Crowdfunding: ఆశాదీపం.. క్రౌడ్ఫండింగ్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల్లోనే కాదు దేశవ్యాప్తంగా ఎన్నో వందల మందికి ప్రస్తుత కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో ‘ఆన్లైన్ మెడికల్ క్రౌడ్ ఫండింగ్’ ఓ ఆశాదీపంలా కనిపిస్తోంది.
ఆన్లైన్లో అభ్యర్థన చూసి విరాళాలిస్తున్న దాతలు
కరోనా విపత్కర వేళ ఎన్నో ప్రాణాలు నిలబెడుతున్న వైనం
ఎలాంటి వ్యాధికైనా చికిత్సకు నిధుల సమీకరణకు ఇదో మార్గం
ఆయనో ప్రభుత్వ ఉపాధ్యాయుడు. కొవిడ్ బారిన పడి విషమ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఊపిరితిత్తులు 80 శాతం మేర దెబ్బతిన్నాయి. తొలుత స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నా.. పరిస్థితి మెరుగుపడకపోవటంతో హైదరాబాద్లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు. పొదుపు చేసుకున్న సొమ్ముకు తోడు బంధుమిత్రుల నుంచి అప్పు తెచ్చింది కలిపి ఇప్పటికే దాదాపు రూ.20 లక్షలు ఖర్చయింది. ఆయన పరిస్థితి మెరుగుపడాలంటే మరో రూ.30 లక్షల వరకూ వెచ్చించాలి. అంత సొమ్ము తక్కువ వ్యవధిలో ఎలా సమకూర్చుకోవాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆయన కుటుంబానికి ‘ఆన్లైన్ మెడికల్ క్రౌడ్ ఫండింగ్’ దారి చూపించింది. గత రెండు రోజుల్లోనే రూ.2 లక్షల వరకూ విరాళాలు వచ్చాయి. ఇంకా దాతలు స్పందిస్తూనే ఉన్నారు.
ఈనాడు- అమరావతి
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల్లోనే కాదు దేశవ్యాప్తంగా ఎన్నో వందల మందికి ప్రస్తుత కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో ‘ఆన్లైన్ మెడికల్ క్రౌడ్ ఫండింగ్’ ఓ ఆశాదీపంలా కనిపిస్తోంది. కరోనా, బ్లాక్ఫంగస్ లేదా ఇతరత్రా తీవ్ర వ్యాధులు, ఆరోగ్య సమస్యలకు సంబంధించో చికిత్స కోసం ఎంతోమంది బాధితులు, వారి కుటుంబసభ్యులు తమ వద్ద అందుబాటులో ఉన్న, అప్పటి వరకూ పొదుపు చేసుకున్న డబ్బంతా ఖర్చు చేసేస్తున్నారు. బీమా సదుపాయం వంటివీ వినియోగిస్తున్నారు. కొంతమంది ఆస్తులూ అమ్ముకుంటున్నారు. అయినా ఇంకా చికిత్సకు లక్షల్లో ఖర్చుపెట్టాల్సి వస్తే దిక్కుతోచని స్థితే. కొందరైతే అప్పులు తెచ్చి చికిత్స చేయించుకుంటున్నా.. కోలుకున్నాక ఆ రుణం తీర్చలేక అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో తల్లకిందులవుతున్న పేద, మధ్యతరగతి వర్గాల వారికి ‘ఆన్లైన్ మెడికల్ క్రౌడ్ ఫండింగ్’ ఓ దారి చూపుతోంది.
ఆన్లైన్లో నమోదు చేసుకుంటే చాలు..
* బాధితులకు వైద్య ఖర్చుల కోసం ఆన్లైన్ మెడికల్ క్రౌడ్ ఫండింగ్ విధానంలో దేశ, విదేశాల నుంచి విరాళాల సమీకరణకు మిలాప్, కెట్టో, ఇంపాక్ట్గురు వంటి సంస్థలు సేవలందిస్తున్నాయి.
* చికిత్సకు అవసరమైన డబ్బును వెచ్చించే పరిస్థితి లేదా స్తోమత బాధితులకు లేనప్పుడు.. వారి కుటుంబసభ్యులు, బంధుమిత్రులు ఎవరైనా సరే నిధుల సమీకరణ చేపట్టొచ్చు.
* మిలాప్, కెట్టో, ఇంపాక్ట్గురు తదితర సంస్థల వెబ్సైట్ల్లోకి వెళ్లి బాధితుడి పేరు, చిత్రాలు, ఆరోగ్య సమస్య, చికిత్సకు సంబంధించిన పత్రాలు, వైద్యుల నివేదికలు వంటివి పొందుపరచాలి. వైద్యానికి ఎంత ఖర్చవుతుందో, విరాళాల రూపంలో ఎంత అవసరమో చెప్పాలి. బాధితులు లేదా వారి కుటుంబసభ్యుల బ్యాంక్ ఖాతా నెంబర్, ఐఎఫ్ఎస్సీ కోడ్ వంటి వివరాలివ్వాలి.
* నిధులు సమీకరిస్తున్న వారి పేరు, వివరాలతో ఓ పోస్టును రూపొందించి ఆయా సంస్థలు వారి వెబ్సైట్లో ఉంచుతాయి. తమ సామాజిక మాధ్యమ ఖాతాల్లోనూ విస్తృత ప్రచారం కల్పిస్తాయి. ఆ పోసు లింక్నూ బాధితుల కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, పరిచయస్తులు షేర్ చేయొచ్చు. వీటి ఆధారంగా బాధితులకు తెలిసిన వారితో పాటు తెలియనివారి నుంచి విరాళాలు వచ్చే అవకాశం ఉంటుంది.
* ఎంత నిధులు సమకూరాయి? అనే వివరాల్ని బాధితుల తరఫున నిధుల సమీకరణ పోస్టు పెట్టిన వారు ఎప్పటికప్పుడు ఆయా సంస్థల వెబ్సైట్లలోకి వెళ్లి తెలుసుకోవచ్చు. వైద్యఖర్చులకు అవసరమైన నిధిలో ఎంత పోగయ్యిందో దాతలకూ కనిపిస్తుంది.
* బాధితులు ఒకేసారి మొత్తం నిధిని తీసుకోవచ్చు. లేదంటే ఎప్పటికప్పుడు మెడికల్ బిల్లుల్ని వెబ్సైట్లో పొందుపరిచి వారికి సమకూరిన నిధి నుంచి డ్రా చేసుకోవచ్చు.
ఆమె ఓ సాధారణ గృహిణి. కొవిడ్ బారినపడి అత్యంత విషమ పరిస్థితుల్లోకి వెళ్లిపోయారు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స కోసం చేరగా, రూ.10 లక్షల వరకూ ఖర్చవుతుందని చెప్పారు. అంత చెల్లించే స్థోమత లేక ‘ఆన్లైన్ మెడికల్ క్రౌడ్ ఫండింగ్’ను ఆశ్రయించారు. ఇంపాక్ట్గురు అనే వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకోగా కొన్ని రోజుల్లోనే ఆమె చికిత్సకు అవసరమైన రూ.10 లక్షలూ విరాళాలుగా అందాయి.
మీకు తెలుసా!
* మన దేశంలో ప్రజలు ఏటా వేలాది కోట్ల రూపాయలు ప్రైవేటు రంగంలో వైద్యానికి ఖర్చుపెడుతున్నారు. ఇందులో 60 శాతం మాత్రమే బాధితుల పొదుపు సొమ్ము. మిగిలిన 40 శాతం అప్పులు చేసి, కుటుంబసభ్యులు, బంధుమిత్రులు ఇచ్చినదానిలో నుంచే ఖర్చు పెడుతున్నారని క్రౌడ్ఫండింగ్ సంస్థలు చెబుతున్నాయి.
దాతలకు పన్ను మినహాయింపు
* ఆన్లైన్ మెడికల్ క్రౌడ్ ఫండింగ్కు నిధులిచ్చే దాతలకు పన్ను మినహాయింపు వర్తింపజేస్తున్నారు.
* కొన్ని సంస్థలు ఈ సేవలందించేందుకు నామమాత్రపు రుసుము వసూలు చేస్తున్నాయి. అవి కూడా దాతల నుంచి తీసుకుంటున్నాయి. ఉచిత సేవలందించే సంస్థలూ ఉన్నాయి.
* కొంతమంది బాధితులకు అవసరమైన నిధి రెండు, మూడు రోజుల్లోనే సమకూరుతోంది. మరికొందరికి ఎక్కువ రోజుల సమయం పడుతోంది.
* కొవిడ్ వేళ కేవలం కొన్ని సంస్థలు.. ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చేందుకు, కొవిడ్కేర్ కేంద్రాల ఏర్పాటుకు, పీపీఈ కిట్లు అందించేందుకు, కొవిడ్ బాధిత కుటుంబాలకు సాయం చేసేందుకు ఇలా విభిన్న అవసరాలకు కూడా నిధులు సమీకరిస్తున్నాయి.
