Fuel Prices: పేదింట చమురు మంట
పెట్రోలు, డీజిల్ ధరల మంటతో సామాన్య, పేద కుటుంబాల జీవనం అస్తవ్యస్తమవుతోంది. ముఖ్యంగా పేదలు అల్లాడిపోతున్నారు. పోషకాహారం మాట అటుంచి ఏదో విధంగా ఆకలి తీరితే చాలనే పరిస్థితులు ఎదుర్కొంటున్నట్టు పలువురు వివరించారు. ‘‘కొవిడ్ వంటి వాటిని ఎదుర్కోవాలంటే ఇతరత్రా జాగ్రత్తలతో పాటు పోషకాహారం తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. కానీ పెరిగిన కూరగాయలు, వంటనూనెలు, పప్పుల వంటివాటి ధరలతో కడుపు నిండడమే కష్టంగా ఉంది. ఇక పోషకాహారం ఎక్కడ’’ అని సామాన్య, పేద కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
అందని పోషకాహారం
మండిపోతున్న నిత్యావసరాలు
పెట్రో ధరలతో అన్నింటిపైనా ప్రభావం
ఇద్దరు పిల్లలున్న చిన్న కుటుంబం నెలలో ఒకసారి చికెన్, మటన్ కిలో కొని తింటే రూ.1,000కి పైగా చెల్లించాల్సి వస్తోంది. నిత్యావసరాలకు రూ.2 వేలు పెట్టినా అంతంతమాత్రంగానే వస్తున్నాయి. కోడిగుడ్డు కూడా ఒక్కోటి రూ.5 నుంచి రూ.6కి అమ్ముతున్నారు.
ఈనాడు, హైదరాబాద్: పెట్రోలు, డీజిల్ ధరల మంటతో సామాన్య, పేద కుటుంబాల జీవనం అస్తవ్యస్తమవుతోంది. ముఖ్యంగా పేదలు అల్లాడిపోతున్నారు. పోషకాహారం మాట అటుంచి ఏదో విధంగా ఆకలి తీరితే చాలనే పరిస్థితులు ఎదుర్కొంటున్నట్టు పలువురు వివరించారు. ‘‘కొవిడ్ వంటి వాటిని ఎదుర్కోవాలంటే ఇతరత్రా జాగ్రత్తలతో పాటు పోషకాహారం తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. కానీ పెరిగిన కూరగాయలు, వంటనూనెలు, పప్పుల వంటివాటి ధరలతో కడుపు నిండడమే కష్టంగా ఉంది. ఇక పోషకాహారం ఎక్కడ’’ అని సామాన్య, పేద కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ధరల పెరుగుదల కారణంగా ప్రజలు కూరగాయలు కొనడం కూడా తగ్గించారని హైదరాబాద్ రైతుబజార్ల అధికారి ఒకరు ‘ఈనాడు’కు చెప్పారు. గతంలో కిలో, 2 కిలోలు కొనేవారు ఇప్పుడు అందులో సగమే కొంటున్నారని వివరించారు. పప్పులు, వంటనూనెల అమ్మకాలూ తగ్గినట్లు హైదరాబాద్ మలక్పేట టోకు మార్కెట్ వ్యాపారి రాజేష్ చెప్పారు. ఇక్కడ నుంచి రోజూ పలు జిల్లాల చిల్లర వ్యాపారులు నిత్యావసర సరకులు లారీల్లో తీసుకెళ్తారని, ధరల పెరుగుదల వల్ల వారు కొనుగోళ్లు తగ్గించారని వివరించారు. ‘‘నాలుగైదు నెలల్లోనే కందిపప్పు, మినప్పప్పు, వంటనూనెల వంటి వాటి కిలో ధర రూ.10 నుంచి రూ.30 దాకా పెరిగింది. ఇంత వేగంగా పెరుగుదల ఇటీవల ఎప్పుడూ చూడలేదు’’ అని ఇక్కడి టోకు వ్యాపారులు తెలిపారు.
పది కుటుంబాలను ఆరా తీస్తే...
పెట్రో ధరల ప్రభావం పేద, సాధారణ కుటుంబాలపై ఎలా ఉందో తెలుసుకునేందుకు ఈనాడు ప్రయత్నించింది. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లలో పది కుటుంబాలను ఆరా తీస్తే ఆవేదనే సమాధానమైంది. రోజూ పోషకాహారం తింటున్నారా అని అడిగితే ఒక్క కుటుంబమైనా ‘తింటున్నాం’ అని చెప్పలేదు.
ఒక్కోరోజు పచ్చడి, మజ్జిగతోనే భోజనం
- మునిగెల లక్ష్మీనారాయణ, ఆటోడ్రైవర్, స్టేషన్ ఘన్పూర్, జనగామ
నేను 30 ఏళ్లుగా ఆటో నడుపుతున్నా. ఏడాది క్రితం లీటరు రూ.65 ఉన్నప్పుడు రోజుకు రూ.600 నుంచి రూ.700 ఆదాయం వచ్చేది. ఇప్పుడు అందులో సగం కూడా రావడం లేదు. కరోనా రాకముందు వారానికి ఒకట్రెండుసార్లు గుడ్లు, చికెన్, మటన్ వంటి ఆహారం తెచ్చుకున్నా డబ్బులుండేవి. ఇప్పుడు అవి అంతగా తినడం లేదు. ఒక్కోరోజు పచ్చడి, మజ్జిగతోనే భోజనం ముగిస్తున్నా.
ఎలా బతకాలో తెలియడం లేదు
నాకు ముగ్గురు సంతానం. బైక్ మెకానిక్ని. రోజూ రూ.400 నుంచి రూ.500 వస్తుంది. కరోనా రాకముందు వాటిలో రూ.100 నుంచి రూ.200 పొదుపు చేసుకునే వాళ్లం. ఇప్పుడు కూరగాయలు కొనాలన్నా ఒక్కోసారి చేతిలో డబ్బులుండటం లేదు. పెట్రోలు ధరల పెరుగుదలతో బైకుల వాడకం తగ్గిస్తున్నారు. నాకు ఆదాయం అంతగా రావడం లేదు. ఇక పోషకాహారం మాకు ఎలా సాధ్యమవుతుంది? అసలు ఎలా బతకాలో తెలియడం లేదు.
- డి. వెంకటేష్, బైక్ మెకానిక్, వరంగల్
టమాటాలు, బీరకాయలు కొనలేం!
నేను నెలకు రూ.15 వేల జీతానికి వాచ్మెన్గా పనిచేస్తున్నా. గతంలో పెద్దగా అప్పులు చేసేవాడిని కాదు. ఇప్పుడు వైద్యం, ఇంటి ఖర్చులకే అప్పులు చేయాల్సి వస్తోంది. టమాటాలు, బీరకాయల వంటివి కిలో రూ.40 నుంచి రూ.50 చెబుతున్నారు. మాలాంటి చిన్న కుటుంబాలు ఏం కొనగలవు? అవి తినే ఆర్థిక స్థోమత చాలా కుటుంబాలకు లేనేలేదు.
- పెండ్యాల అశోక్, వాచ్మెన్, హన్మకొండ
జీతం చాలక అప్పులపాలు
నేను సింగరేణి ఓపెన్కాస్ట్ బొగ్గు గనిలో కాంట్రాక్టు కార్మికుడిగా నెలకు రూ.9 వేలకు పనిచేస్తున్నా. పెరుగుతున్న ధరలతో జీతం సరిపోక అవసరమైతే అప్పులు తెచ్చుకుంటున్నా. గతంలో రూ.500కి వచ్చిన సరకులు ఇప్పుడు రూ.800 పెట్టినా రావడం లేదు. ధరలు తగ్గించకుండా ప్రభుత్వాలు ఎన్ని చెప్పినా పేద కుటుంబాలు బతకలేవు.
- జిముడ శంకర్, బొగ్గు గని కాంట్రాక్టు కార్మికుడు, జయశంకర్ భూపాలపల్లి
బస్పాస్ తీసుకుని తిరుగుతున్నా
కొవిడ్కు ముందు మా షోరూంలో రోజుకు 25 నుంచి 30 బైకులు అమ్మేవాళ్లం. ఇప్పుడు 10 కూడా అమ్మలేకపోతున్నాం. పెట్రో ధరలకు భయపడి బైకుల వాడకం తగ్గిస్తున్నారు. నెలకు నాకొచ్చే రూ.15 వేలతో బతకడం చాలా కష్టంగా ఉంది. గతంలో బైకుపై తిరిగేవాడిని. ఇప్పుడు బస్పాస్ తీసుకుని తిరుగుతున్నా. కడుపు నిండడమే కష్టంగా ఉంది.
- రవి, బైకు షోరూం ఉద్యోగి, హైదరాబాద్
బతుకుల్ని ఆగం చేస్తున్న ధరలు
నేను ప్రైవేటు ఆఫీసులో నెలకు రూ.10 వేలకు అటెండర్గా పనిచేస్తున్నా. భార్య గృహిణి. మాకు ఇద్దరు పిల్లలు. పెట్రోలు, డీజిల్ ధరలు మాలాంటి చిన్న కుటుంబాల బతుకును ఆగం చేస్తున్నాయి. ఏడాదిలోనే ఇంటి ఖర్చులు 30 నుంచి 40 శాతం పెరిగాయి. ఇంతకుముందు బైక్పైనే తిరిగేవాడిని. ఇప్పుడు 2, 3 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తే సైకిలు వాడుతున్నా. ఇంట్లో సరకుల వాడకం, కొనుగోలు తగ్గించాం.
- స్వామిరాజు, చిరుద్యోగి, కరీంనగర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM