Covaxin: కొవాగ్జిన్కు ప్రపంచ గుర్తింపు
భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ అభివృద్ధి చేసిన కొవిడ్-19 టీకా ‘కొవాగ్జిన్’కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) గుర్తింపు లభించింది. ఇటువంటి ఘనతను సొంతం చేసుకున్న తొలి భారతీయ కొవిడ్ టీకా ఇదే. దీంతో భారతీయులకు విదేశీ ప్రయాణాలు సులభతరం కానున్నాయి. డబ్ల్యూహెచ్వో లోని సాంకేతిక సలహా బృందం (టీఏజీ), ‘కొవాగ్జిన్’కు ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ (ఈయూఎల్) కోసం డబ్ల్యూహెచ్వోకు సిఫారసు చేసింది. దీనికి అనుగుణంగా అత్యవసర
‘అత్యవసర గుర్తింపు’ ఇచ్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
వివిధ దేశాల్లో పంపిణీకి వీలు
విదేశీ ప్రయాణాలు ఇక సులువు
ఈనాడు బిజినెస్ బ్యూరో, హైదరాబాద్: భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ అభివృద్ధి చేసిన కొవిడ్-19 టీకా ‘కొవాగ్జిన్’కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) గుర్తింపు లభించింది. ఇటువంటి ఘనతను సొంతం చేసుకున్న తొలి భారతీయ కొవిడ్ టీకా ఇదే. దీంతో భారతీయులకు విదేశీ ప్రయాణాలు సులభతరం కానున్నాయి. డబ్ల్యూహెచ్వో లోని సాంకేతిక సలహా బృందం (టీఏజీ), ‘కొవాగ్జిన్’కు ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ (ఈయూఎల్) కోసం డబ్ల్యూహెచ్వోకు సిఫారసు చేసింది. దీనికి అనుగుణంగా అత్యవసర గుర్తింపు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ‘కొవాగ్జిన్కు అత్యవసర వినియోగ గుర్తింపు ఇస్తున్నాం’ అని బుధవారం సాయంత్రం డబ్ల్యూహెచ్వో ట్వీట్ చేసింది. ఈ టీకా రెండో డోసు తీసుకున్న 14 రోజుల తర్వాత 78 శాతం ప్రభావశీలత కనబరచినట్లు వివరించింది.దీన్ని నిల్వ చేయడం సులువు కాబట్టి మధ్య-అల్పాదాయ దేశాలకు అనువైనదని పేర్కొంది. డెల్టావేరియంట్ పైనా 65.2 శాతం ప్రభావశీలత కనబరచడం కొవాగ్జిన్ ప్రత్యేకత.
ఇవీ ప్రయోజనాలు
‘కొవాగ్జిన్’ టీకాకు డబ్ల్యూహెచ్వో గుర్తింపు వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయి..
* ఈ టీకా తీసుకున్న భారతీయులు ఇతర దేశాలకు వెళ్లినప్పుడు ఇకపై ‘క్వారంటైన్’లో ఉండాల్సిన పనిలేదు. గుర్తింపు ఉన్న టీకా వేసుకోలేదనే కారణంతో కొన్ని దేశాలు ఇప్పటికీ మనదేశం నుంచి ప్రయాణికులను అనుమతించటం లేదు. అనుమతించినా ‘క్వారంటైన్’ చేస్తున్నాయి. ఇకపై ఇటువంటి సమస్యలు ఎదురుకాకపోవచ్చు.
* ఈ టీకాను మనదేశం నుంచి పెద్దఎత్తున ఇతర దేశాలకు ఎగుమతి చేయవచ్చు. ఈ సంవత్సరాంతం నుంచి టీకాను పలు దేశాలకు అధికంగా ఎగుమతి చేయాలని కేంద్రం యోచిస్తోంది.
* ఇతర దేశాలు ఈ టీకాను గుర్తించి తమ దేశాల్లో వినియోగించటానికి ముందుకు రావచ్చు.
* అమెరికా, కెనడా, ఐరోపాలలోని ఔషధ నియంత్రణ సంస్థలైన యూఎస్ఎఫ్డీఏ, హెల్త్ కెనడా, యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ.. తదితర సంస్థల నుంచి ‘కొవాగ్జిన్’కు త్వరితంగా అనుమతి లభించవచ్చు.
* యునిసెఫ్, పాహో (పాన్ అమెరికన్ హెల్త్ ఆర్గనైజేషన్), గావి కొవాక్స్.. వంటి అంతర్జాతీయ సంస్థలు చేపట్టే టీకా పంపిణీ కార్యక్రమాలకు ‘కొవాగ్జిన్’ను అందించవచ్చు.
ఎవరేమన్నారు?
* ‘సమర్థ నాయకత్వానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పట్టుదలకు, ప్రజల విశ్వాసానికి ఇది ప్రబల తార్కాణం. స్వశక్తి సంపన్న భారతావనికి ఇదే నిజమైన దీపావళి.’
-కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ
* ‘కొవాగ్జిన్ టీకాకు ‘ఈయూఎల్’ లభించటం సంతోషదాయకం. కొవిడ్పై పోరాటానికి ఎన్ని ఆయుధాలు అందుబాటులోకి వస్తే, అంత మంచిది. రిస్కు అధికంగా ఉన్న దేశాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వడంపై దృష్టి సారించాలి.’
-డబ్ల్యూహెచ్వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్
* ‘ఈ గుర్తింపు వల్ల ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్-19 టీకాల లభ్యత పెరిగే అవకాశం ఏర్పడింది.’
-డబ్ల్యూహెచ్వో అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మనంగేల సిమావ్
‘డబ్ల్యూహెచ్వో గుర్తింపు వల్ల కొవాగ్జిన్ టీకాను ప్రపంచ వ్యాప్తంగా అందించగలుగుతాం. నాణ్యత, భద్రత, శాస్త్రీయ ప్రమాణాలపై మేం ఎన్నడూ రాజీపడబోం. అందువల్ల భారత్ బయోటెక్ ఉత్పత్తి చేసే ఎన్నో టీకాలకు డబ్ల్యూహెచ్ఓ నుంచి ‘ప్రీ-క్వాలిఫికేషన్’ లభించింది. కరోనా మహమ్మారి సృష్టించిన ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో ‘కొవాగ్జిన్’ టీకాను ఎన్నో దేశాల్లోని ప్రజలకు అందించేందుకు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు వీలు కల్పిస్తుంది.’
-భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్ల
‘భారత్ బయోటెక్ సిబ్బంది, భాగస్వాములు పడిన శ్రమ ఫలితమే ఈ ఘనత. టీకా రూపంలో మా సత్తా చాటుకోడానికి మాకు ఒక అవకాశం లభించింది. విజయవంతమైన ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్యానికి కొవాగ్జిన్ టీకా ఒక మంచి ఉదాహరణ.’
- భారత్ బయోటెక్ జాయింట్ ఎండీ సుచిత్ర ఎల్ల
‘కొవాగ్జిన్’ టీకా వినియోగ గడువు 12 నెలలకు పెంపు
ఈనాడు, హైదరాబాద్: ‘కొవాగ్జిన్’ టీకాను ఉత్పత్తి చేసిన నాటి నుంచి 12 నెలల వరకు వినియోగించవచ్చని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ బుధవారం వెల్లడించింది. అదనంగా టీకా స్థిరత్వ సమాచారాన్ని (స్టెబిలిటీ డేటా)ను సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఓ)కు అందజేశామని, ఈ సమాచారం ఆధారంగా టీకా వినియోగ సమయాన్ని (షెల్ఫ్ లైఫ్) పొడిగించినట్లు భారత్ బయోటెక్ పేర్కొంది. ప్రస్తుతం ‘కొవాగ్జిన్’ టీకాను ఉత్పత్తి చేసిన నాటి నుంచి 6 నెలల్లోగా వినియోగించాల్సి వస్తోంది. కొవాగ్జిన్ను ఇప్పటికే ఇరాన్, మారిషస్, మెక్సికో, నేపాల్, పరాగ్వే, ఫిలిప్పీన్స్, జింబాబ్వే, ఒమన్, శ్రీలంక, ఈస్టోనియా, గ్రీస్ దేశాలు గుర్తించాయి.
మీ సాంకేతికతను పంచుకోండి
డబ్ల్యూహెచ్వో సంప్రదింపులు
జెనీవా: తమ ‘టెక్నాలజీ యాక్సెస్ పూల్’లో చేరాలని కోరుతూ భారత్ బయోటెక్తో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) సంప్రదింపులు జరుపుతోంది. ‘కొవాగ్జిన్’కు అత్యవసర వినియోగ అనుమతులు మంజూరుచేసిన క్రమంలో ఈ మేరకు కోరుతున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ‘‘కొవిడ్ టెక్నాలజీ యాక్సెస్ పూల్లో చేరాలని భారత్ బయోటెక్ను కోరుతున్నాం. తద్వారా వ్యాక్సిన్, చికిత్సలకు సంబంధించిన సాంకేతికతలను ఇతర దేశాలతో పంచుకుని, మహమ్మారిపై మరింత సమర్థంగా, విస్తృతంగా పోరాడేందుకు అవకాశం ఉంటుంది’’ అని డబ్ల్యూహెచ్వో ఔషధ-ఆరోగ్య ఉత్పత్తుల వినియోగ విభాగం అసిస్టెంట్-డైరెక్టర్ జనరల్ డా.మారియెంగ్లా సిమావో బుధవారం తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్