Bandi Sanjay: సంజయ్ పర్యటనలో ఉద్రిక్తత
రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల పరిస్థితిని పరిశీలించడానికి భాజపా రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ సోమవారం చేపట్టిన ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటన ఆద్యంతం ఉద్రిక్తంగా సాగింది. పలు ధాన్యం
నల్గొండ, మిర్యాలగూడలలో రాళ్లు రువ్వుకున్న తెరాస, భాజపా కార్యకర్తలు
భాజపా రాష్ట్రాధ్యక్షుడి కాన్వాయ్పైనా దాడి, పలు వాహనాలు ధ్వంసం
నల్గొండ ఆర్జాలబావి కొనుగోలు కేంద్రంలో ధాన్యం పరిశీలిస్తున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
ఈనాడు, నల్గొండ- సూర్యాపేట గ్రామీణం, న్యూస్టుడే: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల పరిస్థితిని పరిశీలించడానికి భాజపా రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ సోమవారం చేపట్టిన ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటన ఆద్యంతం ఉద్రిక్తంగా సాగింది. పలు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద తెరాస, భాజపా కార్యకర్తలు పరస్పరం రాళ్లు, కోడిగుడ్లతో దాడి చేసుకున్నారు. దీంతో ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. తొలుత నల్గొండ సమీపంలోని ఆర్జాలబావి ఐకేపీ కేంద్రాన్ని సందర్శించిన సంజయ్ అక్కడికి ధాన్యం తీసుకువచ్చిన రైతులతో మాట్లాడారు. ఆ సమయంలో అక్కడే ఉన్న తెరాస కార్యకర్తలు సంజయ్ గోబ్యాక్ అని నినాదాలు చేస్తూ నల్లజెండాలతో నిరసన తెలిపారు. ప్రతిగా తెరాస ప్రభుత్వం, సీఎం కేసీఆర్కు వ్యతిరేకంగా భాజపా కార్యకర్తలు నినాదాలు చేశారు.
దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తెరాస కార్యకర్తలు కోడిగుడ్లు విసరడంతో భాజపా కార్యకర్తలు వారి పైకి దూసుకెళ్లేందుకు యత్నించారు. పోలీసులు అడ్డుకున్నా తోపులాటకు దిగడంతో ఐకేపీ కేంద్రంలోకి రైతులు తీసుకొచ్చిన ధాన్యం చెల్లాచెదురైంది. పలువురు రైతులు ఇరుపార్టీల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఉద్రిక్తతల మధ్యే సంజయ్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. తర్వాత వేములపల్లి మండలం కుక్కడం వద్ద ఉన్న కేంద్రాన్ని పరిశీలించడానికి వెళ్లగా నార్కట్పల్లి- అద్దంకి రహదారిపై తెరాస కార్యకర్తలు కాన్వాయ్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. వెంటనే పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. శెట్టిపాలెం వద్ద ధాన్యాన్ని మిల్లులకు తీసుకువచ్చిన రైతులతో మాట్లాడటానికి వచ్చిన సంజయ్కు వ్యతిరేకంగా అక్కడే ఉన్న తెరాస శ్రేణులు నినాదాలు చేశాయి. దీంతో ఇరువర్గాలు రాళ్లు, కోడిగుడ్లతో దాడి చేసుకోగా.. ఓ టీవీ ఛానల్ విలేకరితో పాటు పలువురు తెరాస, భాజపా కార్యకర్తలకు గాయాలయ్యాయి. సూర్యాపేట జిల్లాకు వెళుతున్న సంజయ్ కాన్వాయ్పై మూసి బ్రిడ్జి వద్ద తెరాస శ్రేణులు రాళ్లతో దాడి చేయడంతో పలు వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. రాళ్లతో దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కాన్వాయ్ను సూర్యాపేట జిల్లాలోకి అనుమతించారు.
నల్గొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెం వద్ద భాజపా, తెరాస వర్గీయుల ఘర్షణ.. అడ్డుకుంటున్న పోలీసులు
వాహనశ్రేణి దారి మళ్లింపు
శాంతిభద్రతల దృష్ట్యా సంజయ్ కాన్వాయ్ను సోమవారం రాత్రి 8 గంటలకు సూర్యాపేట మండలం తాళ్లఖమ్మంపహాడ్ వైపు దారి మళ్లించారు. తెరాస శ్రేణుల దాడి కారణంగా పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఈమేరకు చర్యలు చేపట్టారు. వాహనశ్రేణిని ఇమాంపేట మీదుగా జానారెడ్డి నగర్కు తరలించారు. రాత్రి 11 గంటలు దాటాక సంజయ్ సూర్యాపేటకు వెళ్లి భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు గృహంలో బస చేశారు. మరోవైపు సంజయ్ పర్యటనలో శాంతి భద్రతల సమస్య తలెత్తవచ్చని నిఘావర్గాలు హెచ్చరించినా నల్గొండ, సూర్యాపేట జిల్లాల పోలీసులు సరైన రీతిలో స్పందించలేదని తెరాస, భాజపా శ్రేణులు విమర్శిస్తున్నాయి. ఎస్పీలిద్దరూ స్పష్టమైన ఆదేశాలిచ్చినా రెండు జిల్లాల అధికారులు విఫలమయ్యారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
శెట్టిపాలెం వద్ద రాళ్ల దాడిలో గాయపడిన తెరాస కార్యకర్త
ఇరుపార్టీల నేతలపై కేసు నమోదు
నల్గొండ నేరవిభాగం, న్యూస్టుడే: నల్గొండలోని ఆర్జాలబావి ధాన్యం కొనుగోలు కేంద్రంలో సోమవారం చోటుచేసుకున్న భాజపా, తెరాస నేతలు, కార్యకర్తల దాడుల్లో ఇరు వర్గాలపై ఫిర్యాదులు వచ్చినట్లు రూరల్ ఎస్సై రాజశేఖర్రెడ్డి తెలిపారు. కోడ్ ఉల్లంఘనపై స్థానిక ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు మేరకు సంజయ్తో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు, నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, తెరాస నేతలు, కార్యకర్తలపై కేసు నమోదు చేశామన్నారు.
పోలీసుల సహకారంతోనే దాడులు: సంజయ్
పెన్పహాడ్, గన్ఫౌండ్రి- న్యూస్టుడే: పోలీసుల సహకారంతో ముఖ్యమంత్రి కేసీఆర్ తమపై దాడులు చేయిస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. పెన్పహాడ్ మండలం జానారెడ్డినగర్లో సోమవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతులు తిరగబడి దాడులకు పాల్పడతారనే ఇంటెలిజెన్స్ సమాచారం కేసీఆర్ వద్ద ఉందని, అందుకే అసహనంతో దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. తెరాస శ్రేణుల దాడిలో 8 వాహనాలు ధ్వంసమయ్యాయన్నారు. కేసీఆర్ తన పర్యటనను అడ్డుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తీసుకోవాలని కేంద్రం ఆదేశించినా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కొనకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. జనగామలో మంగళవారం పదాధికారుల అత్యవసర సమావేశం జరుగుతుందని, అక్కడ తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని సంజయ్ వెల్లడించారు. నల్గొండ ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గజినీ వేషాలు వేస్తున్నారని విమర్శించారు. ప్రతి గింజా కొంటామని చెప్పి, ఇప్పుడు కేంద్రంపై ఆ నెపం వేస్తున్నారన్నారు. 2023లోగా ధాన్యం మద్దతు ధరను రెట్టింపు చేస్తామన్నారు.
* హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత సీఎం కేసీఆర్, తెరాస నేతలు రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని, తమ పార్టీ నేతలకు రక్షణ కల్పించాలని భాజపా నేత ఎన్.రాంచందర్రావు డీజీపీ, పోలీసు యంత్రాంగాన్ని కోరారు.
నేరేడుచర్ల వద్ద రాళ్ల దాడిలో ధ్వంసమైన భాజపా కాన్వాయ్లోని కారు అద్దాలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస నేత ఇంట్లో గోడ గడియారాలు, మద్యం సీసాల పట్టివేత
మంచిర్యాల జిల్లా మందమర్రిలో భారాస పట్టణ సోషల్ మీడియా ఇన్ఛార్జి బెల్లం అశోక్ ఇంట్లో ఓటర్లకు పంపిణీ చేయడానికి నిల్వ చేసిన గోడ గడియారాలు, మద్యం సీసాలను గురువారం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్నారు. -
ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య ప్రమాణం
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య గురువారం ఉదయం ప్రమాణం చేశారు. మొదటి కోర్టు హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ మౌసమీ భట్టాచార్యతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే ప్రమాణం చేయించారు. -
పఫర్ ఫిష్
విశాఖలోని సాగర తీరంలో గురువారం మత్స్యకారుల వలకు విభిన్న తరహా సముద్ర జీవులు చిక్కాయి. -
కొంచెం ఓపిక పట్టండి.. అంతా మంచే జరుగుతుంది
‘సార్.. మాపై చాలా కేసులు పెట్టారు. దీంతో చాలామందికి పాస్పోర్టులు ఆగిపోయాయి. -
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రవీందర్రెడ్డి
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది ఎ.రవీందర్రెడ్డి ఎన్నికయ్యారు. గురువారం జరిగిన కార్యవర్గ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి రవీందర్రెడ్డి, ఎం.విజయ్కుమార్, చిక్కుడు ప్రభాకర్, ఎ.జగన్ పోటీ పడ్డారు. -
3 రోజుల్లో.. 30 జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
రాష్ట్రవ్యాప్తంగా రబీ(యాసంగి) ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాలు జిల్లాల వారీగా ఖరారయ్యాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 6.24 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నారు. -
రూ.50 లక్షల వ్యయం.. 5 వేల ఎకరాల సాగు ఖాయం!
తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తేవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇలాంటి వాటిని గుర్తించి.. త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. -
తగ్గిపోతున్న యువ జనాభా!
దేశ అభివృద్ధిలో కీలకమైన యువ జనాభా దక్షిణాది రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీగా తగ్గనుందని తాజా అంతర్జాతీయ నివేదిక ఒకటి పేర్కొంది. -
వేడెక్కిన తెలంగాణ
సూర్యుడి భగభగలతో రాష్ట్రం వేడెక్కింది. అనేక జిల్లాల్లో ఎండవేడికి ప్రజలు అల్లాడుతున్నారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ ఉడుకుతోంది. వారం రోజులుగా 40 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉన్న ఉష్ణోగ్రతలు గురువారం నాటికి మరింత పెరిగాయి. -
తెలుగు వర్సిటీ పురస్కారాల ప్రదానం
చిత్రలేఖనం, నృత్యం, సంగీతం, పాత్రికేయం, అవధానం, రచన తదితర ప్రక్రియల్లో విశేష కృషి చేసిన 12 మందికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2023 సంవత్సరానికిగాను ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేసింది. -
విత్తన లైసెన్సింగ్ విధానంలో మార్పులు
తెలంగాణలో ప్రస్తుతమున్న విత్తన లైసెన్సింగ్ విధానంలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని, విత్తన సరఫరాలో పారదర్శకతకు ఆయా కంపెనీల ప్రతినిధుల సూచనలను పరిశీలిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. -
రాజన్న క్షేత్రంలో వైభవంగా శివ కల్యాణం
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి ఆలయంలో గురువారం శివ కల్యాణం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
బాహు‘మీనం’
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అప్పరాలలో మత్స్యకారుడు పరమేశ్కు చిక్కిన భారీ చేప ఇది. గురువారం ఆయన పామాపురం సమీపంలోని ఊకచెట్టు వాగులో నిర్మించిన చెక్ డ్యామ్లో వేటకు వెళ్లగా.. 10 నుంచి 25 కిలోల బరువున్న చేపలు వలలో చిక్కాయి. -
టెట్పై ఉపాధ్యాయుల్లో గందరగోళం
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024పై ఉపాధ్యాయుల్లో సందేహాలు నెలకొన్నాయి. వాటిని నివృత్తి చేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు విద్యాశాఖ ఉన్నతాధికారులను కలిసి విన్నవిస్తున్నారు. -
గురుకులాల్లో భర్తీకాని పోస్టులపై నిర్ణయం తీసుకోండి: హైకోర్టు
గురుకులాల్లో డిగ్రీ, జూనియర్ లెక్చరర్లు, పోస్టు గ్రాడ్యుయేట్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, బోధనేతర సిబ్బంది పోస్టులకు ఎంపికైన వారు బాధ్యతలు స్వీకరించకపోవడంతో ఏర్పడిన ఖాళీల్లో పిటిషనర్ల నియామకాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
ఇంటర్ కళాశాలలకు మే 31 వరకు సెలవులు
రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించింది. ఈ నెల 31 నుంచి మే 31వ తేదీ వరకు సెలవులు ఉంటాయని గురువారం వెల్లడించింది. -
‘సాహితీ’ డబుల్ దందాపై పోలీసుల ఆరా
కార్తికేయ పనోరమ ప్రాజెక్టు పేరిట సాహితీ ఇన్ఫ్రా పాల్పడిన మోసాలపై హైదరాబాద్ సైబర్క్రైం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
రంగులు తొలగిస్తే ఊరుకోను.. వైకాపా నాయకుడి వీరంగం
-
పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన?
-
భయపెడుతున్న భువన్.. శివారు మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను నాలుగైదు రెట్లు పెంపు
-
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
-
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక