PRC: వేతన హుషార్
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అధికారులు, పింఛనర్ల వేతన సవరణ (పే రివిజన్) అంశాలు మంగళవారం మంత్రిమండలి ఆమోదానికి రానున్నాయి. శాసనసభలో గత మార్చి 22న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన పీఆర్సీ, ఫిట్మెంటు,
అమల్లోకి రానున్న పీఆర్సీ
నేడు మంత్రిమండలి ఆమోదానికి ఆ వెంటనే ఉత్తర్వులు
పలు ఇతర అంశాలపైనా నిర్ణయాలు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అధికారులు, పింఛనర్ల వేతన సవరణ (పే రివిజన్) అంశాలు మంగళవారం మంత్రిమండలి ఆమోదానికి రానున్నాయి. శాసనసభలో గత మార్చి 22న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన పీఆర్సీ, ఫిట్మెంటు, ఇతర నిర్ణయాల అమలును ఎజెండాలో చేర్చారు. మంత్రిమండలి ఆమోద ముద్ర అనంతరం ఇవి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. 2020 ఏప్రిల్ నుంచి వర్తించే విధంగా 30 శాతం ఫిట్మెంట్, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులకు సైతం వర్తింపు, పదవీ విరమణ వయోపరిమితి 61 ఏళ్లకు పెంపు, గ్రాట్యుటీ రూ.16 లక్షలు, 70 ఏళ్లకు అదనపు పింఛన్, విధి నిర్వహణలో మరణించిన సీపీఎస్ ఉద్యోగులకు కుటుంబ పింఛన్, ఉద్యోగుల నగదు రహిత ఆరోగ్య సేవల పథకం (ఎంప్లాయీస్ హెల్త్ స్కీం) నూతన విధివిధానాల రూపకల్పనకు స్టీరింగు కమిటీ ఏర్పాటు, ప్రాథమిక పాఠశాలల్లో పది వేలకు చేరే విధంగా అదనపు ప్రధానోపాధ్యాయ (స్కూల్ అసిస్టెంట్ల సమానస్థాయి) పోస్టుల మంజూరు, అంతర్ జిల్లాల బదిలీలు వంటి నిర్ణయాలను సీఎం ప్రకటించారు. కరోనా దృష్ట్యా వీటి అమలులో జాప్యం ఏర్పడింది. తాజాగా లాక్డౌన్ ఎత్తివేసేందుకు సిద్ధమవుతున్న ప్రభుత్వం పీఆర్సీకి మోక్షం కలిగించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి సీఎం ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ పూర్తిస్థాయి నివేదికను ఇప్పటికే సిద్ధం చేసింది. మంత్రిమండలి ఆమోదం అనంతరం ఉత్తర్వులను జారీ చేయనుంది.
లాక్డౌన్ సడలింపుపై నిర్ణయం
సాయంత్రం ఆరు వరకు లాక్డౌన్ కాలం సడలింపు, పూర్తిస్థాయిలో ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణ, రాత్రిపూట పకడ్బందీగా కర్ఫ్యూ, కరోనా నియంత్రణ, నీటిపారుదల శాఖలో అదనపు ఆయకట్టు కోసం ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడం, వాటి పురోగతి, పునర్వ్యవస్థీకరణపై నిర్ణయం తీసుకోనుంది. 15 నుంచి రైతుబంధు సాయం పంపిణీ, వానాకాలం సీజన్కు ఎరువులు, పురుగు మందులు, విత్తనాల సరఫరా, ఆయకట్టు పెరుగుదల, రాష్ట్రంలో కల్తీవిత్తనాల నిరోధం కోసం క్యూఆర్ కోడ్ ఆధారిత విత్తన విధానం, బయో ఫెర్టిలైజర్స్కు ఆర్డినెన్స్లకు ఆమోదం, కొత్త ఉద్యోగ నియామకాలపై స్పష్టత ఇవ్వనుంది. రాష్ట్రంలో 19 జిల్లాల్లోని ప్రధాన ఆసుపత్రుల్లో ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్ష కేంద్రాలను 9వ తేదీన ఎవరెవరు ఎక్కడెక్కడ ప్రారంభించాలో నిర్ణయించనుంది.
హుజూరాబాద్కు సంబంధించి..
ఈటల రాజేందర్ రాజీనామా చేస్తే హుజూరాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తుందనే భావనతో ఆ నియోజకవర్గానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలను మంత్రిమండలి తీసుకోనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈటల రాజీనామా అనంతరం వీటిని వెల్లడించే వీలుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టెట్పై ఉపాధ్యాయుల్లో గందరగోళం
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024పై ఉపాధ్యాయుల్లో సందేహాలు నెలకొన్నాయి. వాటిని నివృత్తి చేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు విద్యాశాఖ ఉన్నతాధికారులను కలిసి విన్నవిస్తున్నారు. -
గురుకులాల్లో భర్తీకాని పోస్టులపై నిర్ణయం తీసుకోండి: హైకోర్టు
గురుకులాల్లో డిగ్రీ, జూనియర్ లెక్చరర్లు, పోస్టు గ్రాడ్యుయేట్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, బోధనేతర సిబ్బంది పోస్టులకు ఎంపికైన వారు బాధ్యతలు స్వీకరించకపోవడంతో ఏర్పడిన ఖాళీల్లో పిటిషనర్ల నియామకాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
ఇంటర్ కళాశాలలకు మే 31 వరకు సెలవులు
రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించింది. ఈ నెల 31 నుంచి మే 31వ తేదీ వరకు సెలవులు ఉంటాయని గురువారం వెల్లడించింది. -
‘సాహితీ’ డబుల్ దందాపై పోలీసుల ఆరా
కార్తికేయ పనోరమ ప్రాజెక్టు పేరిట సాహితీ ఇన్ఫ్రా పాల్పడిన మోసాలపై హైదరాబాద్ సైబర్క్రైం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
జెన్కో అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్ష వాయిదా
పార్లమెంట్ ఎన్నికల కోడ్ దృష్ట్యా తెలంగాణ జెన్కోలో అసిస్టెంట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, కెమికల్) పోస్టుల భర్తీకి ఈ నెల 31న ఆన్లైన్లో నిర్వహించాల్సిన కంప్యూట్ ఆధారిత పరీక్ష (సీబీటీ)ను వాయిదా వేసినట్లు జెన్కో సీఎండీ తెలిపారు. -
సరిహద్దు రాష్ట్రాల్లో ఓటు హక్కు వినియోగానికి వెసులుబాటు
తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకూ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి మే 13న పోలింగ్ జరగనుండగా.. ఆ రోజున వేతనంతో కూడిన సెలవుగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. -
పర్యాటకులను వేధించొద్దు
తనిఖీల సందర్భంగా పర్యాటకులను వేధించొద్దంటూ అన్ని రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) తాజాగా లేఖ రాసింది. -
న్యాయస్థానం ఆదేశాలను పాటించడంలేదు
జ్యుడిషియల్ కస్టడీ సమయంలో తనకు కల్పించాల్సిన సౌకర్యాల విషయంలో కోర్టు జారీచేసిన ఆదేశాలను తిహాడ్ జైలు అధికారులు పాటించడంలేదని భారాస ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. -
హనుమకొండలో కేటీఆర్పై కేసు నమోదు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాసరావు తదితరులు హనుమకొండ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు. -
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య ప్రమాణం
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య గురువారం ఉదయం ప్రమాణం చేశారు. మొదటి కోర్టు హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ మౌసమీ భట్టాచార్యతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే ప్రమాణం చేయించారు. -
ప్రత్యేక రైళ్ల పొడిగింపు
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఐదు జతల ప్రత్యేక రైళ్లను మరికొద్దిరోజులు పొడిగిస్తున్నట్లు ద.మ.రైల్వే గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. -
పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించండి
బూటకపు పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించాలని సీపీఐ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరుతో గురువారం మీడియాకు ఓ లేఖ విడుదల చేశారు. -
సంక్షిప్త వార్తలు
ఫోన్ ట్యాపింగ్ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్గౌడ్, నాయకుడు తుమ్మేటి సమ్మిరెడ్డి గురువారం డీజీపీ రవిగుప్తాకు ఫిర్యాదు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్