.. వృద్ధుల్ని సచివాలయాలకు నడిపించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమైంది. -
అవునా.. స్టీల్ప్లాంటు నష్టాల్లో ఉందా?
విశాఖ ఉక్కుకు జగన్ మళ్లీ మొండిచేయి చూపించారు. ‘స్టీలుప్లాంటు నష్టాల్లో ఉందా?’ అంటూ ఏమీ తెలియనట్లు ఆయన కార్మికసంఘాల నేతలను ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
బొగ్గు నిల్వలు చూస్తే భయం
ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సమస్య తీరడం లేదు. రెండు మూడు రోజులకు మించి ప్లాంట్ల దగ్గర బొగ్గు నిల్వలు లేవు. ఏవైనా ఇబ్బందులతో ఒక్కరోజు బొగ్గు సరఫరా నిలిచినా.. ఆ ప్రభావం థర్మల్ యూనిట్ల ఉత్పత్తిపై పడనుంది. -
బొత్స కుటుంబం కబ్జా కోరల్లో..గర్భాం మాంగనీస్ గనులు
విశాఖ ఉక్కు కర్మాగారానికి విజయనగరం జిల్లాలో ఉన్న గర్భాం మాంగనీస్ గనులను మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం కబ్జా చేసి, భారీగా దోచుకుందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. -
వాలంటీర్లపై రాజీనామా కత్తి
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వైకాపా నేతలు వాలంటీర్ల మెడపై రాజీనామా కత్తి పెట్టారు. వాలంటీర్లంతా రాజీనామా చేయాలని, అలాంటి వారికే అధికారంలోకి రాగానే మళ్లీ ఆ ఉద్యోగం ఉంటుందని బెదిరిస్తుండటంతో మంగళవారం 134 మంది రాజీనామా చేశారు. -
మార్కులకూ.. ప్రమాణాలకూ పొంతనెక్కడ?
పదో తరగతి పరీక్షల ఫలితాల్లో విద్యార్థులు భారీగా మార్కులు సాధిస్తున్నా, అభ్యసన సామర్థ్యాల్లో మాత్రం వెనకబడుతున్నారు. -
కళింగ నేలపై కపట ప్రేమ
సిక్కోలు జీవనాడి వంశధార పరివాహక ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం. రిజర్వాయర్ నిర్మాణానికి భూములు, ఊళ్లు, ఇళ్లు త్యాగం చేసిన నిర్వాసితులను ఆదుకుంటాం. కుడి, ఎడమ కాలువలను పటిష్ఠం చేసి కరకట్టలు నిర్మిస్తాం.’ -
హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలి
బలం, ధైర్యం, సంకల్పశక్తికి ప్రతిరూపమైన హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. ‘ఎక్స్’ వేదికగా ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. -
మనవాళ్లు అయితేనే భద్రత!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైకాపా నాయకులకు మాత్రమే గన్మన్లను కేటాయిస్తోంది. ప్రతిపక్ష నేతల విషయంలో వివక్ష చూపిస్తోంది. -
సాగర్ నుంచి ఏపీకి నీటి విడుదల నిలిపివేత
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు మంగళవారం రాత్రి నుంచి నీటి విడుదల నిలిపివేస్తున్నట్లు కృష్ణా బోర్డు ఆ రాష్ట్ర ఈఎన్సీకి సమాచారం అందజేసింది. -
కడప కోర్టు ఉత్తర్వులను రద్దు చేయండి
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులపై మాట్లాడవద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) ఈనెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. -
అమరనాథ్ యాత్రికులు వైద్య పరీక్షలు చేయించుకోవాలి
అమరనాథ్ యాత్రకు వెళ్లేవారు ఆయా జిల్లాల పరిధిలోని జీజీహెచ్లో వైద్యపరీక్షలు చేయించుకోవాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకురాలు పద్మావతి సూచించారు. -
నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో వడగాలుల తీవ్రత పెరుగుతోంది. మంగళవారం 66మండలాల్లో తీవ్ర వడగాలులు, 84మండలాల్లో వడగాలులు వీచాయి. -
షెడ్యూల్ విడుదలయ్యాక రూ.141 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి మంగళవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.141 కోట్ల సొత్తు (నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, ఉచితాలు, ఇతర వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం