Booster dose: 6 నెలల తర్వాత బూస్టర్ మేలు
కరోనా టీకా రెండో డోసు వేయించుకున్న ఆరు నెలల తర్వాత బూస్టర్ డోసు పొందడం మేలని, దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమేనని కొవిడ్ టీకా కొవాగ్జిన్ను తయారు చేసిన భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్ల పేర్కొన్నారు. తాము రూపొందిస్తున్న నాసికా టీకా (నాసల్ వ్యాక్సిన్) బూస్టర్ డోస్గా చక్కగా పనిచేస్తుందని, దానివల్ల వైరస్ వ్యాప్తి నిరోధం సాధ్యమవుతుందని తెలిపారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం నాసికా టీకా కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.
నాసికా టీకాతో వైరస్ వ్యాప్తి నిరోధం సాధ్యం
దీనిని రెండో డోసుగా అందించాలని యోచిస్తున్నాం
కరోనా సోకిన వారికి, మొదటి మోతాదు పొందిన వారికి అది ఉత్తమం
కొవాగ్జిన్పై వ్యతిరేక ప్రచారం మమ్మల్ని బాధించింది
‘టైమ్స్ నౌ’ సదస్సులో భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్ల
ఈనాడు, దిల్లీ: కరోనా టీకా రెండో డోసు వేయించుకున్న ఆరు నెలల తర్వాత బూస్టర్ డోసు పొందడం మేలని, దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమేనని కొవిడ్ టీకా కొవాగ్జిన్ను తయారు చేసిన భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్ల పేర్కొన్నారు. తాము రూపొందిస్తున్న నాసికా టీకా (నాసల్ వ్యాక్సిన్) బూస్టర్ డోస్గా చక్కగా పనిచేస్తుందని, దానివల్ల వైరస్ వ్యాప్తి నిరోధం సాధ్యమవుతుందని తెలిపారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం నాసికా టీకా కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. కొవాగ్జిన్ తీసుకున్నవారిలో ఆరు నెలల తర్వాత కూడా టీ సెల్ స్పందన కనిపిస్తోందని, ఇది అమెరికాలో అందించే ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ల కంటే మేలైన పనితీరు కనబరుస్తోందని పేర్కొన్నారు. ‘ఇండియా-గ్లోబల్ వ్యాక్సిన్ ఇంజిన్’ అన్న అంశంపై టైమ్స్నౌ ఛానల్ బుధవారం నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొని వివిధ ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే..
పారదర్శకత, నిజాయితీతో ఆటలో గెలిచాం
మేం తయారు చేస్తున్న వ్యాక్సిన్లలో అయిదింటికి ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) గుర్తింపు ఉంది. ఆ ప్రక్రియ ఎలా సాగుతుందన్నది మాకు తెలుసు. కొన్ని ప్రసార మాధ్యమాలే వ్యతిరేకంగా రాశాయి. అలాంటి వాటివల్ల అనుమతుల ప్రక్రియలో కొంత జాప్యం జరిగింది. పారదర్శకంగా, నిజాయితీగా ఉండటంవల్ల చివరకు ఆటలో గెలిచాం. ప్రధానమంత్రి కొవాగ్జిన్ వ్యాక్సిన్ తీసుకున్న వెంటనే అది మోదీ, భాజపా వ్యాక్సిన్ అని కొందరు ప్రచారం మొదలుపెట్టారు. శాస్త్రవేత్తలుగా మేం రాజకీయాలను అర్థం చేసుకోలేం. మాపై చేసిన ప్రచారం మమ్మల్ని బాధించడమే కాకుండా భవిష్యత్తులో వచ్చే స్టార్టప్స్కి అడ్డంకిగా తయారైంది. ఎవరైనా మిగతావిషయాలపై రాజకీయాలు చేయొచ్చు కానీ వైద్య ఆరోగ్యంపై మాత్రం కాదు.
ఎవరూ మాలాంటి పరీక్షలను ఎదుర్కోలేదు
దేశంలో చేసిన ప్రతికూల ప్రచారం డబ్ల్యూహెచ్ఓనీ ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టింది. తాము చేస్తున్నది తప్పా, ఒప్పా అని నిర్ధరించుకునేందుకు వారు ప్రతి చిన్న విషయాన్ని పెద్దగా చూసి సూక్ష్మంగా పరిశీలించాల్సి వచ్చింది. మాలాంటి పరీక్షలను ఎవ్వరూ ఎదుర్కోలేదు. చివరికి మేమే నెగ్గాం. ఎక్కువ మంది సవాళ్లు విసరడం మాకే మేలు చేసింది. మిగతావారి కంటే ఉత్తమంగా నిలవడానికి దోహదపడింది.
అప్పుడు మాస్కుల అవసరం ఉండదు
తొలి డోసు కొవాగ్జిన్, రెండో డోసు కింద నాసికా టీకా ఇచ్చే విషయం గురించి ఆలోచిస్తున్నాం. రెండో డోసు నాసికా వ్యాక్సిన్ ఇస్తే వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి వీలుంటుంది. అప్పుడు మాస్కులు వాడాల్సిన అవసరం ఉండదు. సూది మందు రూపంలో ఇచ్చే టీకాతో ఊపిరితిత్తుల పైభాగానికి రక్షణ ఉండదు కనుక మాస్క్ ధరించాలి. నాసికా వ్యాక్సిన్ ఆ భాగానికీ రక్షణ కల్పిస్తుంది. నాసికా టీకాను వైరస్ సోకని వ్యక్తికి ఇస్తే అది సరిగా పనిచేయదు. కానీ ఇన్ఫెక్షన్కు గురైన వ్యక్తికి గానీ, తొలి డోసు తీసుకున్న వ్యక్తికి గానీ ఇస్తే అది బాగా పనిచేస్తున్నట్లు గుర్తించాం. ఈ రోగనిరోధకశక్తి (ఇమ్యునాలజీ)ని ప్రపంచంలో తొలిసారి కనుగొన్న సంస్థ మాదే. ఇప్పటికే ఇన్ఫెక్షన్కు గురైన వారు రెండు డోసుల కొవాగ్జిన్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఈ నాసికా వ్యాక్సిన్ ఒక్క డోసు తీసుకుంటే సరిపోతుంది. కరోనాను నిరోధించాలంటే నాసికా టీకా తప్ప ఇంకో మార్గం లేదు. మేం దీని రెండో దశ పరీక్షలు పూర్తిచేశాం. ఫలితాల విశ్లేషణ జరుగుతోంది. 3-4 నెలల్లో దాన్ని ఆశించవచ్చు.
మాకు మంచి చరిత్ర ఉంది
మేం ఇదివరకే కొవాగ్జిన్ కంటే ఉత్తమమైన, ప్రపంచంలో మొట్టమొదటి టైఫాయిడ్ కాంజుగేట్ వ్యాక్సిన్ను రూపొందించాం. దురదృష్టవశాత్తు దాని గురించి మీడియా పట్టించుకోలేదు. ఉత్తమ వ్యాక్సిన్ల రూపకల్పనలో మాకు మంచి చరిత్ర ఉంది. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో గర్భిణులకు కొవిడ్ వ్యాక్సిన్ ఇచ్చింది భారత్లోనే. అందులో దాదాపు పది లక్షల మందికి కొవాగ్జిన్ ఇచ్చారు. గర్భిణులకు ఈ వ్యాక్సిన్ సురక్షితమని తేలింది. డబ్ల్యూహెచ్ఓ మాత్రం క్లినికల్ మోడ్లో ఈ విషయాన్ని నిరూపించాల్సిందిగా సూచిస్తోంది. మరో రెండుమూడు నెలల్లో ఆ పని పూర్తిచేస్తాం. మాది ఉత్తమమైన సైన్స్ అని మరోసారి నిరూపించుకుంటాం.
పిల్లల టీకాపై కేంద్రం త్వరగా నిర్ణయించాలి
2 నుంచి 18 ఏళ్ల వారిలో క్లినికల్ పరీక్షలు నిర్వహించిన ఏకైక వ్యాక్సిన్ ప్రపంచంలో మాదే. వివరాలను ఔషధ నియంత్రణ జనరల్ ఆమోదం కోసం పంపాం. భారతీయ సంస్థ అనుమతులు ఇచ్చేంతవరకూ పిల్లల టీకాకు డబ్ల్యూహెచ్ఓ అనుమతిచ్చే అవకాశం లేదు. మూడేళ్లకుపైగా వయసున్న పిల్లలకు టీకా అనుమతుల కోసం చైనా దరఖాస్తు చేసుకొంది. ఈ విషయంలో మాకు పోటీ ఎదురవుతోంది. ప్రపంచ పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని కేంద్రం అనుమతులు ఇవ్వాల్సి ఉంది. అవి వచ్చిన రెండు మూడు నెలల్లోనే మొత్తం పిల్లలకు అందించడం సాధ్యం కాదు. అనుమతులు ఆలస్యం చేస్తే మిగతా ప్రపంచ దేశాలకు వెళ్లే అవకాశం కోల్పోయే ప్రమాదం ఉంది. అందువల్ల కేంద్రం త్వరగా నిర్ణయం తీసుకోవాలి. ప్రస్తుతం మేం ఏటా 100 కోట్ల డోసుల ఉత్పత్తి సామర్థ్యానికి చేరుకున్నాం. మూడు ప్రభుత్వరంగ సంస్థలు, ఒక ప్రైవేటు సంస్థతో వ్యాక్సిన్ ఉత్పత్తి కోసం ఒప్పందం చేసుకున్నాం. మేం ఆశించిన స్థాయికి వారు చేరుకోలేదు.
అది మాకిచ్చిన గౌరవంగా భావిస్తున్నాం
దేశ ప్రధాని మా వ్యాక్సిన్ తీసుకోవడం మాకు ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నాం. భారతీయ శాస్త్రవేత్తలపై, స్టార్టప్స్పై ఉన్న నమ్మకానికి అది అద్దంపట్టింది. వ్యాక్సిన్ అభివృద్ధిలో మేం ఏ ప్రక్రియనూ తగ్గించలేదు. ఏ నిబంధనా ఉల్లంఘించలేదు. ఆ పనిచేసి ఉంటే నేను జైలుకు వెళ్లి ఉండేవాన్ని. భారతీయ చట్టాలను 100% అనుసరించాం. ఇక్కడ వేగం పుంజుకొన్నది అనుమతుల ప్రక్రియ మాత్రమే. ఇదివరకు నాలుగైదునెలలు పట్టే అనుమతులు ఇప్పుడు నాలుగైదు రోజుల్లోనే వచ్చాయి. వ్యాక్సిన్ తయారీ సంస్థలను ప్రధానమంత్రి సందర్శించడం.. నియంత్రణ వ్యవస్థ పనితీరులో మార్పు రావడానికి దోహదం చేసింది.
త్వరలో జికా వైరస్కు వ్యాక్సిన్
కరోనా వ్యాక్సిన్ తీసుకొని ఆరు నెలలు గడిచిన వారిని పరీక్షించి వారిలో టీసెల్ మెమరీ ఉందా? లేదా? అని పరిశీలించినప్పుడు అవి అందరిలో కనిపించాయి. తర్వాత వారికి వ్యాక్సిన్ ఇచ్చి చూసినప్పుడు బూస్టింగ్ ప్రభావం కనిపించింది. టీసెల్ స్పందన చాలా ముఖ్యం. కొవాగ్జిన్ వల్ల అది దీర్ఘకాలం ఉంటుంది. జికా వైరస్కు 2014లోనే వ్యాక్సిన్ కనుగొన్నాం. ఇప్పటికే మొదటిదశ ట్రయల్స్ పూర్తయ్యాయి. ఇంకా రెండు ట్రయల్స్ జరగాల్సి ఉంది. త్వరలో సిద్ధం చేస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