Bandi Sanjay: రైతుల జీవితాలతో సీఎం చెలగాటం
‘‘ధాన్యం దిగుబడి అధికంగా వచ్చే పశ్చిమబెంగాల్, ఉత్తర్ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో లేని కొనుగోళ్ల వివాదం ఇక్కడే ఎందుకు వస్తోంది? ముఖ్యమంత్రీ.. రైతుల జీవితాలతో చెలగాటం ఆడొద్దు. వానాకాలం పంటకొంటారో, కొనరో స్పష్టంగా చెప్పాలి.
ప్రశ్నిస్తే మమ్మల్ని వెంటాడి.. వేటాడతారా?
ధాన్యంపై ఏ రాష్ట్రంలోనూ లేని సమస్య ఇక్కడే ఎందుకు?
ఫాంహౌస్ నుంచి సీఎంను ధర్నాచౌక్కు తీసుకువస్తున్నాం
కేసీఆర్ చలవతో 88 అసెంబ్లీ సీట్లకు చేరుకుంటాం: బండి సంజయ్
విలేకరులతో మాట్లాడుతున్న బండి సంజయ్. పక్కన ఎమ్మెల్యే రాజాసింగ్
ఈనాడు, హైదరాబాద్: ‘‘ధాన్యం దిగుబడి అధికంగా వచ్చే పశ్చిమబెంగాల్, ఉత్తర్ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో లేని కొనుగోళ్ల వివాదం ఇక్కడే ఎందుకు వస్తోంది? ముఖ్యమంత్రీ.. రైతుల జీవితాలతో చెలగాటం ఆడొద్దు. వానాకాలం పంటకొంటారో, కొనరో స్పష్టంగా చెప్పాలి. ధాన్యం కొనుగోళ్లు జరుగుతుంటే ఆరుగురు రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు? రైతుల సమస్య గురించి ప్రశ్నిస్తే మమ్మల్ని వెంటాడతారా? వేటాడతారా? మీ బెదిరింపులు మానుకోవాలి’’ అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బుధవారం సాయంత్రం భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వివరాలు... ‘‘ముఖ్యమంత్రిని బయటకు తీసుకువస్తామని చెప్పినట్లుగానే చేశాం. ప్రజల్లోకి రాకుండా ఫాంహౌస్లో ఉండే సీఎంను ప్రగతిభవన్కు, ఇప్పుడు రోడ్ల్లపైకి తీసుకువచ్చాం. ధర్నాచౌకే అవసరం లేదన్న ఆయనను అక్కడికే తీసుకువస్తున్నాం. ఇది ప్రజల, భాజపా విజయం. ప్రజల దృష్టిని మళ్లించడానికే సీఎం ధాన్యం కొనుగోళ్లపై లేని సమస్యను సృష్టిస్తున్నారు. వర్షాలతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ధాన్యం కొనడానికి ఇబ్బందేంటి? కొనడానికి డబ్బుల్లేవా?’ ఇది రాజకీయ పార్టీల సమస్య కాదు. మీరు, మేం కలిసి రైతుల్ని ఆదుకుందాం. వానాకాలం పంటను వెంటనే కొనుగోలు చేయాల్సిందే.
సమస్యలు సృష్టించే సీఎం అవసరమా?
‘‘బాధ్యతాయుతంగా ఉండాల్సిన సీఎం దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. ఉద్యోగాల భర్తీ, దళితులకు మూడెకరాల భూమి, తెలంగాణ అంతటా దళితబంధు కోసం పోరాడుతాం. మమ్మల్ని, యువతను, ప్రజలను వేటాడతావా? ఇలా భయపెట్టే, సమస్యలు సృష్టించే సీఎం రాష్ట్రానికి అవసరమా? ఉమ్మడి నల్గొండ జిల్లాలో మా పర్యటన విజయవంతమైంది. సీఎం భాష మార్చుకోవాలని విజ్ఞప్తిచేస్తున్నా. బెంగాల్లో కార్యకర్తల త్యాగాలు, పోరాటాలతో 88 సీట్లు గెలుచుకున్నాం. సీఎం నోటి చలవవల్ల తెలంగాణలో కూడా ముగ్గురు ఎమ్మెల్యేలున్న భాజపా బలం 88 సీట్లకు పెరుగుతుంది. వరి వేస్తే ఉరి అన్నోళ్లకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం దేనికి సంకేతం? ప్రధానికి లేఖ రాయడం సంతోషం. రాళ్లతో కొట్టించింది ఎవరు? రైతులతో నేను మాట్లాడుతుంటే తెరాస కార్యకర్తలు రాళ్లు, కోడిగుడ్లు విసిరారు. పేదల కోసం దాడులు ఎదుర్కొనేందుకు మేం సిద్ధమే. మా కార్యకర్తలు పది మంది తలకాయలు పగిలాయి. 77 మంది వరకు గాయపడ్డారు. చేతుల్లో కట్టెలు, రాళ్లతో ఉన్నవాళ్లు రైతులా? సీఎం సమాధానం చెప్పాలి. మాపై తెరాస కార్యకర్తలు దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షకుల్లా చూశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ తెరాస పోలీసింగ్ అయ్యింది’’ అని సంజయ్ విమర్శించారు.
అధిష్ఠానానికి నివేదిక
ధాన్యం కొనుగోళ్ల పరిస్థితి తెలుసుకోవడానికి బండి సంజయ్ ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటనకు వెళ్లిన సందర్భంగా జరిగిన ఘటనలపై భాజపా రాష్ట్ర శాఖ నివేదిక రూపొందించి జాతీయ పార్టీకి పంపించింది. ఘటనలకు సంబంధించి ఫొటోలు, వీడియో క్లిప్పింగ్లను జతచేశారు.
బండి సంజయ్ సహా భాజపా, తెరాస కార్యకర్తలపై కేసులు
వేములపల్లి, సూర్యాపేట నేరవిభాగం, న్యూస్టుడే: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహా భాజపా, తెరాస కార్యకర్తలపై మరో కేసు నమోదైంది.సంజయ్ ఈ నెల 15న నల్గొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెం శివారులో ఓ రైస్మిల్లు వద్దకు వచ్చారు. ఆ సమయంలో భాజపా, తెరాస కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీనిపై సంజయ్ను ఏ1గా చేర్చుతూ భాజపా, తెరాస కార్యకర్తలపై కేసులు నమోదు చేసినట్లు వేములపల్లి ఎస్సై డి.రాజు తెలిపారు.
* స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సంబంధించీ బండి సంజయ్పై కేసులు నమోదయ్యాయి. సూర్యాపేట నుంచి చివ్వెంల వరకు భారీ కాన్వాయ్తో వెళ్లినందుకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై బాసు తెలిపారు. ఇదే తరహాలో సూర్యాపేట జిల్లాలోని చివ్వెంల, ఆత్మకూర్ (ఎస్), తిరుమలగిరి, మద్దిరాల తదితర మండలాల్లోనూ కేసులు నమోదైనట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
10 లక్షల టన్నులు దాటిన ధాన్యం కొనుగోళ్లు
యాసంగి ధాన్యం కొనుగోళ్లు 10 లక్షల టన్నుల మైలురాయిని దాటాయి. ఇందులో 50 శాతానికి పైగా కొనుగోళ్లు నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోనే జరిగాయి. -
ఎండలు బాబోయ్..!
ఎండలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు తెలంగాణలో నమోదవుతున్నాయి. -
మీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిచారంటూ మంత్రి కొండా సురేఖకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) హెచ్చరిక జారీ చేసింది. ఇక నుంచి సంయమనంతో వ్యవహరించాలని హెచ్చరిస్తున్నట్లు శుక్రవారం ఆమెకు పంపిన లేఖలో స్పష్టం చేసింది. -
భారత్ బయోటెక్ను సందర్శించిన ఉప రాష్ట్రపతి
మన దేశంలో పరిశోధనారంగంలో పరిశ్రమలు, విద్యాసంస్థలు కలిసి పనిచేయాలని.. తద్వారా అన్ని విభాగాల్లో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టాలని ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ సూచించారు. -
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాస్రావు, జస్టిస్ రాజేశ్వర్రావు
తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులైన జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్రావు అలియాస్ జె.శ్రీనివాస్రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
జెనెటిక్స్ సెంటర్లు నిబంధనలు పాటించాలి: కర్ణన్
రాష్ట్రంలో జెనెటిక్స్ సంబంధిత కౌన్సెలింగ్ సెంటర్లు, లేబొరేటరీలు, క్లినిక్లు ప్రభుత్వ నిబంధనలను విధిగా పాటించాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ ఆదేశించారు. -
సోలార్ హబ్గా ‘సెస్’
తెలంగాణలోని సిరిసిల్ల విద్యుత్ సహకార సంఘం(సెస్)ను సౌరశక్తి కేంద్రం (సోలార్ హబ్)గా మార్చేందుకు జర్మనీ సంస్థలు ముందుకొచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వ మాజీ సలహాదారు, వేములవాడ మాజీ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్ తెలిపారు. -
పురపాలికల్లో వ్యర్థ జలాల శుద్ధికి మోక్షం!
రాష్ట్రంలో 101 పురపాలక సంఘాల్లోని వ్యర్థ జలాల శుద్ధికి మార్గం సుగమం అయ్యింది. అమృత్ పథకం కింద నిధులు విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించింది. -
వారసత్వ సంపదను భావితరాలకు అందించాలి
తరతరాల వారసత్వ సంపదను భావితరాలకు అందించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అన్నారు. -
జనరల్ బోగీల సంఖ్య పెంచాలి
దేశవ్యాప్తంగా ప్రతి రైలులో జనరల్ బోగీల సంఖ్యను ఐదుకు పెంచాలని ‘జనరల్ బోగీల సాధన సమితి’ సభ్యులు డిమాండ్ చేశారు. -
చెరువులో వాసవి నిర్మాణాలపై ఆధారాలివ్వండి: హైకోర్టు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలోని కోమటికుంట చెరువు ఎఫ్టీఎల్లో వాసవి ఇన్ఫ్రా ఎల్ఎల్పీ నిర్మాణాలు చేపడుతోందనడానికి తగిన ఆధారాలు సమర్పించాలని పిటిషనర్కు హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. -
ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విదేశాల్లో ఉన్న ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. బెయిల్ పిటిషన్ల కొట్టివేత
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన నిందితుల బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు శుక్రవారం కొట్టివేసింది. -
గుత్తేదారు స్పందించకపోతే అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదు?
మేడిగడ్డ బ్యారేజీలో సీసీ బ్లాకులు కొట్టుకుపోవడం, ఆప్రాన్ దెబ్బతినడంతో సహా పలు నష్టాల గురించి గుత్తేదారుకు లేఖలు రాసినా స్పందించనప్పుడు.. అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదని కాళేశ్వరం ఎత్తిపోతలపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించినట్లు తెలిసింది. -
30 వరకు బీఎడ్ వెబ్ఆప్షన్
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఎడ్(ఓడీఎల్) వెబ్ ఆప్షన్, పీహెచ్డీ ప్రవేశ పరీక్షకు చివరి తేదీలను శుక్రవారం ప్రకటించారు. -
కార్బైడ్ ఉపయోగిస్తే కఠిన చర్యలు
కార్బైడ్ వంటి నిషేధిత రసాయనాలను ఉపయోగించి కృత్రిమ విధానంతో కాయలను మాగబెట్టి పండ్లుగా మారిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్ ఆర్.వి.కర్ణన్ హెచ్చరించారు. -
కార్టూన్
-
ఇదీ సంగతి!
-
సంక్షిప్త వార్తలు
ఈపీఎఫ్వో పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ నెల 29న ‘‘నిధి ఆప్కే నికత్’’ కార్యక్రమం చేపడుతున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ అర్జున్ తుక్రాల్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?