KCR: వద్దన్నా సొరంగమా!
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం అదనపు టీఎంసీ పనిలో సొరంగం వద్దని సూచించినా మళ్లీ ఎందుకు ప్రతిపాదించారని ముఖ్యమంత్రి కేసీఆర్
ఇంజినీర్లను ప్రశ్నించిన ముఖ్యమంత్రి కేసీఆర్
ఈనాడు హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం అదనపు టీఎంసీ పనిలో సొరంగం వద్దని సూచించినా మళ్లీ ఎందుకు ప్రతిపాదించారని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంజినీర్లను ప్రశ్నించినట్లు తెలిసింది. ఎల్లంపల్లి నుంచి మధ్యమానేరు వరకు అదనంగా మరో టీఎంసీ నీటిని మళ్లించే పనులను గత ఏడాది ప్రభుత్వం చేపట్టింది. డిజైన్ల ఖరారీ దశలో అప్రోచ్ ఛానల్ సొరంగం కాకుండా కాలువ చేపట్టాలని సూచించినట్లు తెలిసింది. కొత్తగా చేపట్టే పనుల్లో వీలైనంతవరకు సొరంగం లేకుండా ప్రత్యామ్నాయం చూడాలని గతంలోనే ముఖ్యమంత్రి సూచించినట్లు సమాచారం. డీప్కట్ ఉండటంతో పాటు 530 ఎకరాల భూమిని సేకరించాల్సి రావడంతో ఇంజినీర్లు సొరంగమార్గాన్ని (టన్నెల్) ప్రతిపాదించి నిర్మాణానికి చర్యలు చేపట్టారు. అయితే సొరంగ మార్గం వద్దని చెప్పినా చేపట్టడం, ఈ విషయాన్ని తన దృష్టికి తేకపోవడం గురించి ఈ ప్రాజెక్టు ఉన్నతస్థాయి ఇంజినీర్లపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. భూసేకరణ, అప్రోచ్ఛానల్ నిర్మాణంలో ఉన్న సమస్యలను పరిగణనలోకి తీసుకొని చేపట్టామని, దీనివల్ల నిర్మాణ వ్యయం సుమారు రూ.110 కోట్లు తగ్గుతుందని సంబంధిత ఇంజినీర్లు ముఖ్యమంత్రికి వివరించినట్లు తెలిసింది.
పెరిగిన అంచనాలు మంత్రివర్గానికి
శ్రీరామసాగర్ పునరుజ్జీవ పథకంలో పెరిగిన అంచనాలను ఈ నెల 30న జరిగే మంత్రివర్గ సమావేశానికి సమర్పించనున్నట్లు తెలిసింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా మళ్లించే నీటి నుంచి శ్రీరామసాగర్కు రోజుకు ఒక టీఎంసీ నీటిని తీసుకొనేందుకు ఈ పథకాన్ని ప్రభుత్వం చేపట్టింది. రూ.1,067 కోట్లతో మొదట పరిపాలనా అనుమతి ఇవ్వగా తర్వాత రూ.1,751 కోట్లకు సవరించారు. తాజాగా ఈ పని విలువ రూ.1,999 కోట్లకు పెరిగింది. ఈ పని కోసం ఆరుచోట్ల వరదకాలువను కట్ చేసి, బ్రిడ్జిలు కట్టాల్సి వస్తోందని, ధరలు, జీఎస్టీ వంటివి కూడా పెరిగాయని ఇటీవల జరిగిన సమావేశంలో ఇంజినీర్లు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. దీనికి ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతి రాకపోవడంతో గుత్తేదారుకు రూ.170 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని నివేదించారు. పనిలో జాప్యం తదితర అంశాలపై చర్చించిన తర్వాత మంత్రివర్గం ముందు పెట్టి పెరిగిన అంచనాకు ఆమోదం తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి సూచించినట్లు తెలిసింది. దీంతో ఈ నెల 30న జరిగే మంత్రివర్గ సమావేశం ముందుకు ఈ అంశాన్ని తెచ్చేందుకు నీటిపారుదల శాఖ కసరత్తు చేస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మార్చిలోనే వడగాలులు!
దేశంలో మార్చి ఆఖరి వారంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే పరిస్థితులున్నాయి. వడగాలులకూ అవకాశాలున్నాయి. -
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన ఫొటోగ్రాఫర్, డాక్టర్ అరుణ్కుమార్ నలిమెల అరుదైన ఘనత సాధించారు. -
మౌలిక వసతులతో రెట్టింపు పని
న్యాయమూర్తులు, న్యాయవాదులు తమ విధులను గౌరవప్రదంగా నిర్వహించడానికి న్యాయస్థానాల్లో మౌలిక వసతులు కీలకమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు. -
వ్యాట్నూ తాగేశారు
మద్యం అమ్మకాల్లో కొన్నేళ్లుగా భారీ స్థాయిలో ‘పన్ను ఎగవేత’ కుంభకోణం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. -
తాకట్టులోని ఫ్లాట్లకు రిజిస్ట్రేషన్లు..!
స్థిరాస్తి వెంచర్ల పేరిట వేల మంది కొనుగోలుదారులను రూ.వందల కోట్ల మేర మోసగించినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న సాహితీ ఇన్ఫ్రాటెక్ నిర్వాహకుల మరో నిర్వాకం వెలుగులోకి వచ్చింది. -
యాదాద్రిని సందర్శించిన భారత నౌకాదళాధిపతి
భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్ తన కుటుంబ సభ్యులతో బుధవారం యాదాద్రిని సందర్శించారు. -
మధుమేహంపై పరిశోధనలకు ఎండోక్రైన్ పాంక్రియాస్ సెంటర్
క్లోమ గ్రంథిలోని ఎండోక్రైన్ పనితీరుపై అధ్యయనం చేయడం.. తద్వారా డయాబెటిస్ చికిత్స పద్ధతులు, పరిష్కారాలను అర్థం చేసుకొని పరిశోధనలు చేసేందుకు ఆసియాలో తొలిసారిగా ఎండోక్రైన్ పాంక్రియాస్ పరిశోధన కేంద్రాన్ని హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ(ఏఐజీ)లో బుధవారం అందుబాటులోకి తెచ్చారు. -
శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ దంపతులు బుధవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. -
ఎన్హెచ్ఎం నిధులు రానట్లే!
జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కింద కేంద్రం నుంచి రావాల్సిన రూ.348 కోట్ల నిధులపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆశలు వదులుకుంది. -
పశువుల మేతగా మారుతున్న ఆరుగాలం పంట
ఆరుగాలం శ్రమించి పంట పండించే రైతన్నకు కన్నీరే మిగులుతోంది. ఈ యాసంగి సీజన్లో భూగర్భ జలాలు అడుగంటి, సాగునీటి ప్రాజెక్టుల నుంచి కూడా నీరు అందక పంటలు పొట్టకు వచ్చిన దశలో ఎండిపోతున్నాయి. -
చి‘వరి’కి మిగిలింది చెలమ నీరు..
మండుతున్న ఎండలతో జిల్లాల్లో భూగర్భజలాలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. బోర్లు, బావులు, వాగుల్లో నీరు కరవైంది. -
శ్రీవారి సేవలో తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్
తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్కు తితిదే అధికారులు శ్రీవారి మూలమూర్తి దర్శనం చేయించారు. -
భారత్, ఫ్రాన్స్ మధ్య దృఢమైన దౌత్య సంబంధాలు
రాయదుర్గం టీ హబ్లో ఫ్రాన్స్ కాన్సులేట్ జనరల్ శాఖ(బ్యూరో డీ ఫ్రాన్స్) కార్యాలయాన్ని ఆ దేశ రాయబారి థియరీ మాథావు బుధవారం ప్రారంభించారు. -
చెంగిచర్ల పార్థీబస్తీలో బాధితులకు బండి పరామర్శ
హోలీ రోజు హైదరాబాద్ చెంగిచర్ల పార్థీబస్తీలో ఇరువర్గాల ఘర్షణలో గాయాలపాలైన వారిని పరామర్శించేందుకు బుధవారం వచ్చిన భాజపా జాతీయ ప్రధానకార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ను పోలీసులు అడ్డుకున్నారు. -
రాష్ట్రంలో తగ్గిన శతాధిక వృద్ధ ఓటర్లు
రాష్ట్రంలో శతాధిక వృద్ధ ఓటర్ల సంఖ్య తగ్గింది. ఏటా నిర్వహించే ఓటర్ల జాబితా సవరణ తరవాత ఈ ఏడాది ఫిబ్రవరి 8న ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలో వీరి సంఖ్య 6,292కు చేరింది. -
రెండు రోజుల్లో జస్టిస్ ఘోష్కు ‘ఉత్తర్వుల’ ప్రతి
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై న్యాయ విచారణకు కమిషన్ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల కాపీని.. కమిషన్కు నేతృత్వం వహించనున్న సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్కు నీటిపారుదల శాఖ అందించనుంది. -
ఫోన్ట్యాపింగ్ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్పై తీర్పు రిజర్వ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, సస్పెండైన డీఎస్పీ ప్రణీత్రావుల పోలీస్ కస్టడీ వ్యవహారంలో నాంపల్లి న్యాయస్థానం బుధవారం తీర్పును రిజర్వ్ చేసింది. -
టెట్ రాసేందుకు టీచర్లకు అనుమతి అవసరం లేదు
తెలంగాణలో టెట్-2024 రాసేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యాశాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన బుధవారం తెలిపారు. -
నెట్ స్కోర్తో పీహెచ్డీ ప్రవేశాలు
విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల్లో నెట్ స్కోరుతో పీహెచ్డీలో ప్రవేశాలు కల్పించాలని యూజీసీ సూచించింది. -
సంక్షిప్త వార్తలు (3)
ఆర్టీసీ కార్మికులకు 2013 వేతన సవరణకు సంబంధించిన బకాయిలు ఇవ్వడంలో విపరీత జాప్యం జరుగుతోందని ఇకనైనా వెంటనే చెల్లింపులు జరిగేలా చూడాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు ఐఎన్టీయూసీ అనుబంధ ఎస్డబ్ల్యూయూ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!