Dharani: ఉపశమనం దొరికేనా!
ఆన్లైన్లో తమ భూమి వివరాలు కనిపించక ఆందోళన చెందుతున్న రైతులు ధరణి ఉప సంఘం పైనే ఆశలు పెట్టుకున్నారు. తమ సమస్యల వినతి పత్రాలను ప్రత్యక్ష పద్ధతిలో స్వీకరించాలని కోరుతున్నారు. మీసేవ, ధరణిలో
ధరణి సమస్యలపై మంత్రివర్గ ఉప సంఘంపైనే ఆశలు
పాసుపుస్తకాల కోసం బాధితుల ప్రదక్షిణలు
భూమి హక్కులు దక్కక ఇక్కట్లు
సమస్యలపై దరఖాస్తులు నేరుగా స్వీకరించాలని వినతులు
ఈనాడు, హైదరాబాద్: ఆన్లైన్లో తమ భూమి వివరాలు కనిపించక ఆందోళన చెందుతున్న రైతులు ధరణి ఉప సంఘం పైనే ఆశలు పెట్టుకున్నారు. తమ సమస్యల వినతి పత్రాలను ప్రత్యక్ష పద్ధతిలో స్వీకరించాలని కోరుతున్నారు. మీసేవ, ధరణిలో దరఖాస్తు చేస్తే ఏం జరుగుతుందో అంతుపట్టడం లేదని అనేక గ్రామాల అన్నదాతలు చెబుతున్నారు. ఒక్కో గ్రామానికి పదికి పైగా సమస్యలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం జారీ చేసిన కొత్త పాసుపుస్తకం అందని వారు కొందరైతే.. పుస్తకం వచ్చినా పూర్తి విస్తీర్ణం నమోదు కాకపోవడం, తప్పులు దొర్లడంతో కొందరు ఇబ్బందులు పడుతున్నారు. సమస్య పరిష్కారం అయిందీ లేనిదీ తెలియజేసేలా ప్రభుత్వం ప్రత్యక్ష పద్ధతిని ఏర్పాటు చేయాలంటున్నారు. ఉప సంఘం ఈ సమస్యపై దృష్టి సారించాలని బాధితులు విన్నవిస్తున్నారు.
ఉప సంఘానికి అందిన సమస్యలివి
* మూల సర్వే నంబరును మించి విస్తీర్ణం నమోదు కావడంతో కొందరు పట్టాదారులకు పాసుపుస్తకాలు జారీకాలేదు.
* కొందరికి కొంత విస్తీర్ణం మాత్రమే నమోదు చేసి పుస్తకాలు జారీ చేశారు.
* జిల్లాల్లో కొన్ని ఖాతాలు, సర్వే నంబర్లు పూర్తిగా ధరణిలో నమోదు కాలేదు.
* ప్రభుత్వం సేకరించిన విస్తీర్ణం కన్నా ఎక్కువ భూమిని దస్త్రాల్లో నమోదు చేసి నిషేధిత జాబితాలో చేర్చారు.
* భూయజమాని మరణించిన సందర్భంలో వారసత్వ బదిలీకి కుటుంబ ధ్రువీకరణ పత్రం పరిగణనలోకి తీసుకోకపోవడంతో ఇబ్బందులు.
* ఎసైన్డ్ భూములన్న రైతులకు డిజిటల్ సంతకం పూర్తికాకపోవడంతో ధరణిలోకి ఎక్కలేదు.
* రైతు బంధు సర్వే సమయంలో సాగులో లేని పట్టా భూములను నమోదు చేయలేదు.
* ఇద్దరు కలసి కొనుగోలు చేసిన భూమిని విక్రయించుకోవడానికి వీల్లేకుండా ఉంది.
* పదేళ్ల కాలానికి మించి సాగులో ఉన్న ఇనాం భూములకు అధీన ధ్రువపత్రం జారీచేసి (ఓఆర్సీ) హక్కులు కల్పించాల్సి ఉన్నా ఆన్లైన్లో వారి వివరాలు కనిపించడం లేదు.
* ధరణిలో సర్వే నంబర్ల వారీగా ఎన్కంబర్స్మెంట్ సర్టిఫికెట్ రావడం లేదు.
* ధరణికి ముందు గజాల కొలతలతో రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకు ఇప్పుడు మ్యుటేషన్ కావడం లేదు.
* పిల్లల పేరుతో భూమిని గిఫ్ట్ డీడ్ చేస్తే మైనర్ల ఫొటోలు పాసుపుస్తకాల్లో రావడం లేదు.
కసరత్తు ముమ్మరం
రాష్ట్రంలో నెలకొన్న భూసమస్యల పరిష్కారానికి మంత్రి హరీశ్రావు నేతృత్వంలో నియమించిన మంత్రివర్గ ఉప సంఘం ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఒక దఫా సమావేశమై సమస్యలను స్వీకరించింది.ఈనెల 20 తర్వాత మరోమారు భేటీకానుంది. ఈ లోగా సమస్యల గుర్తింపు, వాటి పరిష్కారానికి ధరణిలో ఏర్పాటు చేయాల్సిన ఐచ్ఛికాలపై అధికారులు పరిశీలన చేస్తున్నారు.
ఇక ఓపిక లేదు: రామయ్య
‘‘నాలుగేళ్ల నుంచి తిరుగుతున్నా.. ఇక ఓపిక లేదు. నా పట్టా భూమికి హక్కులు కల్పించండి. చేతిలో భూమున్నా అప్పు పుట్టడం లేదు. రైతుబంధు, బీమా రావడం లేదు. సమస్యను రాతపూర్వకంగా, ఆన్లైన్లోనూ దరఖాస్తు చేసుకున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు’’ అంటూ నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం రాజుపేటకు చెందిన బి.రామయ్య అనే రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాతల నాటినుంచి సాగు చేసుకుంటున్న పట్టా భూమి 2.20 ఎకరాలకు 2018 నుంచి హక్కులు పోయాయి. కొత్త పాసుపుస్తకం ఇవ్వడం లేదని వాపోతున్నారు. వాస్తవానికి రాజుపేట గ్రామంలోని సర్వే నంబరు 299లో 15 ఎకరాల భూమి ఉండగా 12 మంది రైతులు ఉన్నారు. 2017 దస్త్రాల ప్రక్షాళన సందర్భంగా కొందరు రైతులకు వారికున్న దానికన్నా ఎక్కువ విస్తీర్ణం నమోదు చేశారు. దీంతో సర్వే నంబరులో ఎక్కువ విస్తీర్ణం (ఆర్ఎస్ఆర్) చూపడంతో రామయ్య విస్తీర్ణం, ఖాతా తొలగించేశారు. సంగారెడ్డి జిల్లాలో మడెప్ప పాసుపుస్తకం.. భద్రాద్రిలో ఆన్లైన్లో కనిపించని లాలయ్య ఖాతా... యాదాద్రి జిల్లాలో నిషేధిత జాబితాలో విజయలక్ష్మి భూమి నమోదు.., ఇలా ఎంతలేదన్నా ఒక్కో గ్రామానికి పదికిపైగానే సమస్యలు కనిపిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ అత్యంత ప్రమాదకరం
పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి వారిని నియంత్రించడానికి గత ప్రభుత్వ పాలకులు ఫోన్ ట్యాపింగ్ను వాడుకున్నారని, అది అత్యంత ప్రమాదకరం అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. -
సిద్దిపేట జిల్లాలో ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
భారాస నిర్వహించిన ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్నారన్న కారణంగా కొంత మంది ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఏప్రిల్ 8న సిద్దిపేట జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ జారీ చేసిన ఆదేశాల అమలును నిలిపివేస్తూ హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
మేడిగడ్డ పూర్తవకుండానే పూర్తయినట్లు సర్టిఫికెట్
మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం పూర్తి కాకుండానే, అయినట్లుగా సంబంధిత ఇంజినీర్లు గుత్తేదారుకు సర్టిఫికెట్ ఇచ్చినట్లు ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ నీటిపారుదల శాఖకు నివేదించారు. -
గరుడ ప్రసాదం... పోటెత్తిన భక్తజనం
రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరు బాలాజీ ఆలయంలో శుక్రవారం నిర్వహించిన బ్రహ్మోత్సవాలు... గరుడ ప్రసాద వితరణ భక్తులకు తీవ్ర అసౌకర్యం కలిగించింది. -
పగలు వడగాలులు.. సాయంత్రం వడగళ్లు
రాష్ట్రంలో శుక్రవారం పలు జిల్లాల్లో ఎండలు భగ్గుమనగా.. కొన్ని జిల్లాల్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా నల్గొండ, సూర్యాపేట జిల్లాలు సలసలా కాగాయి. -
‘కోటిపల్లి’ పనుల్లో అసాధారణ అంచనాలు
‘నీటిపారుదల ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ-జనరల్) కార్యాలయం నుంచి ప్రభుత్వానికి అంచనాలు పంపేందుకు వెనుకాడాల్సిన ఇబ్బందికరమైన పరిస్థితిని హైదరాబాద్ సర్కిల్ ఇంజినీర్లు తీసుకొచ్చారు. -
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
వైకాపా తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ అవినాష్రెడ్డి తాను రెండు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నానని అఫిడవిట్లో పేర్కొన్నారు. -
14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు
రాష్ట్రంలో 2024 వానాకాలం సీజన్ కోసం 14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలను సాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉద్యానవన శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. -
నీటి లోతుల్లో నిఘా కళ్లు!
తెలంగాణ విపత్తు స్పందన, అగ్నిమాపక సేవలశాఖ మరిన్ని సాంకేతిక హంగులను సమకూర్చుకుంటోంది. అధునాతన పరిజ్ఞానంతో కూడిన పరికరాలను సొంతం చేసుకునే దిశగా ఆ శాఖ అడుగులు వేస్తోంది. -
కృష్ణా పరీవాహకంలో చెరువుల కింద నీటి వినియోగం ఎంత?
చిన్ననీటి పారుదల రంగంలో కృష్ణా పరీవాహకంలో నీటి వినియోగం, పొదుపుపై నీటిపారుదల శాఖ లెక్కగడుతోంది. -
గురుకుల విద్యార్థి మృతి ఘటనపై కేంద్రం ఆగ్రహం
భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ సంఘటనపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జాతీయ ఎస్సీ కమిషన్ను ఆదేశించింది. -
శ్రీలంకలోని వేద గిరిజన జనాభాకు భారతీయులతో దగ్గరి సంబంధాలు
శ్రీలంకకు చెందిన వేద గిరిజన జనాభాకు భారతీయులతో దగ్గరి సంబంధాలున్నాయి. దక్షిణ భారత్లోని కొన్ని గిరిజన సమూహాలతో జన్యుపరమైన అనుబంధం కలిగి ఉన్నట్లు సీసీఎంబీ పరిశోధనలో వెల్లడైంది. -
‘వాట్సప్ గురు’ మరో ఘనత!
తెలంగాణ అదనపు డీజీపీ (రైల్వేస్ అండ్ రోడ్ సేఫ్టీ) మహేశ్ మురళీధర్ భగవత్ మరో ఘనత సాధించారు. -
దార్శనిక నేత చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొమ్మిదేళ్లు, నవ్యాంధ్రకు ఐదేళ్లు కలిసి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన సాగిన తీరును కళ్లకు కడుతూ ‘మన చంద్రన్న- అభివృద్ధి, సంక్షేమ విజనరీ’ పేరుతో పార్టీ రాజకీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ పుస్తకం రూపొందించారు. -
తిరుమల శేషాచలం పరిధిలో అగ్నికీలలు
శేషాచలం పరిధిలో తీవ్రమైన ఎండలు, వేడి గాలులతో ఎక్కడికక్కడ అగ్నికీలలు వ్యాపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం తిరుమలకు సమీపంలో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. -
ఎన్ఎస్జీ డీజీగా నళిన్ ప్రభాత్
జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్జీ) డైరెక్టర్ జనరల్గా నళిన్ ప్రభాత్ నియమితులయ్యారు. ఈయన ఏపీ క్యాడర్కు చెందిన 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. -
భారీగా పెరిగిన శ్రీవారి డిపాజిట్లు
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆదాయం ఏటేటా పెరుగుతోంది. 2023-24లో తితిదే ఏకంగా రూ.1,161 కోట్లను వివిధ బ్యాంకుల్లో ఫిక్సిడ్ డిపాజిట్ చేసింది. -
సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్చంద్రారెడ్డి!
దిల్లీ మద్యం కుంభకోణంపై ఈడీ నమోదు చేసిన కేసులో ఇప్పటికే అప్రూవర్గా మారిన అరబిందో సంస్థ ప్రతినిధి శరత్చంద్రారెడ్డి తాజాగా సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్గా మారినట్లు తెలిసింది. -
రైతాంగ సమస్యలపై మే 15 నుంచి ఆందోళనలు
రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కర్షక వ్యతిరేక విధానాలపై ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధం కావాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం (ఏఐపీకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు రాయల చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. -
అనుమతుల్లేని క్లినిక్లపై దాడి.. రూ. 2.6 లక్షల విలువైన మందుల స్వాధీనం
రాష్ట్రంలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న క్లినిక్లపై దాడి చేసి నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన ఔషధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) డైరెక్టర్ జనరల్ వి.బి.కమలాసన్రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
చిలుకూరు ఆలయంలో ‘వివాహ ప్రాప్తి’ రద్దు: ప్రధాన అర్చకులు రంగరాజన్
-
ఈ పోలింగ్ ఏజెంట్ ఇంటర్నెట్ సెన్సేషన్.. ఎవరీ ఈశా అరోడా..?
-
ఆ సినిమా నుంచి గుణపాఠం నేర్చుకున్నా: సోనాలి బింద్రే
-
దిల్లీ కోటలో తొలి మ్యాచ్.. హైదరాబాద్ దూకుడు కొనసాగేనా?
-
కేంద్ర ఎన్నికల సంఘానికి కనకమేడల మరో లేఖ
-
సైబర్ టవర్స్ వద్ద చంద్రబాబు జన్మదిన వేడుకలు