ఆన్లైన్ మెడికల్ క్రౌడ్ ఫండింగ్ చేసే కొన్ని సంస్థల వెబ్సైట్ల వివరాలు
* milaap.org
* ketto.org
* impactguru.com
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ టెన్త్ ఫలితాల్లో నాగసాయి మనస్వీ 599/600
ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి పదో తరగతిలో వచ్చిన మార్కులు.. 100, 99, 100, 100, 100, 100.. -
ఒంటిమిట్టలో రాములోరి వైభవం
వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ జానకీరాముల పరిణయ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. -
30న తెలంగాణ పదో తరగతి ఫలితాలు
తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలు ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యా కమిషనర్ కార్యాలయంలో ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేయనున్నారు. -
సాగర్ టెయిల్పాండ్ నుంచి నీటి తరలింపు అభ్యంతరకరం
కృష్ణా బోర్డుకు సమాచారం ఇవ్వకుండా నాగార్జునసాగర్ టెయిల్పాండ్ నుంచి నాలుగు టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోవడంపై తెలంగాణ అభ్యంతరం తెలిపింది. -
వెంకయ్యనాయుడికి పద్మవిభూషణ్ ప్రదానం
మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సోమవారం ఇక్కడి రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము చేతులమీదుగా పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్నారు. -
జోరున కురిసి.. భగ్గున మండి
రాష్ట్రంలో ఎండ, వానలు రైతులను, సామాన్యులను ఆగమాగం చేస్తున్నాయి. సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తుండగా.. ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. -
దువ్వూరి అనుభవాలకు అక్షర రూపం
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తన వ్యక్తిగత, వృత్తిపరమైన అనుభవాలకు అక్షరరూపం ఇచ్చారు. ‘జస్ట్ ఏ మెర్సినరీ? నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్’ పేరుతో ఆంగ్లంలో పుస్తకం రాశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా పనిచేయాలి
పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ, సమన్వయంతో పనిచేయాలని డీజీపీ రవిగుప్తా పోలీసు అధికారులకు సూచించారు. -
తిరుమలలో వసంతోత్సవ వైభవం
శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల్లో భాగంగా రెండోరోజు సోమవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి స్వర్ణ రథంపై కొలువుదీరి తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. -
శ్రీశైల మల్లన్న సేవలో చంద్రబాబు దంపతులు
తెదేపా అధినేత చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు సోమవారం నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శించారు. ఉదయం 11.52 గంటలకు హైదరాబాద్ నుంచి సున్నిపెంటకు వచ్చిన వారికి హెలిప్యాడ్ వద్ద మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, -
చిత్ర వార్త
బ్రిటన్లోని కోవెంట్రీ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో విలెన్ హాల్ సోషల్ క్లబ్ ప్రాంగణంలో ఇటీవల ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించారు. -
కాలువలో నాటేసినట్లు..
వరిపైరు కాదిది.. కాళేశ్వరం ప్రాజెక్ట్ గ్రావిటీ కాల్వ.. అచ్చం వరి నాటు వేసినట్లు కనిపిస్తోంది కదూ... జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్నెపల్లి పంపుహౌస్ నుంచి అన్నారం బ్యారేజీకి.. -
కొత్త వంగడాలను రూపొందించాలి
వాతావరణ మార్పులను తట్టుకోవడంతో పాటు పౌష్టికాహార భద్రత కల్పించే కొత్త వంగడాల రూపకల్పనపై వ్యవసాయ శాస్త్రవేత్తలు దృష్టి సారించాలని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ వెంకటరమణ పిలుపునిచ్చారు. -
ఇదీ సంగతి!
-
మిరప రైతుకు మిగిలింది కన్నీళ్లే..
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గిట్టుబాటు ధర లభించకపోవటంతో మిరప రైతులు ఆవేదన చెందుతున్నారు. విపణికి సోమవారం సుమారు 13 వేల బస్తాల ఎండు మిరప, 2 వేల బస్తాల తాలు మిరపను తెచ్చారు. -
రాహిల్ బెయిల్ రద్దుపై హైకోర్టు నిర్ణయం వాయిదా
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో హిట్ అండ్ రన్ కేసులో నిందితుడైన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ను అరెస్ట్ చేయరాదన్న మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్పై నిర్ణయాన్ని హైకోర్టు సోమవారం వాయిదా వేసింది. -
అన్నారం బ్యారేజీలో ఇసుక తొలగింపు ప్రారంభం
అన్నారం బ్యారేజీ ఎగువన ఇసుక మేటల తొలగింపు ప్రారంభమైంది. గతేడాది నవంబరులో బ్యారేజీకి దిగువన కొన్ని పియర్స్ వద్ద సీపేజీ ఏర్పడంతో మరమ్మతులు చేపట్టారు. -
మే నెలాఖరు వరకు తాగునీటికి లోటు లేదు
రాష్ట్రంలో మే నెలాఖరు వరకు తాగునీటికి ఎలాంటి కొరత లేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. నీటి సరఫరా పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని, అంతరాయం ఉన్న ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. -
సివిల్స్ ర్యాంకర్ అక్షయ్ను అభినందించిన సీఎం
సివిల్స్-2023 ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో 196వ ర్యాంకు సాధించిన జి.అక్షయ్ దీపక్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభినందించారు. -
జేఈఈ మెయిన్-2లో పది ప్రశ్నలకు ‘కీ’ మార్పు
జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షల తుది ‘కీ’ని జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ(ఎన్టీఏ) సోమవారం విడుదల చేసింది. పది ప్రశ్నలకు ‘కీ’లో మార్పు ఉండగా.. నాలుగు ప్రశ్నలకు సంబంధించి మార్కులు కలపనున్నారు. -
పూడికతీతపై నీటిపారుదల శాఖ దృష్టి
జలాశయాలలో పూడిక మేటలతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతున్న నేపథ్యంలో సిల్ట్ తొలగింపునకు ఉన్న విధానాలపై తెలంగాణ అధ్యయనం చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
-
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా