Petrol: 4 జిల్లాల్లో సెంచరీ దాటిన పెట్రోల్‌ ధర

కరోనాతో అల్లాడుతున్న ప్రజలకు.. గోరుచుట్టుపై రోకటిపోటులా చమురు ధరలు పెరుగుతున్నాయి. శుక్రవారం పెట్రోలుపై 28 పైసలు, డీజిల్‌పై 30 పైసలు పెంచారు.

Updated : 05 Jun 2021 11:22 IST

ఈనాడు, హైదరాబాద్‌: కరోనాతో అల్లాడుతున్న ప్రజలకు.. గోరుచుట్టుపై రోకటిపోటులా చమురు ధరలు పెరుగుతున్నాయి. శుక్రవారం పెట్రోలుపై 28 పైసలు, డీజిల్‌పై 30 పైసలు పెంచారు. దీంతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ.98.48, డీజిల్‌ ధర రూ.93.08కి చేరింది. మరోవైపు ఇంధనం నిల్వ కేంద్రం నుంచి రవాణా దూరం ఆధారంగా ఇప్పటికే రాష్ట్రంలోని ఆదిలాబాద్‌, జోగులాంబ జిల్లాల్లో లీటరు పెట్రోలు ధర రూ.వంద దాటింది. కుమురం భీం, నిర్మల్‌ జిల్లాలూ శుక్రవారం ఈ జాబితాలో చేరాయి. మొత్తంగా నాలుగు జిల్లాల్లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.వంద దాటడం గమనార్హం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని